వీసీ లేక.. సమస్యలు తీరక!
పాలమూరు విశ్వవిద్యాలయం(పీయూ) పాలక మండలి గడువు ముగియడం, శాశ్వత ఉప కులపతి లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
పాలమూరు విశ్వవిద్యాలయం, న్యూస్టుడే : పాలమూరు విశ్వవిద్యాలయం(పీయూ) పాలక మండలి గడువు ముగియడం, శాశ్వత ఉప కులపతి లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ ఏడాది ఇంజినీరింగ్ సహా కొత్త కోర్సులు ప్రారంభిస్తారని యువత భావించినా.. ఆశలు అడియాసలే అయ్యాయి. బోధనా సిబ్బంది ఖాళీలు వెక్కిరిస్తున్నా.. కొత్తగా వారిని తీసుకునే పరిస్థితి లేదు.. ఉప కులపతి నియామకంపైనా స్పష్టత కొరవడింది. మే 21తో రెగ్యులర్ వీసీ పదవీ కాలం ముగియడంతో పీయూకు సీనియర్ ఐఏఎస్ అధికారి, ప్రణాళికా సంఘం రాష్ట్ర ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీంను ఇన్ఛార్జి వీసీగా ప్రభుత్వం నియమించింది. జూన్ 15వ తేదీ వరకు ఇన్ఛార్జి వీసీగా కొనసాగుతారని ప్రభుత్వం ఉత్వర్వుల్లో పేర్కొంది. గడువు ముగియడంతో వీసీ నియామకం జరిగే వరకు కొనసాగుతారని మరోసారి ఉత్వర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని 10 వర్సిటీల్లో కొత్త వీసీల నియామకానికి సెర్చ్ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు. ఇన్ఛార్జి వీసీ నియామకమై 40 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఒక్కసారి కూడా వర్సిటీకి రాలేదు. వర్సిటీకి సంబంధించి వీసీ సంతకాలు, నిర్ణయాల కోసం అధికారులు హైదరాబాద్కు వెళ్లాల్సి వస్తోంది. ఇన్ఛార్జి వీసీ పరిపాలనా నిర్ణయాలు తీసుకునేందుకు ఆస్కారం లేకపోవటంతో అభివృద్ధి పనులు కుంటుపడ్డాయి. రెగ్యులర్ రిజిస్ట్రార్ కూడా సెలవుల్లో ఉన్నారు. వీసీ ఉన్నప్పుడు క్యాంపస్లోని విద్యార్థుల రోజువారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించేవారు. ఇప్పుడు ఊరడింపులు తప్ప సమస్యలు పరిష్కారం కావటం లేదు. పీయూ పరిధిలో వనపర్తి, జోగులాంబ గద్వాల, కొల్లాపూర్లలో పీజీ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు సాధనకు న్యాక్లో మెరుగైన గుర్తింపు సాధించాలి. రెగ్యులర్ వీసీ లేకపోవటం వల్ల ఇందుకు కసరత్తు చేసే పరిస్థితి లేదు. బోధకులకు, పరిశోధకులకు మార్గదర్శనం లేక విద్యాబోధన వెనకబడింది. ఎంఎస్డబ్ల్యూ (మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్) విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు అధ్యయన యాత్రలకు వెళ్లేందుకు వీసీ అనుమతి అవసరం. రెగ్యులర్ వీసీ లేక అధ్యయన యాత్రలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. వీసీ లేకపోవటంతో బోధనేతర సిబ్బంది వేతన పెంపు పెండింగ్లో ఉండిపోయింది. వీసీ నియామకం ఎప్పటికి పూర్తవుతుందో అంతుపట్టడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఇబ్బందులు లేకుండా చర్యలు
కొన్ని సందర్భాల్లో అత్యవసరమైనప్పుడు హైదరాబాదుకు ఫైల్స్ తీసుకెళ్తే.. ఇన్ఛార్జి వీసీ వివరాలు అడిగి ఆమోదం తెలుపుతూ సంతకం చేస్తున్నారు. ఎంఎస్డబ్ల్యూ విద్యార్థులు విజ్ఞాన యాత్రలకు బడ్జెట్ కేటాయింపు, భద్రత తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇతర అన్ని రకాల అంశాల్లో వాట్సాప్ ద్వారా నివేదికలు ఎప్పటికప్పుడు పంపిస్తున్నాం. విద్యార్థుల సమస్యలు వేగంగా పరిష్కరిస్తున్నాం.
డా.మధుసూదన్రెడ్డి, ఇన్ఛార్జి రిజిస్ట్రార్, పీయూ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాతృత్వం చాటుకున్న ఎస్ఐ
[ 06-07-2024]
శాంతినగర్ పట్టణంలో మానసిక స్థితి సరిగా లేనీ మహిళకు వైద్య సహాయము, ఆహారం అందించి ఎస్ఐ సంతోష్ దాతృత్వం చాటుకున్నారు. -
సహకార సంఘాల ద్వారానే అభివృద్ధి
[ 06-07-2024]
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారానే రైతుల అభివృద్ధి సాధ్యమవుతుందని అయిజ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు పోతుల మధుసూదన్ రెడ్డి అన్నారు. -
ముఖర్జీ ఆశయాలను కొనసాగిద్దాం
[ 06-07-2024]
జన్ సంఘ్ పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు గద్వాల పట్టణం లోని డికె.బంగ్లాలో ఘనంగా నిర్వహించారు. -
ప్రాణాలతో చెలగాటం!
