నీటి విడుదలలో స్పష్టత కరవు
ప్రస్తుత వర్షాకాలం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది.
నారుమళ్లు సిద్ధం చేసుకోలేని దైన్యం
నిండుగా పారుతున్న భీమా సమాంతర కాలువ
ఆత్మకూరు, న్యూస్టుడే : ప్రస్తుత వర్షాకాలం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఖరీఫ్లో పంటల సాగుకు ఆయకట్టు రైతులు సమాయత్తమవుతున్న పరిస్థితుల్లో నీటి విడుదలపై స్పష్టత కరువైంది. రబీలో ఆయకట్టు కింద పంట విరామం ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుత వర్షాకాలం ఇప్పటికీ సాగునీటి విడుదలపై నిర్ధిష్ట కార్యాచరణ ఖరారు కాకపోవడంతో ఆయకట్టు రైతులు ఆందోళనకు గురవుతున్నారు. సంప్రదాయం మేరకు ఏటా జూరాల ఆయకట్టు రైతులు ఆరుద్ర కార్తెలో వరిసాగుకు నారుపోసుకుంటారు. ఖరీఫ్లో జూరాల ప్రాజెక్టు ఆయకట్టు కింద పంట సాగుకు రైతులు సన్నద్ధంగా ఉన్నా నీటిపారుదల శాఖ అధికారులు నారుమళ్లకు సాగునీటిని విడుదల చేయకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
వర్షాకాలనికి ముందు జూరాల ప్రాజెక్టు దాదాపుగా అడుగంటింది. నెల రోజుల్లో రాష్ట్రంలోని కృష్ణానది పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాలకు జూరాలకు ప్రాజెక్టుకు వర్షపునీరు వచ్చి చేరింది. ఈ క్రమంలో జూన్ నాలుగో తేదీ నుంచి వర్షపునీరు వచ్చి చేరడం ప్రారంభమైంది. జూన్ 15న గరిష్ఠంగా 9,657 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టుకు చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టు వద్ద ఇన్ఫ్లో కేవలం 75 క్యూసెక్కులకే పరిమితమైంది. ప్రాజెక్టుకు వర్షపునీరు వచ్చి చేరడం ప్రారంభమైన వెంటనే ప్రాజెక్టు నిలువనీటిపై ఆధారపడిన ఎత్తిపోతల పథకాలకు నీటిని తరలించుకుపోయేందుకు ఉత్సాహం చూపిన ప్రజాప్రతినిధులు, నీటిపారుదలశాఖ అధికారులు వాస్తవ ఆయకట్టు కింద నారుమళ్లను సిద్ధం చేసుకునేందుకు నీటిని విడుదల చేయకుండా వ్యవహరించారు.
ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి పరిస్థితి
జూరాల ప్రాజెక్టు వద్ద ఎఫ్ఆర్ఎల్ (గరిష్ఠ నిల్వ నీటి మట్టం) 9.657 టీఎంసీలు. ప్రస్తుతం 7.645 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఇందులో 3.938 టీంఎసీల నీటిని మాత్రమే సాగునీటి అవసరాలకు వినియోగించే పరిస్థితి నెలకొంది. పీజేపీ అధికారులు ప్రధాన కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదల చేయడంలో జాప్యం చేస్తున్నారు. కుడి కాలువ పరిధిలో రూ.36 లక్షలతో చేపట్టిన కాలువ మరమ్మతు పనులు పూర్తికాకపోవడం వల్ల నీటిని విడుదల చేయలేకపోతున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రధాన ఎడమ కాలువలో ఎలాంటి మరమ్మతు పనులు చేపట్టకున్నా నీటిని విడుదల చేయకుండా వ్యవహరిస్తున్నారు. మంగళవారం వరకు కోయిల్సాగర్ పథకానికి 315, సమాంతర కాలువకు 800, భీమా రెండో దశకు 844 క్యూసెక్కుల నీటి విడుదల మాత్రం కొనసాగించారు.
ఆందోళనలకు సిద్ధం..
జూరాల వాస్తవ ఆయకట్టుకు కాకుండా ఎత్తిపోతల పథకాలకు నిల్వ నీటితో పాటు వచ్చి చేరిన వర్షపునీరు విడుదల చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పీజేపీ అధికారులు ఆయకట్టు రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా వెంటనే నారుమళ్లను సిద్ధం చేసుకునేందుకు నీరు విడుదల చేయాలి. వెంటనే ఐఏబీ సమావేశం ఏర్పాటు చేసి ఖరీఫ్ పంటకాలం ప్రణాళిక ఖరారు చేయాలి.
విష్ణువర్ధన్రెడ్డి, మూలమల్ల, ఆత్మకూరు మండలం
త్వరలో సలహామండలి సమావేశం
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు త్వరలో సాగునీటి సలహా మండలి సమావేశం ఏర్పాటు చేసి ప్రస్తుత ఖరీఫ్లో సాగునీటి విడుదలపై నిర్ణయం తీసుకోనున్నాం. ప్రాజెక్టులోకి వర్షపునీటి ప్రవాహం తగ్గడంతో నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్ పథకాలకు నీటి విడుదలను నిలిపివేయాలని ఆదేశించాం. ప్రాజెక్టులో నీటి మట్టం పెరిగిన వెంటనే ఆయకట్టు కింద నారుమళ్లకు సాగునీటిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటాం.
