విజయమే లక్ష్యం.. స్వర్ణమే స్వప్నం
వారు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 20 మంది యువతులు. పట్టుదలతో సాధన చేస్తూ అంచెలంచెలుగా అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణులుగా ఎదిగారు. నెట్బాల్లో దేశానికి ఆశా కిరణాలుగా మారారు.
శిక్షణ శిబిరానికి హాజరైన భారత్ నెట్బాల్
జట్టు క్రీడాకారిణుల మనోగతం
జట్టు క్రీడాకారిణుల మనోగతం
వారు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 20 మంది యువతులు. పట్టుదలతో సాధన చేస్తూ అంచెలంచెలుగా అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణులుగా ఎదిగారు. నెట్బాల్లో దేశానికి ఆశా కిరణాలుగా మారారు. త్వరలో సౌదీ అరేబియాలో నిర్వహించే ఆసియా నెట్బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనే భారత మహిళా జట్టుకు ప్రాబబుల్స్గా ఎంపికయ్యారు. మహబూబ్నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న శిబిరంలో ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. ఈ నేపథ్యంలో వారిని ‘న్యూస్టుడే’ పలకరించింది.
న్యూస్టుడే, మహబూబ్నగర్ క్రీడలు
పీఈటీ శిక్షణతోనే ఈస్థాయికి..
సికింద్రాబాద్లోని సెయింట్ ఆన్స్ పాఠశాలలో చదువుకునే రోజుల్లో పీఈటీ శిరీష నెట్బాల్లో శిక్షణ ఇచ్చి ప్రోత్సహించటం వల్లనే నేను ఈ స్థాయికి వచ్చా. తల్లిదండ్రులు కూడా వెన్నుతట్టారు. ప్రస్తుతం ఇంటర్ చదువుతున్నా. క్రమం తప్పకుండా సాధన చేస్తూ జట్టులో గోల్ అటాకర్గా రాణిస్తున్నా. జార్ఖండ్, తెలంగాణ, హరియాణాలో జరిగిన జాతీయ స్థాయి టోర్నీల్లో పాల్గొన్నా. భారత జట్టుకు ఆడటమే లక్ష్యంగా ముందుకెళ్తున్నా. ఈసారి అది నెరవేరడం ఎంతో గర్వకారణంగా ఉంది.
జి.అక్షయ, రంగారెడ్డి జిల్లా
సీనియర్ ఫుట్బాల్ క్రీడాకారుడైన నాన్న ప్రోత్సాహంతో నాలుగేళ్లుగా హైదరాబాద్, మేడ్చల్ నెట్బాల్ జట్ల తరఫున ఆడుతున్నా. గోవా, తెలంగాణ, మహారాష్ట్రలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నా. జాతీయ స్థాయి సౌత్జోన్ టోర్నీలో నా ఆట తీరు అంతర్జాతీయ క్రీడాకారిణిగా ఎదిగేలా దోహదపడింది. గోల్ షూటర్గా రాణించడంతో ప్రాబబుల్స్ శిక్షణ శిబిరంలో చోటు దక్కింది. భారత మహిళా జట్టుకు ఎంపికై నాన్న ఆశయం నెరవేరుస్తా. క్రీడా కోటాలో పోలీసు కావాలన్నదే ధ్యేయం.
యశశ్రీ, హైదరాబాద్నాన్న వెన్నుతట్టారు..
రెండోసారి ఆసియా టోర్నీకి
మాది హరియాణాలోని సోనిపథ్ జిల్లా. మా ఊళ్లో ప్రతి ఇంట్లో ఒకరు నెట్బాల్ ఆడతారు. నా ఎత్తు 5.9 అడుగులు కావటంతో పాఠశాల పీఈటీ ప్రోత్సహించారు. 13 జాతీయ స్థాయి టోర్నీలు ఆడా. అన్ని టోర్నీల్లో హరియాణా జట్టుకు బంగారు పతకాలే వచ్చాయి. 2023 సౌత్ కొరియాలో నిర్వహించిన ఆసియా యూత్ ఛాంపియన్ షిప్ పోటీల్లో భారత జట్టుకు ఎంపికై నాయకత్వం వహించా. రెండోసారి అంతర్జాతీయ టోర్నీకి ఎంపికవడం ఆనందంగా ఉంది. స్వర్ణం సాధించటమే లక్ష్యంగా సాధన చేస్తున్నా.
