ఆవిష్కర్తలారా.. మీకోసం
ప్రజా సమస్యలకు పరిష్కారం చూపుతూ.. సృజనాత్మకతతో కొత్త ఆవిష్కరణలను చేసే వారి నుంచి ‘ఇంటింటా ఇన్నోవేటర్’ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ఇంటింటా ఇన్నోవేటర్కు దరఖాస్తుల ఆహ్వానం
గద్వాల న్యూటౌన్, న్యూస్టుడే : ప్రజా సమస్యలకు పరిష్కారం చూపుతూ.. సృజనాత్మకతతో కొత్త ఆవిష్కరణలను చేసే వారి నుంచి ‘ఇంటింటా ఇన్నోవేటర్’ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఇన్నోవేషన్ విభాగం ఆధ్వర్యంలో అయిదేళ్లుగా ఆవిష్కరణలకు అవకాశం కల్పిస్తోంది. ఏటా జులైలో దరఖాస్తులు స్వీకరించి, ఆగస్టులో విజేతలను ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగానే 2024-25 సంవత్సరానికి విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, మెకానిక్లు, వ్యవసాయదారులు, మహిళలు, విద్యార్థులు ఇలా ఎవరైనా ఇందులో పాల్గొనవచ్చు. క్షేత్ర స్థాయిలో అవగాహన లేకపోవడంతో గతంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా నుంచి ప్రతిభ చాటిన వారి సంఖ్య తక్కువగానే ఉంటోంది. జోగులాంబ గద్వాల జిల్లానే తీసుకుంటే మూడేళ్లలో కేవలం 13 మంది మాత్రమే దరఖాస్తు చేశారు. ఇలాంటి నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంపై విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వాట్సప్ ద్వారానే..
ఆసక్తి ఉన్న వారు ఆలోచనలకు అనుగుణంగా తయారు చేసిన ప్రాజెక్టులను పంపించడంలో ఇబ్బంది లేకుండా.. సులభంగా పంపించే సౌలభ్యం కల్పించారు. వివరాలను 91006 78543 నంబర్కు వాట్సప్ ద్వారా దరఖాస్తు చేస్తే చాలు. ఆవిష్కర్తలు తమ ఆవిష్కరణ పేరు, దాని గురించి వివరిస్తూ.. వంద పదాలలో రాసి పంపాలి. అలాగే రెండు నిమిషాల నిడివి ఉన్న వీడియో, ప్రాజెక్టుకు సంబంధించిన నాలుగు ఫొటోలు, ఆవిష్కర్త పేరు, చరవాణి నంబర్, ప్రస్తుత వృత్తి, గ్రామం, జిల్లా పేరు వివరాలను వాట్సప్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు ఆగస్టు 3వ తేదీ చివరి తేదీగా ప్రకటించారు.
ఎంపికైతే.. : దరఖాస్తు చేసిన ఆవిష్కరణల్లో నేటి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపేలా ఉన్న వాటిని ఇన్నోవేషన్ విభాగంగా ఎంపిక చేస్తుంది. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవాన వారికి ప్రశంసా పత్రాలు అందించనున్నారు. కొత్త ఆవిష్కరణలు మెదడులో మెదలుతున్న వారు ప్రతిభను చాటేందుకు ఇది మంచి అవకాశం. ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని, దీనిపై అవగాహన కల్పించి ఎక్కువ మంది పాల్గొనేలా చూస్తామని జిల్లా సైన్సు అధికారి భాస్కర్ పాపన్న తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో చెలగాటం!
[ 06-07-2024]
పాలమూరులో అక్రమ వ్యాపారులు అమాయకుల పాలిట శాపంగా మారుతోంది. అనుమతులు లేకుండా ఇసుక, మొరం, ఇటుక వ్యాపారాలు చాలావరకు అనుమతుల్లేకుండా జరుగుతున్నాయి. -
నూతన చట్టాలతో.. సత్వర న్యాయం
[ 06-07-2024]
కొత్త చట్టాలైన భారత న్యాయ్ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్ ద్వారా బాధితులకు సత్వర న్యాయం అందుతుందని ఎస్పీ డి.జానకి తెలిపారు. -
మీ సేవ నగదు రహితం
[ 06-07-2024]
మీ సేవ కేంద్రాల నిర్వహణలో అధిక వసూళ్లకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. జవాబుదారీతనం ఉండాలని.. ప్రజలు నేరుగా డబ్బు చెల్లించకుండా ఈనెల ఒకటో తేదీ నుంచి క్యాష్లెస్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. -
ప్రభుత్వ ఆసుపత్రిలో నీటి ఎద్దడి
[ 06-07-2024]
మహబూబ్నగర్ జనరల్ ఆసుపత్రిలో నీటి ఎద్దడితో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వేసవికాలంలో నీటి కటకట ఏర్పడింది. ప్రస్తుతం వానాకాలంలో కూడా అదే సమస్య నెలకొంది. -
సిరిగల వారికి చెల్లును..
