నిద్దరోతున్న నిఘా కళ్లు
జిల్లాలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో భద్రత కోసం అమర్చిన నిఘా కెమెరాలు నిద్ర పోతున్నాయి.
కేజీబీవీల్లో భద్రత కరవు
న్యూస్టుడే- నారాయణపేట న్యూటౌన్
ధన్వాడ కేజీబీవీలో సీˆసీˆ కెమెరాలు పనిచేయకపోవడంతో వృథాగా పరిశీలన తెర
జిల్లాలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో భద్రత కోసం అమర్చిన నిఘా కెమెరాలు నిద్ర పోతున్నాయి. వీటిని మేల్కొలిపి పని చేయించాల్సిన అధికారులు ఆ దిశగా కృషి చేయకపోతుండటంతో విద్యార్థినులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా 11 కస్తూర్బా గాంధీ విద్యాలయాలు ఉన్నాయి. ఇందులో చదువుకుంటున్న వారందరూ విద్యార్థినులు కావడం, వీటిని గ్రామానికి దూరాన పొలాల మధ్యన నిర్మించడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రహరీలు నిర్మించడమే కాకుండా సీˆసీˆ కెమెరాలను ఏర్పాటు చేసింది. కెమెరాల మూలంగా విద్యార్థుల భద్రతకు ఢోకా లేకుండా పోయింది. విద్యాలయానికి సంబంధించిన సామగ్రి దుర్వినియోగం కాకుండా, ఉపాధ్యాయులు సైతం వేళలకు హజరయ్యేలా ఉపకరిస్తాయని భావించారు. కొన్నాళ్ల పాటు కెమెరాలు బాగానే పని చేశాయి. ఆ తర్వాత ఏమైందో తెలియడంలేదు గాని అన్ని చోట్ల పడకేశాయి.
పట్టించుకోని అధికారులు : కెమెరాలు పనిచేయని విషయాన్ని గత ఏడాది నిర్వాహకులు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టరు దృష్టికి ఈ విషయం చేరడంతో బాగు చేయిస్తానని హామీ ఇచ్చారు. తర్వాత వేసవి సెలవులు రావడంతో పట్టించుకోలేదు. హామీ ఇచ్చిన కలెక్టర్ బదిలీపై వెళ్లారు. దీంతో ఇంతవరకు వీటి మరమ్మతు కాలేదు. ప్రస్తుతం విద్యాలయాల్లో ఉత్సవ విగ్రహాలుగా మిగిలాయి. గత నెల 27న ధన్వాడ కేజీబీవీని నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్నికరెడ్డి సందర్శించారు. సీˆసీˆ కెమెరాలు పని చేయని విషయాన్ని గుర్తించారు. సొంత నిధులైనా వెచ్చించి సీˆసీˆ కెమెరాలను మరమ్మతు చేయిస్తానని చెప్పారు. మండలాధికారులు వీటిని పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎమ్మెల్యే పర్యటన ముగిసి వారం రోజులు దాటింది. కాని ఇంతవరకు సీˆసీˆ కెమెరాల మరమ్మతులతో పాటు ఇతర పనుల పరంగా ఎలాంటి ముందడుగు పడలేదు. ప్రస్తుతం సీˆసీˆ కెమెరాలు లేని కారణంగా పాలన, విధుల్లో పారదర్శకత లోపించింది. నిర్వాహకుల్లోనూ ఆందోళన నెలకొంది. దీని గుర్తించి ఇకనైన సీˆసీˆ కెమెరాల మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.
ఉన్నా లేనట్టుగానే.. : ప్రభుత్వం విద్యార్థినులకు వేడి నీళ్ల కోసం సోలార్ డ్రమ్ము ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఇంటర్ ఉన్న కేజీబీవీలో 360 నుంచి 400 మంది వరకు విద్యార్థులు ఉంటున్నారు. ఇంటర్ లేని చోట 200 నుంచి 250 మంది ఉంటున్నారు. ప్రస్తుతం ఉన్న డ్రమ్ము వందమందికి వేడి నీళ్లను అందించలేకపోతోంది. గత కొన్ని రోజులుగా ఎండలు లేకపోతుండటంతో వేడినీళ్లే తయారు కావడంలేదు. వర్షాకాలం, శీతాకాలంలో వేడి నీళ్లు అవసరం పడుతాయి. అవసరం లేని ఎండాకాలంలో లభ్యమవుతున్నాయి. పెరిగిన విద్యార్థినుల సంఖ్యను పరిగణలోకి తీసుకొని పెద్ద సోలార్ డ్రమ్ములను ఏర్పాటు చేయడమే కాకుండా సోలార్ సామర్థ్యాన్ని పెంచేందుకు మరిన్ని ఫలకలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
అధికారుల దృష్టికి తీసుకెళ్లాం
ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీˆ ఎన్నికలు రావడంతో అప్పట్లో మరమ్మతు సాధ్యపడలేదు. సోలార్ డ్రమ్ముల సామర్థ్యం పెంపు విషయాన్ని విద్యార్థినుల కోరిక మేరకు పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ప్రస్తుతం జిల్లా అధికారుల దృష్టికి సమస్యల్ని తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తాను.
పద్మనళిని జీసీˆడీవో, నారాయణపేట
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో చెలగాటం!