పలక్, హరియాణా
బాబాయి ప్రోత్సాహంతో క్రీడల వైపు..
క్రీడాకారుడైన బాబాయి ప్రోత్సాహంతో పలు అంతర్ జిల్లా బ్యాడ్మింటన్ టోర్నీల్లో పాల్గొన్నాను. పాఠశాలలో కోచ్ ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రోత్సహించటంతో నెట్బాల్పై దృష్టిసారించాను. నాలుగేళ్లుగా జట్టులో జీడీ స్థానంలో రాణిస్తున్నా. గోవా, తెలంగాణ, దిల్లీ, హరియాణా, కోల్కతాలో నిర్వహించిన అయిదు జాతీయ స్థాయి టోర్నీల్లో పాల్గొన్నా. మహబూబ్నగర్లో జరిగిన సౌత్జోన్ పోటీల్లో తెలంగాణ జట్టు కాంస్య పతకం సాధించగా నేను భారత ప్రాబబుల్స్ జట్టుకు ఎంపికయ్యా. తొలిసారిగా భారత జట్టుకు ఆడే అవకాశం దక్కడం చాలా ఆనందంగా ఉంది. స్వర్ణ పతకం సాధించేందుకు కృషిచేస్తా. క్రీడా కోటాలో పోలీసు అధికారి కావాలన్నదే నా లక్ష్యం.
జి.లితీష, మేడ్చల్ మల్కాజిగిరి
గర్వించేలా ఎదగాలని..
దిల్లీలోని మోడ్రన్ స్కూల్ పీఈటీ సైనీ నన్ను నెట్బాల్లో ప్రోత్సహించారు. అమ్మానాన్నలు వెన్నుతట్టారు. 12 జాతీయ స్థాయి టోర్నీలు ఆడాను. రెండు టోర్నీల్లో స్వర్ణ పతకాలు అందుకున్నా. 2023లో తొలిసారిగా భారత జట్టుకు ఎంపికై దక్షిణ కొరియాలో జరిగిన ఆసియా నెట్బాల్ యూత్ ఛాంపియన్ షిప్లో పాల్గొన్నా. జట్టులో సెంటర్ స్థానంలో రాణించటంతో మరోసారి భారత జట్టుకు ఎంపికయ్యే అవకాశం దక్కింది. స్వర్ణం సాధనే లక్ష్యం. భారత్ గర్వించే క్రీడాకారిణిగా పేరు సంపాదించటమే ధ్యేయం.
గీతాంజలి, దిల్లీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాతృత్వం చాటుకున్న ఎస్ఐ
[ 06-07-2024]
శాంతినగర్ పట్టణంలో మానసిక స్థితి సరిగా లేనీ మహిళకు వైద్య సహాయము, ఆహారం అందించి ఎస్ఐ సంతోష్ దాతృత్వం చాటుకున్నారు. -
సహకార సంఘాల ద్వారానే అభివృద్ధి
[ 06-07-2024]
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారానే రైతుల అభివృద్ధి సాధ్యమవుతుందని అయిజ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు పోతుల మధుసూదన్ రెడ్డి అన్నారు. -
ముఖర్జీ ఆశయాలను కొనసాగిద్దాం
[ 06-07-2024]
జన్ సంఘ్ పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు గద్వాల పట్టణం లోని డికె.బంగ్లాలో ఘనంగా నిర్వహించారు. -
ప్రాణాలతో చెలగాటం!
[ 06-07-2024]
పాలమూరులో అక్రమ వ్యాపారులు అమాయకుల పాలిట శాపంగా మారుతోంది. అనుమతులు లేకుండా ఇసుక, మొరం, ఇటుక వ్యాపారాలు చాలావరకు అనుమతుల్లేకుండా జరుగుతున్నాయి. -
నూతన చట్టాలతో.. సత్వర న్యాయం
[ 06-07-2024]
కొత్త చట్టాలైన భారత న్యాయ్ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్ ద్వారా బాధితులకు సత్వర న్యాయం అందుతుందని ఎస్పీ డి.జానకి తెలిపారు. -
మీ సేవ నగదు రహితం
[ 06-07-2024]
మీ సేవ కేంద్రాల నిర్వహణలో అధిక వసూళ్లకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. జవాబుదారీతనం ఉండాలని.. ప్రజలు నేరుగా డబ్బు చెల్లించకుండా ఈనెల ఒకటో తేదీ నుంచి క్యాష్లెస్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. -
ప్రభుత్వ ఆసుపత్రిలో నీటి ఎద్దడి
[ 06-07-2024]
మహబూబ్నగర్ జనరల్ ఆసుపత్రిలో నీటి ఎద్దడితో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వేసవికాలంలో నీటి కటకట ఏర్పడింది. ప్రస్తుతం వానాకాలంలో కూడా అదే సమస్య నెలకొంది. -
సిరిగల వారికి చెల్లును..
