పీయూలో అక్రమ తవ్వకాలు
పాలమూరు విశ్వవిద్యాలయం (పీయూ) క్యాంపస్లో అనేక అవసరాలకు ఉపయోగపడే స్థలంలో ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిపారు. పచ్చదనంతో కళకళలాడాల్సిన ప్రాంతాన్ని గోతులమయంగా మార్చి సింథటిక్ ట్రాక్ నిర్మాణం, ఇతర అభివృద్ధి పనుల పేరుతో మొరం తరలించారు.
సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ నిర్మాణానికి భారీగా మొరం తరలించిన గుత్తేదారు
న్యూస్టుడే, పాలమూరు విశ్వవిద్యాలయం
పాలమూరు విశ్వవిద్యాలయం (పీయూ) క్యాంపస్లో అనేక అవసరాలకు ఉపయోగపడే స్థలంలో ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిపారు. పచ్చదనంతో కళకళలాడాల్సిన ప్రాంతాన్ని గోతులమయంగా మార్చి సింథటిక్ ట్రాక్ నిర్మాణం, ఇతర అభివృద్ధి పనుల పేరుతో మొరం తరలించారు. ఈ మొరం తవ్వకాలకు పీయూ ఉపకులపతి, ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి అనుమతి కూడా తీసుకోలేదు. అడ్డుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తుండిపోయారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పీయూలోని పలు విభాగాలను ఎన్నికల అధికారులు ఈవీఎంల భద్రత, ఓట్ల లెక్కింపు, స్ట్రాంగ్ రూంలకు వినియోగించుకున్నారు.
ఆయా విభాగాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు పూర్తిచేసి ఎన్నికల ఫలితాలు వెల్లడించే వరకు అటువైపు ఇతరులను అనుమతించలేదు. ఇదే అవకాశంగా గుత్తేదారులు అభివృద్ధి పనుల మాటున అక్రమాలకు తెరలేపారు. వర్సిటీ ఫార్మసీ విభాగం వెనక మైదానంలో రూ.8కోట్ల నిధులతో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ నిర్మిస్తున్నారు. నిబంధనల ప్రకారం ట్రాక్ చదును తదితర పనులకు ఇతర ప్రాంతాల నుంచే మొరం తీసుకురావాలి. గుత్తేదారు మాత్రం పీయూ క్రీడా విభాగం వెనక వైపు కొద్ది దూరంలో ఉన్న గుట్ట ప్రాంతాన్ని ఎకరం మేర విస్తీర్ణంలో పొక్లెయిన్లను ఉపయోగిస్తూ లోతుగా మొరం తవ్వకాలు చేపట్టారు. టిప్పర్ల, ట్రాక్టర్లతో రవాణా చేశారు. పీయూలో పచ్చదనం పెంచాల్సి ఉండగా మొరం తవ్వకాలతో చాలా చెట్లు, మొక్కలను తొలగించారు. ఇదంతా కనిపిస్తున్నా పీయూ అధికారులు పట్టించుకోలేదు.
విచారణ చేపడతాం
- డా.మధుసూదన్రెడ్డి, పీయూ ఇన్ఛార్జి రిజిస్ట్రార్
మొరం తవ్వకాలపై సమగ్ర విచారణ చేపడతాం. ఎంబీ రికార్డులను పరిశీలించి సింథటిక్ ట్రాక్ నిర్మాణంలో వినియోగించిన మొరం విలువ మినహాయించి బిల్లులు చెల్లిస్తాం. మొరం తవ్వకాలతో ఏర్పడిన గుంతను సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటుకు వినియోగిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాజెక్టులు పరుగు పెట్టేనా?
[ 07-07-2024]
ఉమ్మడి పాలమూరులోని సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టి సారించారు. -
నడిగడ్డలో కొత్త సమీకరణం
[ 07-07-2024]
ఉమ్మడి మహబూబ్నగర్లో గత శాసనసభ ఎన్నికల ముందు వరకు 14 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ఎమ్మెల్సీలతో వెలుగు వెలిగిన భారాసకు ఇప్పుడు గడ్డు కాలం ఎదుర్కొంటోంది. -
చెంచు చిన్నారులతో వెట్టి
[ 07-07-2024]
నలమల్ల ప్రాంతంలో ఇటీవల చెంచుమహిళపై దాష్టీకం మరువకముందే మరో చెంచు చిన్నారులను జీతంగా పనిలో పెట్టుకుని వేధించిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో శనివారం వెలుగులోకి వచ్చింది. -
ప్రభుత్వ కళాశాలపై విముఖం
[ 07-07-2024]
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత విద్య, ఉచిత పుస్తకాలు అందజేస్తున్నా.. ఆశించిన స్థాయిలో ప్రవేశాలు రావడం లేదు. -
చేరువైన సాంకేతిక విద్య
[ 07-07-2024]
బీటెక్.. దేశంలో లక్షలాది విద్యార్థులు తమ స్వప్నాన్ని సాకారం చేసుకోవడం కోసం ఎంచుకునే ప్రథమ మార్గం. -
పీహెచ్సీల్లో పరీక్షలు చేసే వారేరీ?
[ 07-07-2024]
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసే ల్యాబ్ టెక్నీషియన్లు పూర్తి స్థాయిలో లేకపోవడంతో రోగులు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
అలంకారప్రాయంగా ఎన్సీడీ కేంద్రాలు
[ 07-07-2024]
అసంక్రమిత వ్యాధుల నివారణకు (నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్) ఏర్పాటు చేసిన కేంద్రాలు అలంకారప్రాయంగా ఉన్నాయి. -
చెంచుల్లో వేధిస్తున్న రక్తహీనత
[ 07-07-2024]
నాగర్కర్నూల్ జిల్లా నల్లమల ప్రాంతంలోని లోతట్టు చెంచుగూడెంలు రక్తహీనతకు నిలయంగా మారుతున్నాయి. -
కార్యశాలతో ముందడుగు
[ 07-07-2024]
తరగతి గదిలో విన్న పాఠ్యాంశాన్ని ప్రయోగాత్మకంగా చేయడం వల్ల విద్యార్థుల్లో మేధాశక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. -
విద్యుత్తు స్తంభాన్ని ఢీకొన్న లారీ.. డ్రైవర్ మృతి
[ 07-07-2024]
కృష్ణా మండలంలోని సారోపవర్ ప్లాంటు వద్ద శనివారం లారీ, విద్యుత్తు స్తంభాన్ని ఢీకొన్న ఘటనలో లారీ డ్రైవర్ మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
గుడివాడలో క్షుద్రపూజల కలకలం
-
భారమనుకుని నేలకేసి బాది.. ఏడాదిన్నర పసివాడిని పొట్టన పెట్టుకున్న కర్కశుడు
-
రూ.కోటి విలువచేసే ఫ్లాటు.. ఆడీ కారు.. పోలీసులకు చిక్కిన దర్జాదొంగ
-
వయసు 57.. సెంచరీలు 1000
-
ఏపీలోని ఆ ఐదు గ్రామాలు.. మళ్లీ భద్రాచలంలో కలిసేనా..?
-
నా హత్యకు కుట్ర.. కాటసానిపై తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడి ఫిర్యాదు