[ 06-07-2024]
పాలమూరులో అక్రమ వ్యాపారులు అమాయకుల పాలిట శాపంగా మారుతోంది. అనుమతులు లేకుండా ఇసుక, మొరం, ఇటుక వ్యాపారాలు చాలావరకు అనుమతుల్లేకుండా జరుగుతున్నాయి. -
నూతన చట్టాలతో.. సత్వర న్యాయం
[ 06-07-2024]
కొత్త చట్టాలైన భారత న్యాయ్ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్ ద్వారా బాధితులకు సత్వర న్యాయం అందుతుందని ఎస్పీ డి.జానకి తెలిపారు. -
మీ సేవ నగదు రహితం
[ 06-07-2024]
మీ సేవ కేంద్రాల నిర్వహణలో అధిక వసూళ్లకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. జవాబుదారీతనం ఉండాలని.. ప్రజలు నేరుగా డబ్బు చెల్లించకుండా ఈనెల ఒకటో తేదీ నుంచి క్యాష్లెస్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. -
ప్రభుత్వ ఆసుపత్రిలో నీటి ఎద్దడి
[ 06-07-2024]
మహబూబ్నగర్ జనరల్ ఆసుపత్రిలో నీటి ఎద్దడితో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వేసవికాలంలో నీటి కటకట ఏర్పడింది. ప్రస్తుతం వానాకాలంలో కూడా అదే సమస్య నెలకొంది. -
సిరిగల వారికి చెల్లును..
[ 06-07-2024]
సిరి కొద్దీ చిన్నెలు.. అని మన పూర్వీకులు అంటారు.. ఆర్థిక స్థితి బాగుంటే ఎన్నైనా చేసుకోవచ్చు. కానీ పక్కవారిని చూసి వివాహఖర్చులు పెంచుకుని అప్పులపాలవ్వడం ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో చాలాప్రాంతాల్లో చూస్తున్నాం. -
బదిలీ అయినా.. పాత స్థానాల్లోనే!
[ 06-07-2024]
జిల్లాలో 501 మంది ఉపాధ్యాయులు బదిలీ చేస్తూ.. రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. బదిలీ అయిన వారిలో 155 మందిని జిల్లా విద్యాశాఖ అధికారులు రిలీవ్ చేయలేదు. -
ప్రతి పల్లెకు ప్రభుత్వ బడి లక్ష్యం నెరవేరేనా?
[ 06-07-2024]
గతంలో మూతపడిన ప్రతి పాఠశాలను ఈఏడాదినుంచి తెరిపించి బడులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించినా విద్యాశాఖ ప్రస్తుతం వాటి ఊసే ఎత్తడంలేదు. -
తుంపర, బిందు సేద్యం విస్తరణకు అడుగులు
[ 06-07-2024]
జిల్లా రైతులు అత్యధికంగా వర్షాధార పంటలు సాగు చేస్తుంటారు. మరికొందరు బోరుబావులపై ఆధారపడుతున్నారు. వరి వంటి పంటలకు నీటి వినియోగం అధికం. -
సేవలకు సిద్ధం.. ఆదర్శ పోలీసు స్టేషన్
[ 06-07-2024]
ఆధునిక హంగులతో భిన్నంగా నిర్మించిన ధన్వాడ మోడల్ పోలీసు స్టేషన్ భవనం సేవలకు సిద్ధమైంది. రూ. 3 కోట్లు ఖర్చుతో జుబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ తరహాలో దీని నిర్మించారు. -
కొత్త చట్టాలతో సత్వర న్యాయం
[ 06-07-2024]
కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాల ద్వారా కేసుల నమోదు, ప్రత్యక్షంగా ఆన్లైన్ ద్వారా పారదర్శకంగా చేయవచ్చని ఎస్పీ రక్షితకృష్ణమూర్తి అన్నారు. -
అచ్చంపేట పుర ఛైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధం
[ 06-07-2024]
అచ్చంపేట పురపాలిక ఛైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఎన్నికల అధికారి, స్థానిక ఆర్డీవో మాధవి ఆధ్వర్యంలో శనివారం ఉదయం 11 గంటలకు ఛైర్మన్ ఎన్నిక నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. -
బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి పదేళ్ల్ల జైలు
[ 06-07-2024]
ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడికి రాజేంద్రనగర్లోని ప్రత్యేక పోక్సో కోర్టు జడ్జి పి.ఆంజనేయులు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించారు. -
టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం.. యువకుడి మృతి
[ 06-07-2024]
టిప్పర్ డ్రైవర్ అజాగ్రత్త వల్ల ఓ యువకుడు మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు కథనం మేరకు.. బిహార్ రాష్ట్రానికి చెందిన లాలుయాదవ్(27) మండలంలోని పలుగుమీదితండా గ్రామ శివారులోని ఓ పరిశమ్రలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. -
పట్టణ ప్రణాళికాధికారిపై దాడి
[ 06-07-2024]
ఇళ్ల మధ్య ఉన్న మిర్చి గిర్నిని జప్తు చేసేందుకు వెళ్లిన పట్టణ ప్రణాళికాధికారి విజయ్కుమార్ పై శ్రీకాంత్ అనే వ్యక్తి దాడికి పాల్పడిన సంఘటన శుక్రవారం పట్టణంలోని గాంధీనగర్లో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
పేపర్ లీక్ ఆరోపణలు.. ప్రిన్సిపల్ను కుర్చీతో సహా బయటకు తోసేసిన సిబ్బంది
-
అనంత్- రాధిక సంగీత్లో టీ20 హీరోలకు గ్రాండ్ వెల్కమ్
-
కాళేశ్వరం పంప్ హౌస్ ఇంజినీర్లను విచారించనున్న పీసీ ఘోష్ కమిషన్
-
సమంతకు క్షమాపణలు చెప్పిన డాక్టర్.. కానీ..
-
సికింద్రాబాద్‑గోవా బైవీక్లీ ఎక్స్ప్రెస్ రైలు.. ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన కిషన్రెడ్డి
-
నటుడు రాజ్ తరుణ్ వ్యవహారంలో మరో ట్విస్ట్