బడిబాట ప్రవేశాలు నామమాత్రం
ప్రభుత్వ పాఠశాలల్లో నూతన విద్యార్థుల ప్రవేశాలు సంఖ్య పెంచడానికి, సర్కారు పాఠశాలల్లో అందిస్తున్న విద్యా విధానాన్ని తల్లిదండ్రులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర విద్యాశాఖ అధికారులు జూన్ 6వ తేదీ నుంచి 19 వరకు ఆచార్య జయశంకర్ బాడిబాట కార్యక్రమం నిర్వహించారు.
నాగర్కర్నూల్ : ఊర్కొండ మండల కేంద్రంలో బడి బాట కార్యక్రమం నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు (పాతచిత్రం)
కందనూలు, న్యూస్టుడే : ప్రభుత్వ పాఠశాలల్లో నూతన విద్యార్థుల ప్రవేశాలు సంఖ్య పెంచడానికి, సర్కారు పాఠశాలల్లో అందిస్తున్న విద్యా విధానాన్ని తల్లిదండ్రులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర విద్యాశాఖ అధికారులు జూన్ 6వ తేదీ నుంచి 19 వరకు ఆచార్య జయశంకర్ బాడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం జూన్ 3 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా లోక్సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాయిదా వేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన బడిబాట కార్యక్రమం పక్కాగా నిర్వహించడానికి ప్రస్తుత 2024-25 విద్యా సంవత్సరంలో నిధులు మంజూరు చేశారు. జిల్లాలో ఈ సంవత్సరం నిర్వహించిన బడిబాట కార్యక్రమం ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కార్యక్రమం ప్రారంభమైన తరువాత రాష్ట్ర విద్యాశాఖ అధికారులు జూన్ 8వ తేదీ నుంచి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు ప్రక్రియ ప్రారంభించారు. దీంతో జిల్లాలోని ఉపాధ్యాయులు తమ అనుకూలమైన ప్రాంతానికి బదిలీలు చేయించుకోవడానికి, పదోన్నతులకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి, అందుకు సంబంధించిన దరఖాస్తులను అందజేయడానికి జిల్లా విద్యాశాఖ కార్యాలయం చుట్టూ తిరిగారు తప్పా గ్రామాలు, పట్టణాల్లో బడిబాట కార్యక్రమం ఆశించిన స్థాయిలో నిర్వహించలేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా బడిబాట కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులను, అమ్మ ఆదర్శ మహిళ కమిటీ సభ్యులను, యువజన సంఘాల సభ్యులను భాగస్వాములు చేసి పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెంచాలని ఉన్నతాధికారులు మార్గదర్శకాలు విడుదల చేసిన జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు ఆచరణల్లో అమలు చేయలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో కొత్తగా 2,832 మంది విద్యార్థులు మాత్రమే ఒకటో తరగతి ప్రవేశాలు నమోదు చేసుకున్నారంటే బడిబాట కార్యక్రమం నామమాత్రంగా నిర్వహించినట్లు స్పష్టం అవుతుంది.
ఇప్పటికీ 2,832 మంది చేరిక..
జిల్లాలో మొత్తం 848 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో 2023-24 విద్యా సంవత్సరంలో 5,898 మంది విద్యార్థులు ప్రవేశాలు నమోదు చేసుకున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ఒకటో తరగతిలో ఇప్పటి వరకు 2,832 మంది విద్యార్థులు మాత్రమే ప్రవేశాలు నమోదు చేసుకున్నారు. గతేడాది నిర్వహించిన బడిబాట కార్యక్రమంతో పోల్చితే ప్రస్తుత సంవత్సరంలో తక్కువ సంఖ్యలో విద్యార్థులు ప్రవేశాలు నమోదు చేసుకున్నారు. జిల్లాలోని అచ్చంపేట మండలంలో 528, అమ్రాబాద్ 123, బల్మూరు 59, బిజినేపల్లి 276, చారకొండ 40, కల్వకుర్తి 60, కోడేర్ 125, కొల్లాపూర్ 158, లింగాల 80, నాగర్కర్నూల్ 380, పదర 50, పెద్దకొత్తపల్లి 126, పెంట్లవెల్లి 60, తాడూరు 121, వెల్దండ 102, ఊర్కొండ 25, వంగూరు 80 మంది విద్యార్థులు ప్రవేశాలు నమోదు చేసుకున్నారు. ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న వసతులపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించకపోవడం వలన సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వ్యక్తులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించినట్లు అభిప్రాయాలు విన్పిస్తున్నాయి.
నమోదు చేసుకోవచ్చు..
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ప్రవేశాలు నమోదు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ డిసెంబర్ వరకు కొనసాగుతుంది. సర్కారు పాఠశాలల్లో అందిస్తున్న విద్యా విధానం, విద్యార్థులకు కల్పిస్తున్న వసతులను గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రవేశాలు ఇంకా పెరుగుతాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి.
వెంకటయ్య, జిల్లా విద్యాశాఖ సెక్టోరల్ అధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో చెలగాటం!