[ 06-07-2024]
సిరి కొద్దీ చిన్నెలు.. అని మన పూర్వీకులు అంటారు.. ఆర్థిక స్థితి బాగుంటే ఎన్నైనా చేసుకోవచ్చు. కానీ పక్కవారిని చూసి వివాహఖర్చులు పెంచుకుని అప్పులపాలవ్వడం ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో చాలాప్రాంతాల్లో చూస్తున్నాం. -
బదిలీ అయినా.. పాత స్థానాల్లోనే!
[ 06-07-2024]
జిల్లాలో 501 మంది ఉపాధ్యాయులు బదిలీ చేస్తూ.. రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. బదిలీ అయిన వారిలో 155 మందిని జిల్లా విద్యాశాఖ అధికారులు రిలీవ్ చేయలేదు. -
ప్రతి పల్లెకు ప్రభుత్వ బడి లక్ష్యం నెరవేరేనా?
[ 06-07-2024]
గతంలో మూతపడిన ప్రతి పాఠశాలను ఈఏడాదినుంచి తెరిపించి బడులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించినా విద్యాశాఖ ప్రస్తుతం వాటి ఊసే ఎత్తడంలేదు. -
తుంపర, బిందు సేద్యం విస్తరణకు అడుగులు
[ 06-07-2024]
జిల్లా రైతులు అత్యధికంగా వర్షాధార పంటలు సాగు చేస్తుంటారు. మరికొందరు బోరుబావులపై ఆధారపడుతున్నారు. వరి వంటి పంటలకు నీటి వినియోగం అధికం. -
సేవలకు సిద్ధం.. ఆదర్శ పోలీసు స్టేషన్
[ 06-07-2024]
ఆధునిక హంగులతో భిన్నంగా నిర్మించిన ధన్వాడ మోడల్ పోలీసు స్టేషన్ భవనం సేవలకు సిద్ధమైంది. రూ. 3 కోట్లు ఖర్చుతో జుబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ తరహాలో దీని నిర్మించారు. -
కొత్త చట్టాలతో సత్వర న్యాయం
[ 06-07-2024]
కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాల ద్వారా కేసుల నమోదు, ప్రత్యక్షంగా ఆన్లైన్ ద్వారా పారదర్శకంగా చేయవచ్చని ఎస్పీ రక్షితకృష్ణమూర్తి అన్నారు. -
అచ్చంపేట పుర ఛైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధం
[ 06-07-2024]
అచ్చంపేట పురపాలిక ఛైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఎన్నికల అధికారి, స్థానిక ఆర్డీవో మాధవి ఆధ్వర్యంలో శనివారం ఉదయం 11 గంటలకు ఛైర్మన్ ఎన్నిక నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. -
బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి పదేళ్ల్ల జైలు
[ 06-07-2024]
ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడికి రాజేంద్రనగర్లోని ప్రత్యేక పోక్సో కోర్టు జడ్జి పి.ఆంజనేయులు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించారు. -
టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం.. యువకుడి మృతి
[ 06-07-2024]
టిప్పర్ డ్రైవర్ అజాగ్రత్త వల్ల ఓ యువకుడు మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు కథనం మేరకు.. బిహార్ రాష్ట్రానికి చెందిన లాలుయాదవ్(27) మండలంలోని పలుగుమీదితండా గ్రామ శివారులోని ఓ పరిశమ్రలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. -
పట్టణ ప్రణాళికాధికారిపై దాడి
[ 06-07-2024]
ఇళ్ల మధ్య ఉన్న మిర్చి గిర్నిని జప్తు చేసేందుకు వెళ్లిన పట్టణ ప్రణాళికాధికారి విజయ్కుమార్ పై శ్రీకాంత్ అనే వ్యక్తి దాడికి పాల్పడిన సంఘటన శుక్రవారం పట్టణంలోని గాంధీనగర్లో చోటుచేసుకుంది.