సత్యశీలారెడ్డి, ఎస్ఈ, నీరుపారుదల శాఖ, వనపర్తి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో చెలగాటం!
[ 06-07-2024]
పాలమూరులో అక్రమ వ్యాపారులు అమాయకుల పాలిట శాపంగా మారుతోంది. అనుమతులు లేకుండా ఇసుక, మొరం, ఇటుక వ్యాపారాలు చాలావరకు అనుమతుల్లేకుండా జరుగుతున్నాయి. -
నూతన చట్టాలతో.. సత్వర న్యాయం
[ 06-07-2024]
కొత్త చట్టాలైన భారత న్యాయ్ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్ ద్వారా బాధితులకు సత్వర న్యాయం అందుతుందని ఎస్పీ డి.జానకి తెలిపారు. -
మీసేవ నగదు రహితం
[ 06-07-2024]
మీ సేవ కేంద్రాల నిర్వహణలో అధిక వసూళ్లకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. జవాబుదారీతనం ఉండాలని.. ప్రజలు నేరుగా డబ్బు చెల్లించకుండా ఈనెల ఒకటో తేదీ నుంచి క్యాష్లెస్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. -
ప్రభుత్వ ఆసుపత్రిలో నీటి ఎద్దడి
[ 06-07-2024]
మహబూబ్నగర్ జనరల్ ఆసుపత్రిలో నీటి ఎద్దడితో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వేసవికాలంలో నీటి కటకట ఏర్పడింది. ప్రస్తుతం వానాకాలంలో కూడా అదే సమస్య నెలకొంది. -
సిరిగల వారికి చెల్లును..
[ 06-07-2024]
సిరి కొద్దీ చిన్నెలు.. అని మన పూర్వీకులు అంటారు.. ఆర్థిక స్థితి బాగుంటే ఎన్నైనా చేసుకోవచ్చు. కానీ పక్కవారిని చూసి వివాహఖర్చులు పెంచుకుని అప్పులపాలవ్వడం ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో చాలాప్రాంతాల్లో చూస్తున్నాం. -
బదిలీ అయినా.. పాత స్థానాల్లోనే!
[ 06-07-2024]
జిల్లాలో 501 మంది ఉపాధ్యాయులు బదిలీ చేస్తూ.. రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. బదిలీ అయిన వారిలో 155 మందిని జిల్లా విద్యాశాఖ అధికారులు రిలీవ్ చేయలేదు. -
ప్రతి పల్లెకు ప్రభుత్వ బడి లక్ష్యం నెరవేరేనా?
[ 06-07-2024]
గతంలో మూతపడిన ప్రతి పాఠశాలను ఈఏడాదినుంచి తెరిపించి బడులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించినా విద్యాశాఖ ప్రస్తుతం వాటి ఊసే ఎత్తడంలేదు. -
తుంపర, బిందు సేద్యం విస్తరణకు అడుగులు
[ 06-07-2024]
జిల్లా రైతులు అత్యధికంగా వర్షాధార పంటలు సాగు చేస్తుంటారు. మరికొందరు బోరుబావులపై ఆధారపడుతున్నారు. వరి వంటి పంటలకు నీటి వినియోగం అధికం. -
సేవలకు సిద్ధం.. ఆదర్శ పోలీసు స్టేషన్
[ 06-07-2024]
ఆధునిక హంగులతో భిన్నంగా నిర్మించిన ధన్వాడ మోడల్ పోలీసు స్టేషన్ భవనం సేవలకు సిద్ధమైంది. రూ. 3 కోట్లు ఖర్చుతో జుబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ తరహాలో దీని నిర్మించారు. -
కొత్త చట్టాలతో సత్వర న్యాయం
[ 06-07-2024]
కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాల ద్వారా కేసుల నమోదు, ప్రత్యక్షంగా ఆన్లైన్ ద్వారా పారదర్శకంగా చేయవచ్చని ఎస్పీ రక్షితకృష్ణమూర్తి అన్నారు. -
అచ్చంపేట పుర ఛైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధం
[ 06-07-2024]
అచ్చంపేట పురపాలిక ఛైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఎన్నికల అధికారి, స్థానిక ఆర్డీవో మాధవి ఆధ్వర్యంలో శనివారం ఉదయం 11 గంటలకు ఛైర్మన్ ఎన్నిక నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. -
బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి పదేళ్ల్ల జైలు
[ 06-07-2024]
ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడికి రాజేంద్రనగర్లోని ప్రత్యేక పోక్సో కోర్టు జడ్జి పి.ఆంజనేయులు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించారు. -
టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం.. యువకుడి మృతి
[ 06-07-2024]
టిప్పర్ డ్రైవర్ అజాగ్రత్త వల్ల ఓ యువకుడు మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు కథనం మేరకు.. బిహార్ రాష్ట్రానికి చెందిన లాలుయాదవ్(27) మండలంలోని పలుగుమీదితండా గ్రామ శివారులోని ఓ పరిశమ్రలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. -
పట్టణ ప్రణాళికాధికారిపై దాడి
[ 06-07-2024]
ఇళ్ల మధ్య ఉన్న మిర్చి గిర్నిని జప్తు చేసేందుకు వెళ్లిన పట్టణ ప్రణాళికాధికారి విజయ్కుమార్ పై శ్రీకాంత్ అనే వ్యక్తి దాడికి పాల్పడిన సంఘటన శుక్రవారం పట్టణంలోని గాంధీనగర్లో చోటుచేసుకుంది.