[ 06-07-2024]
పాలమూరులో అక్రమ వ్యాపారులు అమాయకుల పాలిట శాపంగా మారుతోంది. అనుమతులు లేకుండా ఇసుక, మొరం, ఇటుక వ్యాపారాలు చాలావరకు అనుమతుల్లేకుండా జరుగుతున్నాయి. -
నూతన చట్టాలతో.. సత్వర న్యాయం
[ 06-07-2024]
కొత్త చట్టాలైన భారత న్యాయ్ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్ ద్వారా బాధితులకు సత్వర న్యాయం అందుతుందని ఎస్పీ డి.జానకి తెలిపారు. -
మీ సేవ నగదు రహితం
[ 06-07-2024]
మీ సేవ కేంద్రాల నిర్వహణలో అధిక వసూళ్లకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. జవాబుదారీతనం ఉండాలని.. ప్రజలు నేరుగా డబ్బు చెల్లించకుండా ఈనెల ఒకటో తేదీ నుంచి క్యాష్లెస్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. -
ప్రభుత్వ ఆసుపత్రిలో నీటి ఎద్దడి
[ 06-07-2024]
మహబూబ్నగర్ జనరల్ ఆసుపత్రిలో నీటి ఎద్దడితో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వేసవికాలంలో నీటి కటకట ఏర్పడింది. ప్రస్తుతం వానాకాలంలో కూడా అదే సమస్య నెలకొంది. -
సిరిగల వారికి చెల్లును..
[ 06-07-2024]
సిరి కొద్దీ చిన్నెలు.. అని మన పూర్వీకులు అంటారు.. ఆర్థిక స్థితి బాగుంటే ఎన్నైనా చేసుకోవచ్చు. కానీ పక్కవారిని చూసి వివాహఖర్చులు పెంచుకుని అప్పులపాలవ్వడం ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో చాలాప్రాంతాల్లో చూస్తున్నాం. -
బదిలీ అయినా.. పాత స్థానాల్లోనే!
[ 06-07-2024]
జిల్లాలో 501 మంది ఉపాధ్యాయులు బదిలీ చేస్తూ.. రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. బదిలీ అయిన వారిలో 155 మందిని జిల్లా విద్యాశాఖ అధికారులు రిలీవ్ చేయలేదు. -
ప్రతి పల్లెకు ప్రభుత్వ బడి లక్ష్యం నెరవేరేనా?
[ 06-07-2024]
గతంలో మూతపడిన ప్రతి పాఠశాలను ఈఏడాదినుంచి తెరిపించి బడులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించినా విద్యాశాఖ ప్రస్తుతం వాటి ఊసే ఎత్తడంలేదు. -
తుంపర, బిందు సేద్యం విస్తరణకు అడుగులు
[ 06-07-2024]
జిల్లా రైతులు అత్యధికంగా వర్షాధార పంటలు సాగు చేస్తుంటారు. మరికొందరు బోరుబావులపై ఆధారపడుతున్నారు. వరి వంటి పంటలకు నీటి వినియోగం అధికం. -
సేవలకు సిద్ధం.. ఆదర్శ పోలీసు స్టేషన్
[ 06-07-2024]
ఆధునిక హంగులతో భిన్నంగా నిర్మించిన ధన్వాడ మోడల్ పోలీసు స్టేషన్ భవనం సేవలకు సిద్ధమైంది. రూ. 3 కోట్లు ఖర్చుతో జుబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ తరహాలో దీని నిర్మించారు. -
కొత్త చట్టాలతో సత్వర న్యాయం
[ 06-07-2024]
కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాల ద్వారా కేసుల నమోదు, ప్రత్యక్షంగా ఆన్లైన్ ద్వారా పారదర్శకంగా చేయవచ్చని ఎస్పీ రక్షితకృష్ణమూర్తి అన్నారు. -
అచ్చంపేట పుర ఛైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధం
[ 06-07-2024]
అచ్చంపేట పురపాలిక ఛైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఎన్నికల అధికారి, స్థానిక ఆర్డీవో మాధవి ఆధ్వర్యంలో శనివారం ఉదయం 11 గంటలకు ఛైర్మన్ ఎన్నిక నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. -
బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి పదేళ్ల్ల జైలు
[ 06-07-2024]
ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడికి రాజేంద్రనగర్లోని ప్రత్యేక పోక్సో కోర్టు జడ్జి పి.ఆంజనేయులు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించారు. -
టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం.. యువకుడి మృతి
[ 06-07-2024]
టిప్పర్ డ్రైవర్ అజాగ్రత్త వల్ల ఓ యువకుడు మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు కథనం మేరకు.. బిహార్ రాష్ట్రానికి చెందిన లాలుయాదవ్(27) మండలంలోని పలుగుమీదితండా గ్రామ శివారులోని ఓ పరిశమ్రలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. -
పట్టణ ప్రణాళికాధికారిపై దాడి
[ 06-07-2024]
ఇళ్ల మధ్య ఉన్న మిర్చి గిర్నిని జప్తు చేసేందుకు వెళ్లిన పట్టణ ప్రణాళికాధికారి విజయ్కుమార్ పై శ్రీకాంత్ అనే వ్యక్తి దాడికి పాల్పడిన సంఘటన శుక్రవారం పట్టణంలోని గాంధీనగర్లో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
సంస్కరణవాదికే పట్టం.. ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా మసౌద్ పెజెష్కియాన్..!
-
కొడాలి నాని, వాసుదేవరెడ్డిపై గుడివాడలో కేసు
-
రాజమౌళిపై నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
-
ఓపెనర్గా రావాలనుకుంటున్నా.. రోహిత్, కోహ్లీ స్థానంపై కన్నేసిన శుభ్మన్ గిల్
-
భారాసనే ఫిరాయింపులను ప్రోత్సహించింది: జీహెచ్ఎంసీ మేయర్
-
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సంతకం ఫోర్జరీ.. మేయర్ భర్తపై కేసు