[ 06-07-2024]
సిరి కొద్దీ చిన్నెలు.. అని మన పూర్వీకులు అంటారు.. ఆర్థిక స్థితి బాగుంటే ఎన్నైనా చేసుకోవచ్చు. కానీ పక్కవారిని చూసి వివాహఖర్చులు పెంచుకుని అప్పులపాలవ్వడం ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో చాలాప్రాంతాల్లో చూస్తున్నాం. -
బదిలీ అయినా.. పాత స్థానాల్లోనే!
[ 06-07-2024]
జిల్లాలో 501 మంది ఉపాధ్యాయులు బదిలీ చేస్తూ.. రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. బదిలీ అయిన వారిలో 155 మందిని జిల్లా విద్యాశాఖ అధికారులు రిలీవ్ చేయలేదు. -
ప్రతి పల్లెకు ప్రభుత్వ బడి లక్ష్యం నెరవేరేనా?
[ 06-07-2024]
గతంలో మూతపడిన ప్రతి పాఠశాలను ఈఏడాదినుంచి తెరిపించి బడులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించినా విద్యాశాఖ ప్రస్తుతం వాటి ఊసే ఎత్తడంలేదు. -
తుంపర, బిందు సేద్యం విస్తరణకు అడుగులు
[ 06-07-2024]
జిల్లా రైతులు అత్యధికంగా వర్షాధార పంటలు సాగు చేస్తుంటారు. మరికొందరు బోరుబావులపై ఆధారపడుతున్నారు. వరి వంటి పంటలకు నీటి వినియోగం అధికం. -
సేవలకు సిద్ధం.. ఆదర్శ పోలీసు స్టేషన్
[ 06-07-2024]
ఆధునిక హంగులతో భిన్నంగా నిర్మించిన ధన్వాడ మోడల్ పోలీసు స్టేషన్ భవనం సేవలకు సిద్ధమైంది. రూ. 3 కోట్లు ఖర్చుతో జుబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ తరహాలో దీని నిర్మించారు. -
కొత్త చట్టాలతో సత్వర న్యాయం
[ 06-07-2024]
కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాల ద్వారా కేసుల నమోదు, ప్రత్యక్షంగా ఆన్లైన్ ద్వారా పారదర్శకంగా చేయవచ్చని ఎస్పీ రక్షితకృష్ణమూర్తి అన్నారు. -
అచ్చంపేట పుర ఛైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధం
[ 06-07-2024]
అచ్చంపేట పురపాలిక ఛైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఎన్నికల అధికారి, స్థానిక ఆర్డీవో మాధవి ఆధ్వర్యంలో శనివారం ఉదయం 11 గంటలకు ఛైర్మన్ ఎన్నిక నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. -
బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి పదేళ్ల్ల జైలు
[ 06-07-2024]
ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడికి రాజేంద్రనగర్లోని ప్రత్యేక పోక్సో కోర్టు జడ్జి పి.ఆంజనేయులు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించారు. -
టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం.. యువకుడి మృతి
[ 06-07-2024]
టిప్పర్ డ్రైవర్ అజాగ్రత్త వల్ల ఓ యువకుడు మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు కథనం మేరకు.. బిహార్ రాష్ట్రానికి చెందిన లాలుయాదవ్(27) మండలంలోని పలుగుమీదితండా గ్రామ శివారులోని ఓ పరిశమ్రలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. -
పట్టణ ప్రణాళికాధికారిపై దాడి
[ 06-07-2024]
ఇళ్ల మధ్య ఉన్న మిర్చి గిర్నిని జప్తు చేసేందుకు వెళ్లిన పట్టణ ప్రణాళికాధికారి విజయ్కుమార్ పై శ్రీకాంత్ అనే వ్యక్తి దాడికి పాల్పడిన సంఘటన శుక్రవారం పట్టణంలోని గాంధీనగర్లో చోటుచేసుకుంది.