డీసీసీబీలో ఆధిపత్య పోరు
డీసీసీబీ అధికారులు, పాలకవర్గం మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. కొన్ని నిర్ణయాల్లో ఇరు వర్గాల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి.
మహబూబ్నగర్లోని డీసీసీబీకి సంబంధించిన దుకాణ సముదాయం
ఈనాడు, మహబూబ్నగర్: డీసీసీబీ అధికారులు, పాలకవర్గం మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. కొన్ని నిర్ణయాల్లో ఇరు వర్గాల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. అధికారులు చెప్పిన దానికి పాలకవర్గం కాదనడం, పాలకవర్గం నిర్ణయాలకు అధికార యంత్రాంగం అడ్డుకట్ట వేయడం జరుగుతోంది. ఫలితంగా డీసీసీబీ పరిధిలో పలుచోట్ల అక్రమాలు జరిగినా చర్యలకు వెనకడుగు వేయాల్సి వస్తోంది. వనపర్తిలోని డీసీసీబీ పరిధిలో ఉన్న 22 దుకాణ సముదాయాల కాంప్లెక్స్పై అధికారులు, పాలకవర్గం మధ్య పెద్ద హైడ్రామా కొనసాగుతోంది. ఈ సముదాయాలను అద్దెకి ఇవ్వకూడదని నిబంధనలున్నాయి. కొందరు తెర వెనుక ఉండి కిరాయికి ఇచ్చి డబ్బు సొంతానికి వాడుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో అధికారులు, పాలకవర్గంలోని కొందరు డైరెక్టర్ల మధ్య అంతర్గత పోరు నడిచినట్లు సమాచారం.
వనపర్తిలోని డీసీసీబీ కాంప్లెక్స్లో దుకాణాలు
ఖాళీ చేయాలని ఆదేశాలున్నా..
వనపర్తిలోని డీసీసీబీ దుకాణ సముదాయాలను ఖాళీ చేయించాలని ఎప్పటి నుంచో ఆదేశాలున్నాయి. ఖాళీ చేయించినట్లు లేఖలు సమర్పించినా అవి అలాగే కొనసాగాయి. ఇటీవలే ఈ సముదాయాలు ఖాళీ చేయించి కూల్చివేయాలని ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. దీని ద్వారా ప్రతి నెల రూ.లక్షల్లో వచ్చే ఆదాయం కోల్పోతుండటంతో అధికార యంత్రాంగం, పాలకవర్గం మధ్య విభేదాలు తలెత్తినట్లు సమాచారం. ఈ ఆదాయం మొత్తం ఒకవైపే వెళ్తుండటంతో దీనిపై ఒకరికొకరు ఫిర్యాదు చేసుకునే వరకు వెళ్లింది. ఏకంగా ఆర్బీఐకు కూడా లేఖ రాశారు. మరోవైపు మహబూబ్నగర్ పట్టణంలోని డీసీసీబీ పేరు మీద పెద్ద దుకాణ సముదాయం ఉంది. తెలంగాణ చౌరస్తా సమీపంలోని ఈ సముదాయాల ద్వారా నెలకు రూ.లక్షల్లో ఆదాయం వస్తోంది. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం డీసీసీబీ వీటిని ఖాళీ చేయించాలి. మొత్తం 30కుపైగా ఉన్న ఈ దుకాణాల ద్వారా వస్తున్న అద్దె ఎక్కడికి పోతుందోనన్న ప్రశ్న తలెత్తుతోంది. అధికారులు ఉచితంగానే వ్యాపారులు మడిగెల్లో ఉంటున్నారని పైకి చెబుతున్నా రూ.లక్షలు పలువురు జేబుల్లోకి వెళ్తున్నట్లు సమాచారం. ఈ విషయంలోనూ ఇరువర్గాల మధ్య పోరు నడిచినట్లు సమాచారం. గతంలోనూ నారాయణపేట సొసైటీ పరిధిలో షాపింగ్ కాంప్లెక్స్ పేరుతో జరిగిన అక్రమాల వ్యవహారం ఠాణా వరకు వెళ్లింది. ఇందులో అధికారులు క్రియాశీల పాత్ర వహించగా రాజకీయ నేతలు మాత్రం అక్రమాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ఈ సమయంలోనూ విబేధాలు తారస్థాయికి చేరాయి. మహబూబ్నగర్ డీసీసీబీ కేంద్ర కార్యాలయం పరిధిలో మొత్తం 78 సంఘాలుండగా పలు సొసైటీల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. సొసైటీ పాలకవర్గంతోపాటు కొందరు నిధులను కాజేసినట్లు ఆరోపణలున్నాయి. వీటిపై ఎప్పటికప్పుడు ఆడిట్ నిర్వహించి చర్యలు తీసుకోవాలి. ఈ బాధ్యత డీసీవోలు తీసుకుంటారు. పాలకవర్గం, డీసీవో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని డీసీసీబీ ఆరోపిస్తోంది. అక్రమాలు జరిగిన చోట డబ్బు రికవరీలోనూ ఇదే తంతు కొనసాగుతోంది. ఈ అంతర్గత పోరుతో డీసీసీబీ మసకబారే పరిస్థితి నెలకొంది. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారిస్తేనే కార్యకలాపాలు గాడిలో పడటంతోపాటు అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చు.
ఎక్కడైనా అక్రమాలు మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటున్నాం. నోటీసులు జారీ చేస్తున్నాం. వనపర్తి కాంప్లెక్స్ను ఖాళీ చేయాలని గతంలోనే నోటీసులిచ్చాం. మహబూబ్నగర్లోనూ కాంప్లెక్స్ ఉంది. అక్కడ దుకాణ సముదాయాలు ఉన్నప్పటికీ ఉచితంగా ఉంటున్నారు. కొందరు కోర్టుకు వెళ్లారు.