[ 06-07-2024]
పాలమూరులో అక్రమ వ్యాపారులు అమాయకుల పాలిట శాపంగా మారుతోంది. అనుమతులు లేకుండా ఇసుక, మొరం, ఇటుక వ్యాపారాలు చాలావరకు అనుమతుల్లేకుండా జరుగుతున్నాయి. -
నూతన చట్టాలతో.. సత్వర న్యాయం
[ 06-07-2024]
కొత్త చట్టాలైన భారత న్యాయ్ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్ ద్వారా బాధితులకు సత్వర న్యాయం అందుతుందని ఎస్పీ డి.జానకి తెలిపారు. -
మీ సేవ నగదు రహితం
[ 06-07-2024]
మీ సేవ కేంద్రాల నిర్వహణలో అధిక వసూళ్లకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. జవాబుదారీతనం ఉండాలని.. ప్రజలు నేరుగా డబ్బు చెల్లించకుండా ఈనెల ఒకటో తేదీ నుంచి క్యాష్లెస్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. -
ప్రభుత్వ ఆసుపత్రిలో నీటి ఎద్దడి
[ 06-07-2024]
మహబూబ్నగర్ జనరల్ ఆసుపత్రిలో నీటి ఎద్దడితో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వేసవికాలంలో నీటి కటకట ఏర్పడింది. ప్రస్తుతం వానాకాలంలో కూడా అదే సమస్య నెలకొంది. -
సిరిగల వారికి చెల్లును..
[ 06-07-2024]
సిరి కొద్దీ చిన్నెలు.. అని మన పూర్వీకులు అంటారు.. ఆర్థిక స్థితి బాగుంటే ఎన్నైనా చేసుకోవచ్చు. కానీ పక్కవారిని చూసి వివాహఖర్చులు పెంచుకుని అప్పులపాలవ్వడం ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో చాలాప్రాంతాల్లో చూస్తున్నాం. -
బదిలీ అయినా.. పాత స్థానాల్లోనే!
[ 06-07-2024]
జిల్లాలో 501 మంది ఉపాధ్యాయులు బదిలీ చేస్తూ.. రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. బదిలీ అయిన వారిలో 155 మందిని జిల్లా విద్యాశాఖ అధికారులు రిలీవ్ చేయలేదు. -
ప్రతి పల్లెకు ప్రభుత్వ బడి లక్ష్యం నెరవేరేనా?
[ 06-07-2024]
గతంలో మూతపడిన ప్రతి పాఠశాలను ఈఏడాదినుంచి తెరిపించి బడులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించినా విద్యాశాఖ ప్రస్తుతం వాటి ఊసే ఎత్తడంలేదు. -
తుంపర, బిందు సేద్యం విస్తరణకు అడుగులు
[ 06-07-2024]
జిల్లా రైతులు అత్యధికంగా వర్షాధార పంటలు సాగు చేస్తుంటారు. మరికొందరు బోరుబావులపై ఆధారపడుతున్నారు. వరి వంటి పంటలకు నీటి వినియోగం అధికం. -
సేవలకు సిద్ధం.. ఆదర్శ పోలీసు స్టేషన్
[ 06-07-2024]
ఆధునిక హంగులతో భిన్నంగా నిర్మించిన ధన్వాడ మోడల్ పోలీసు స్టేషన్ భవనం సేవలకు సిద్ధమైంది. రూ. 3 కోట్లు ఖర్చుతో జుబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ తరహాలో దీని నిర్మించారు. -
కొత్త చట్టాలతో సత్వర న్యాయం
[ 06-07-2024]
కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాల ద్వారా కేసుల నమోదు, ప్రత్యక్షంగా ఆన్లైన్ ద్వారా పారదర్శకంగా చేయవచ్చని ఎస్పీ రక్షితకృష్ణమూర్తి అన్నారు. -
అచ్చంపేట పుర ఛైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధం
[ 06-07-2024]
అచ్చంపేట పురపాలిక ఛైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఎన్నికల అధికారి, స్థానిక ఆర్డీవో మాధవి ఆధ్వర్యంలో శనివారం ఉదయం 11 గంటలకు ఛైర్మన్ ఎన్నిక నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. -
బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి పదేళ్ల్ల జైలు
[ 06-07-2024]
ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడికి రాజేంద్రనగర్లోని ప్రత్యేక పోక్సో కోర్టు జడ్జి పి.ఆంజనేయులు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించారు. -
టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం.. యువకుడి మృతి
[ 06-07-2024]
టిప్పర్ డ్రైవర్ అజాగ్రత్త వల్ల ఓ యువకుడు మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు కథనం మేరకు.. బిహార్ రాష్ట్రానికి చెందిన లాలుయాదవ్(27) మండలంలోని పలుగుమీదితండా గ్రామ శివారులోని ఓ పరిశమ్రలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. -
పట్టణ ప్రణాళికాధికారిపై దాడి
[ 06-07-2024]
ఇళ్ల మధ్య ఉన్న మిర్చి గిర్నిని జప్తు చేసేందుకు వెళ్లిన పట్టణ ప్రణాళికాధికారి విజయ్కుమార్ పై శ్రీకాంత్ అనే వ్యక్తి దాడికి పాల్పడిన సంఘటన శుక్రవారం పట్టణంలోని గాంధీనగర్లో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఇరాన్ ఎన్నికలపై అమెరికా కీలక వ్యాఖ్యలు
-
సామాన్యుడిలా సూపర్ మార్కెట్కు బిలియనీర్.. ఇంతకీ ఎవరీయన?
-
జమ్ముకశ్మీర్లో నలుగురు ఉగ్రవాదుల హతం.. అమరులైన ఇద్దరు జవాన్లు
-
హిమాచల్ను ముంచెత్తుతున్న వర్షాలు.. ధర్మశాలలో 214.6మి.మీ వర్షపాతం
-
తెలంగాణలో ఏడాదికి రెండు సార్లు టెట్ పరీక్ష
-
ఆసియా కప్.. భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