మిగులు ఖాళీలు.. తప్పని అవస్థలు
ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేసింది. అర్హులైన ఎస్జీటీలకు వివిధ సబ్జెక్టుల్లో స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించారు.
ఉపాధ్యాయుల కొరతతో నష్టపోతున్న విద్యార్థులు
సీనియర్లకు పదోన్నతి కల్పించాలని నాగర్కర్నూల్ డీఈవో గోవిందరాజులును కోరుతున్న ఉపాధ్యాయులు
అచ్చంపేట, న్యూస్టుడే : ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేసింది. అర్హులైన ఎస్జీటీలకు వివిధ సబ్జెక్టుల్లో స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించారు. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా పదోన్నతులు కల్పించడంతో ఖాళీలు మిగిలి పోయాయి. నేరుగా పదోన్నతుల ప్రక్రియను కొనసాగిస్తే ఈ సమస్య ఏర్పడేది కాదు. ఒక్కో ఉపాధ్యాయుడు వివిధ సబ్జెక్టుల్లో అదనపు విద్యార్హతలను సాధించడంతో వారికి రెండు, మూడు సబ్జెక్టుల్లో పదోన్నతి లభించింది. ఎన్ని సబ్జెక్టుల్లో పదోన్నతి లభించినా ఒకే స్థానంలో చేరేందుకు అవకాశం ఉంటుంది. పదోన్నతి పొందిన ఉపాధ్యాయులు ఒక స్థానంలో చేరగా వారు పదోన్నతి పొందిన మిగతా స్థానాలు ఖాళీగా మిగిలిపోయాయి. సీనియర్ ఎస్జీటీలు అదనపు విద్యార్హతలతో ఒకటి కన్నా ఎక్కువ సబ్జెక్టుల్లో పదోన్నతి పొందడం వల్ల ఈ సమస్య ఏర్పడింది. నేరుగా పదోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహిస్తే వారు ఒకే స్థానాన్ని కోరుకోవడానికి అవకాశం ఉండేది. దాంతో సీనియార్టీ జాబితాల్లో తదుపరి ఉన్న ఉపాధ్యాయులకు మిగతా సబ్జెక్టుల్లో పదోన్నతి లభించేది. ఆన్లైన్ పదోన్నతులతో ఖాళీలు మిగిలి పోవడంతో విద్యార్థులు నష్టపోతున్నారు.
ఎక్కువ సబ్జెక్టుల్లో పద్నోతులు.. : అచ్చంపేటకు చెందిన ఓ ఉపాధ్యాయుడికి పీఎస్ హెచ్ఎం, జీవశాస్త్రం, ఆంగ్లం సబ్జెక్టుల్లో ఎస్ఏగా పదోన్నతి లభించడంతో ఆయన ఒక స్థానంలో చేరగా మిగతా రెండు సబ్జెక్టుల పోస్టులు ఖాళీగా మిగిలి పోయాయి. మరో ఉపాధ్యాయుడు జీవశాస్త్రం, ఆంగ్లం సబ్జెక్టుల్లో పదోన్నతి పొందగా ఒక స్థానంలో చేరగా మరో స్థానం ఖాళీగా ఉంది. ఉప్పునుంతలకు చెందిన ఒక ఉపాధ్యాయుడు పీఎస్ హెచ్ఎం, జీవశాస్త్రం, ఆంగ్లం సబ్జెక్టుల్లో పదోన్నతి పొందగా ఒక పోస్టులో చేరగా మిగతా రెండు పోస్టులు ఖాళీ అయ్యాయి. మరో ఉపాధ్యాయుడు పీఎస్ హెచ్ఎం, సాంఘికశాస్త్రం సబ్జెక్టుల్లో పదోన్నతి పొంది ఒక స్థానంలో చేరిన నాలుగు రోజులకే ఉద్యోగ విరమణ చేయడంతో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. ఇంకా చాలా మంది ఉపాధ్యాయులు రెండేసి సబ్జెక్టుల్లో పదోన్నతి పొందగా ఒక స్థానంలో చేరగా మరో స్థానం ఖాళీగా మిగిలి పోయింది. ఉమ్మడి జిల్లాలో ఇలా చాలా ఎస్ఏ పోస్టులు మిగిలి పోవడంతో సబ్జెక్టు ఉపాధ్యాయులు లేక విద్యార్థులు నష్టపోతున్నారు.