లక్ష్మయ్య, సీఈవో, డీసీసీబీ మహబూబ్నగర్ కేంద్ర కార్యాలయం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో చెలగాటం!
[ 06-07-2024]
పాలమూరులో అక్రమ వ్యాపారులు అమాయకుల పాలిట శాపంగా మారుతోంది. అనుమతులు లేకుండా ఇసుక, మొరం, ఇటుక వ్యాపారాలు చాలావరకు అనుమతుల్లేకుండా జరుగుతున్నాయి. -
నూతన చట్టాలతో.. సత్వర న్యాయం
[ 06-07-2024]
కొత్త చట్టాలైన భారత న్యాయ్ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్ ద్వారా బాధితులకు సత్వర న్యాయం అందుతుందని ఎస్పీ డి.జానకి తెలిపారు. -
మీ సేవ నగదు రహితం
[ 06-07-2024]
మీ సేవ కేంద్రాల నిర్వహణలో అధిక వసూళ్లకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. జవాబుదారీతనం ఉండాలని.. ప్రజలు నేరుగా డబ్బు చెల్లించకుండా ఈనెల ఒకటో తేదీ నుంచి క్యాష్లెస్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. -
ప్రభుత్వ ఆసుపత్రిలో నీటి ఎద్దడి
[ 06-07-2024]
మహబూబ్నగర్ జనరల్ ఆసుపత్రిలో నీటి ఎద్దడితో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వేసవికాలంలో నీటి కటకట ఏర్పడింది. ప్రస్తుతం వానాకాలంలో కూడా అదే సమస్య నెలకొంది. -
సిరిగల వారికి చెల్లును..
[ 06-07-2024]
సిరి కొద్దీ చిన్నెలు.. అని మన పూర్వీకులు అంటారు.. ఆర్థిక స్థితి బాగుంటే ఎన్నైనా చేసుకోవచ్చు. కానీ పక్కవారిని చూసి వివాహఖర్చులు పెంచుకుని అప్పులపాలవ్వడం ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో చాలాప్రాంతాల్లో చూస్తున్నాం. -
బదిలీ అయినా.. పాత స్థానాల్లోనే!
[ 06-07-2024]
జిల్లాలో 501 మంది ఉపాధ్యాయులు బదిలీ చేస్తూ.. రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. బదిలీ అయిన వారిలో 155 మందిని జిల్లా విద్యాశాఖ అధికారులు రిలీవ్ చేయలేదు. -
ప్రతి పల్లెకు ప్రభుత్వ బడి లక్ష్యం నెరవేరేనా?
[ 06-07-2024]
గతంలో మూతపడిన ప్రతి పాఠశాలను ఈఏడాదినుంచి తెరిపించి బడులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించినా విద్యాశాఖ ప్రస్తుతం వాటి ఊసే ఎత్తడంలేదు. -
తుంపర, బిందు సేద్యం విస్తరణకు అడుగులు
[ 06-07-2024]
జిల్లా రైతులు అత్యధికంగా వర్షాధార పంటలు సాగు చేస్తుంటారు. మరికొందరు బోరుబావులపై ఆధారపడుతున్నారు. వరి వంటి పంటలకు నీటి వినియోగం అధికం. -
సేవలకు సిద్ధం.. ఆదర్శ పోలీసు స్టేషన్
[ 06-07-2024]
ఆధునిక హంగులతో భిన్నంగా నిర్మించిన ధన్వాడ మోడల్ పోలీసు స్టేషన్ భవనం సేవలకు సిద్ధమైంది. రూ. 3 కోట్లు ఖర్చుతో జుబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ తరహాలో దీని నిర్మించారు. -
కొత్త చట్టాలతో సత్వర న్యాయం
[ 06-07-2024]
కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాల ద్వారా కేసుల నమోదు, ప్రత్యక్షంగా ఆన్లైన్ ద్వారా పారదర్శకంగా చేయవచ్చని ఎస్పీ రక్షితకృష్ణమూర్తి అన్నారు. -
అచ్చంపేట పుర ఛైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధం
[ 06-07-2024]
అచ్చంపేట పురపాలిక ఛైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఎన్నికల అధికారి, స్థానిక ఆర్డీవో మాధవి ఆధ్వర్యంలో శనివారం ఉదయం 11 గంటలకు ఛైర్మన్ ఎన్నిక నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. -
బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి పదేళ్ల్ల జైలు
[ 06-07-2024]
ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడికి రాజేంద్రనగర్లోని ప్రత్యేక పోక్సో కోర్టు జడ్జి పి.ఆంజనేయులు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించారు. -
టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం.. యువకుడి మృతి
[ 06-07-2024]
టిప్పర్ డ్రైవర్ అజాగ్రత్త వల్ల ఓ యువకుడు మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు కథనం మేరకు.. బిహార్ రాష్ట్రానికి చెందిన లాలుయాదవ్(27) మండలంలోని పలుగుమీదితండా గ్రామ శివారులోని ఓ పరిశమ్రలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. -
పట్టణ ప్రణాళికాధికారిపై దాడి
[ 06-07-2024]
ఇళ్ల మధ్య ఉన్న మిర్చి గిర్నిని జప్తు చేసేందుకు వెళ్లిన పట్టణ ప్రణాళికాధికారి విజయ్కుమార్ పై శ్రీకాంత్ అనే వ్యక్తి దాడికి పాల్పడిన సంఘటన శుక్రవారం పట్టణంలోని గాంధీనగర్లో చోటుచేసుకుంది.