అర్హులైనా అందని పథకాలు
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి జీరో విద్యుత్తు బిల్లు, వంటగ్యాస్ రాయితీ తదితర పథకాలు అర్హులైనా కొందరికి అందటం లేదు.
ప్రజాపాలన దరఖాస్తుల నమోదులో లోపాలే శాపాలు
న్యూస్టుడే, జడ్చర్ల గ్రామీణం
పథకాలు వర్తించక జడ్చర్ల పురపాలిక కార్యాలయంలో బారులు దీరిన బాధితులు
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి జీరో విద్యుత్తు బిల్లు, వంటగ్యాస్ రాయితీ తదితర పథకాలు అర్హులైనా కొందరికి అందటం లేదు. జడ్చర్ల పురపాలికలో నిర్వహించిన ప్రజాపాలన సభల్లో 14,863 దరఖాస్తులు వచ్చాయి. వాటిని ఆదరబాదరగా నమోదు చేయటంతో చాలామంది లబ్ధిదారులుగా ఎంపిక కాలేదు. ఇలాంటి బాధితుల సంఖ్య భారీ సంఖ్యలో ఉంది. వారంతా పురపాలిక, విద్యుత్తు, గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అయినా ఫలితం లేకపోవడంతో వారికి ఏం చేయాలో పాలుపోవటం లేదు. చివరకు ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డికి కొందరు నేరుగా కలుస్తున్నారు. మరికొందరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినతులు ఇస్తున్నారు.
దరఖాస్తు చేసిన రసీదు ఉన్నా ఆన్లైన్లో నమోదు కాని దరఖాస్తు ఇదే
ప్రభుత్వం మరోమారు పొరపాట్ల సవరణకు, దరఖాస్తులు ఆన్లైన్లో నమోదు చేసేందుకు అవకాశం కల్పించాలని బాధితులు కోరుతున్నారు. ఈ విషయమై పురపాలిక కమిషనర్ రాజయ్యని ‘న్యూస్టుడే’ సంప్రదించగా ఆలస్యంగా ఇవ్వటం, వివరాలు తప్పుగా ఉండటం వంటి కారణాలతో కొందరి దరఖాస్తులు ఆన్లైన్లో నమోదు కాలేదన్నారు. నిత్యం చాలా మంది తన వద్దకు వస్తున్నారని, వారికి నచ్చజెప్పి పంపుతున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులకు ఈ పరిస్థితిని వివరించామని, తదుపరి ఉత్తర్వులు వస్తే పరిష్కరిస్తామన్నారు.
సిబ్బంది నిర్లక్ష్యంతో
ఈయన పేరు బి.జగదీశ్. జడ్చర్ల పట్టణం 20వ వార్డులో నివాసం ఉంటారు. జనవరి 3న ప్రజాపాలనలో భార్య లక్ష్మి పేరు మీద గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలకు దరఖాస్తు చేశారు. పురపాలిక సిబ్బంది దరఖాస్తు తీసుకొని రసీదు ఇచ్చారు. పథకాలు అమలు కాకపోవడంతో నిత్యం పురపాలిక చుట్టూ తిరుగుతున్నారు. దరఖాస్తు సరిగ్గా లేదని అధికారులు చెప్పారు. మళ్లీ దరఖాస్తు చేస్తేనే పథకాలు వరిస్తాయని చెబుతున్నారని జగదీశ్ వాపోయారు. దీనిపై ‘న్యూస్టుడే’ అధికారులను ఆరాతీయగా సిబ్బందే ఆన్లైన్లో నమోదు చేయలేదని తేలింది.
ఇంటి నంబరులో పొరపాటుతో..
ఈయన పేరు నరేందర్. బాదేపల్లి పాత బజారులోని 21వ వార్డులో నివాసం ఉంటున్నారు. తన భార్య, తల్లి పేర ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారు. సిబ్బంది ఆన్లైన్లో ఇంటి నంబరు తప్పుగా నమోదు చేయడంతో పథకాలు అమలు కాలేదు. విద్యుత్తు శాఖ, పురపాలిక కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే తామేమి చేయలేమని అధికారులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో చెలగాటం!