మిగులు పోస్టులు ఇలా.. : ఉమ్మడి జిల్లాలో పదోన్నతుల తరువాత 263 ఎస్ఏ సమాన స్థాయి ఉపాధ్యాయుల ఖాళీలు మిగిలిపోయాయి. నాగర్కర్నూల్ జిల్లాలో 51, వనపర్తి జిల్లాలో 49, మహబూబ్నగర్ జిల్లాలో 42, నారాయణపేట జిల్లాలో 57, జోగులాంబ గద్వాల జిల్లాలో 64 ఎస్ఏ ఖాళీలు మిగిలి పోవడంతో విద్యార్థులు నష్టపోతున్నారు. నాగర్కర్నూల్ జిల్లాలో పీఎస్ హెచ్ఎం 21, ఎస్ఏ జీవశాస్త్రం నాలుగు, ఆంగ్లం 8, గణితం ఒకటి, భౌతికశాస్త్రం 5, సాంఘిక శాస్త్రం 12 వంతున ఖాళీలు మిగిలి పోయాయి. వనపర్తి జిల్లాలో పీఎస్ హెచ్ఎం 23, ఎస్ఏ ఆంగ్లం 9, భౌతికశాస్త్రం మూడు, జీవశాస్త్రం 4, గణితం మూడు, సాంఘికశాస్త్రంలో 7 ఖాళీలు భర్తీ కాలేదు. మిగతా జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఉండటంతో ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత ఏర్పడింది.
సీనియర్లతో భర్తీకి చర్యలు.. : మిగిలి పోయిన స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) సమాన స్థాయి ఖాళీలను సీనియార్టీ జాబితాల్లో తదుపరి సీనియర్ ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. పదోన్నతికి అవకాశం ఉన్న నాగర్కర్నూల్ జిల్లా ఉపాధ్యాయులు డీఈవో గోవిందరాజులును కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించి వారి ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటామని వివరించారు. పదోన్నతులు కల్పిస్తే వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించకుండా నేరుగా స్థానాలు కేటాయిస్తే ఖాళీలు మిగిలిపోయే అవకాశం ఉండదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో చెలగాటం!
[ 06-07-2024]
పాలమూరులో అక్రమ వ్యాపారులు అమాయకుల పాలిట శాపంగా మారుతోంది. అనుమతులు లేకుండా ఇసుక, మొరం, ఇటుక వ్యాపారాలు చాలావరకు అనుమతుల్లేకుండా జరుగుతున్నాయి. -
నూతన చట్టాలతో.. సత్వర న్యాయం
[ 06-07-2024]
కొత్త చట్టాలైన భారత న్యాయ్ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్ ద్వారా బాధితులకు సత్వర న్యాయం అందుతుందని ఎస్పీ డి.జానకి తెలిపారు. -
మీ సేవ నగదు రహితం
[ 06-07-2024]
మీ సేవ కేంద్రాల నిర్వహణలో అధిక వసూళ్లకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. జవాబుదారీతనం ఉండాలని.. ప్రజలు నేరుగా డబ్బు చెల్లించకుండా ఈనెల ఒకటో తేదీ నుంచి క్యాష్లెస్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. -
ప్రభుత్వ ఆసుపత్రిలో నీటి ఎద్దడి
[ 06-07-2024]
మహబూబ్నగర్ జనరల్ ఆసుపత్రిలో నీటి ఎద్దడితో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వేసవికాలంలో నీటి కటకట ఏర్పడింది. ప్రస్తుతం వానాకాలంలో కూడా అదే సమస్య నెలకొంది. -
సిరిగల వారికి చెల్లును..
[ 06-07-2024]
సిరి కొద్దీ చిన్నెలు.. అని మన పూర్వీకులు అంటారు.. ఆర్థిక స్థితి బాగుంటే ఎన్నైనా చేసుకోవచ్చు. కానీ పక్కవారిని చూసి వివాహఖర్చులు పెంచుకుని అప్పులపాలవ్వడం ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో చాలాప్రాంతాల్లో చూస్తున్నాం. -
బదిలీ అయినా.. పాత స్థానాల్లోనే!
[ 06-07-2024]
జిల్లాలో 501 మంది ఉపాధ్యాయులు బదిలీ చేస్తూ.. రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. బదిలీ అయిన వారిలో 155 మందిని జిల్లా విద్యాశాఖ అధికారులు రిలీవ్ చేయలేదు. -
ప్రతి పల్లెకు ప్రభుత్వ బడి లక్ష్యం నెరవేరేనా?
[ 06-07-2024]
గతంలో మూతపడిన ప్రతి పాఠశాలను ఈఏడాదినుంచి తెరిపించి బడులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించినా విద్యాశాఖ ప్రస్తుతం వాటి ఊసే ఎత్తడంలేదు. -
తుంపర, బిందు సేద్యం విస్తరణకు అడుగులు
[ 06-07-2024]
జిల్లా రైతులు అత్యధికంగా వర్షాధార పంటలు సాగు చేస్తుంటారు. మరికొందరు బోరుబావులపై ఆధారపడుతున్నారు. వరి వంటి పంటలకు నీటి వినియోగం అధికం. -
సేవలకు సిద్ధం.. ఆదర్శ పోలీసు స్టేషన్
[ 06-07-2024]
ఆధునిక హంగులతో భిన్నంగా నిర్మించిన ధన్వాడ మోడల్ పోలీసు స్టేషన్ భవనం సేవలకు సిద్ధమైంది. రూ. 3 కోట్లు ఖర్చుతో జుబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ తరహాలో దీని నిర్మించారు. -
కొత్త చట్టాలతో సత్వర న్యాయం
[ 06-07-2024]
కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాల ద్వారా కేసుల నమోదు, ప్రత్యక్షంగా ఆన్లైన్ ద్వారా పారదర్శకంగా చేయవచ్చని ఎస్పీ రక్షితకృష్ణమూర్తి అన్నారు. -
అచ్చంపేట పుర ఛైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధం
[ 06-07-2024]
అచ్చంపేట పురపాలిక ఛైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఎన్నికల అధికారి, స్థానిక ఆర్డీవో మాధవి ఆధ్వర్యంలో శనివారం ఉదయం 11 గంటలకు ఛైర్మన్ ఎన్నిక నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. -
బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి పదేళ్ల్ల జైలు
[ 06-07-2024]
ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడికి రాజేంద్రనగర్లోని ప్రత్యేక పోక్సో కోర్టు జడ్జి పి.ఆంజనేయులు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించారు. -
టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం.. యువకుడి మృతి
[ 06-07-2024]
టిప్పర్ డ్రైవర్ అజాగ్రత్త వల్ల ఓ యువకుడు మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు కథనం మేరకు.. బిహార్ రాష్ట్రానికి చెందిన లాలుయాదవ్(27) మండలంలోని పలుగుమీదితండా గ్రామ శివారులోని ఓ పరిశమ్రలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. -
పట్టణ ప్రణాళికాధికారిపై దాడి
[ 06-07-2024]
ఇళ్ల మధ్య ఉన్న మిర్చి గిర్నిని జప్తు చేసేందుకు వెళ్లిన పట్టణ ప్రణాళికాధికారి విజయ్కుమార్ పై శ్రీకాంత్ అనే వ్యక్తి దాడికి పాల్పడిన సంఘటన శుక్రవారం పట్టణంలోని గాంధీనగర్లో చోటుచేసుకుంది.