[ 06-07-2024]
పాలమూరులో అక్రమ వ్యాపారులు అమాయకుల పాలిట శాపంగా మారుతోంది. అనుమతులు లేకుండా ఇసుక, మొరం, ఇటుక వ్యాపారాలు చాలావరకు అనుమతుల్లేకుండా జరుగుతున్నాయి. -
నూతన చట్టాలతో.. సత్వర న్యాయం
[ 06-07-2024]
కొత్త చట్టాలైన భారత న్యాయ్ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్ ద్వారా బాధితులకు సత్వర న్యాయం అందుతుందని ఎస్పీ డి.జానకి తెలిపారు. -
మీ సేవ నగదు రహితం
[ 06-07-2024]
మీ సేవ కేంద్రాల నిర్వహణలో అధిక వసూళ్లకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. జవాబుదారీతనం ఉండాలని.. ప్రజలు నేరుగా డబ్బు చెల్లించకుండా ఈనెల ఒకటో తేదీ నుంచి క్యాష్లెస్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. -
ప్రభుత్వ ఆసుపత్రిలో నీటి ఎద్దడి
[ 06-07-2024]
మహబూబ్నగర్ జనరల్ ఆసుపత్రిలో నీటి ఎద్దడితో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వేసవికాలంలో నీటి కటకట ఏర్పడింది. ప్రస్తుతం వానాకాలంలో కూడా అదే సమస్య నెలకొంది. -
సిరిగల వారికి చెల్లును..
[ 06-07-2024]
సిరి కొద్దీ చిన్నెలు.. అని మన పూర్వీకులు అంటారు.. ఆర్థిక స్థితి బాగుంటే ఎన్నైనా చేసుకోవచ్చు. కానీ పక్కవారిని చూసి వివాహఖర్చులు పెంచుకుని అప్పులపాలవ్వడం ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో చాలాప్రాంతాల్లో చూస్తున్నాం. -
బదిలీ అయినా.. పాత స్థానాల్లోనే!
[ 06-07-2024]
జిల్లాలో 501 మంది ఉపాధ్యాయులు బదిలీ చేస్తూ.. రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. బదిలీ అయిన వారిలో 155 మందిని జిల్లా విద్యాశాఖ అధికారులు రిలీవ్ చేయలేదు. -
ప్రతి పల్లెకు ప్రభుత్వ బడి లక్ష్యం నెరవేరేనా?
[ 06-07-2024]
గతంలో మూతపడిన ప్రతి పాఠశాలను ఈఏడాదినుంచి తెరిపించి బడులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించినా విద్యాశాఖ ప్రస్తుతం వాటి ఊసే ఎత్తడంలేదు. -
తుంపర, బిందు సేద్యం విస్తరణకు అడుగులు
[ 06-07-2024]
జిల్లా రైతులు అత్యధికంగా వర్షాధార పంటలు సాగు చేస్తుంటారు. మరికొందరు బోరుబావులపై ఆధారపడుతున్నారు. వరి వంటి పంటలకు నీటి వినియోగం అధికం. -
సేవలకు సిద్ధం.. ఆదర్శ పోలీసు స్టేషన్
[ 06-07-2024]
ఆధునిక హంగులతో భిన్నంగా నిర్మించిన ధన్వాడ మోడల్ పోలీసు స్టేషన్ భవనం సేవలకు సిద్ధమైంది. రూ. 3 కోట్లు ఖర్చుతో జుబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ తరహాలో దీని నిర్మించారు. -
కొత్త చట్టాలతో సత్వర న్యాయం
[ 06-07-2024]
కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాల ద్వారా కేసుల నమోదు, ప్రత్యక్షంగా ఆన్లైన్ ద్వారా పారదర్శకంగా చేయవచ్చని ఎస్పీ రక్షితకృష్ణమూర్తి అన్నారు. -
అచ్చంపేట పుర ఛైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధం
[ 06-07-2024]
అచ్చంపేట పురపాలిక ఛైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఎన్నికల అధికారి, స్థానిక ఆర్డీవో మాధవి ఆధ్వర్యంలో శనివారం ఉదయం 11 గంటలకు ఛైర్మన్ ఎన్నిక నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. -
బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి పదేళ్ల్ల జైలు
[ 06-07-2024]
ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడికి రాజేంద్రనగర్లోని ప్రత్యేక పోక్సో కోర్టు జడ్జి పి.ఆంజనేయులు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించారు. -
టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం.. యువకుడి మృతి
[ 06-07-2024]
టిప్పర్ డ్రైవర్ అజాగ్రత్త వల్ల ఓ యువకుడు మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు కథనం మేరకు.. బిహార్ రాష్ట్రానికి చెందిన లాలుయాదవ్(27) మండలంలోని పలుగుమీదితండా గ్రామ శివారులోని ఓ పరిశమ్రలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. -
పట్టణ ప్రణాళికాధికారిపై దాడి
[ 06-07-2024]
ఇళ్ల మధ్య ఉన్న మిర్చి గిర్నిని జప్తు చేసేందుకు వెళ్లిన పట్టణ ప్రణాళికాధికారి విజయ్కుమార్ పై శ్రీకాంత్ అనే వ్యక్తి దాడికి పాల్పడిన సంఘటన శుక్రవారం పట్టణంలోని గాంధీనగర్లో చోటుచేసుకుంది.