తొలిరోజు తొమ్మిది కేసులు
కృష్ణ మండల కేంద్రంలోని ఓ కిరాణం షాపులో నిషేధిత గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్నారు. సోమవారం టాస్క్ఫోర్స్, కృష్ణ పోలీసులు సంయుక్తంగా దుకాణంపై దాడి చేసి రూ.9,335ల విలువైన గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నారు.
ఉమ్మడి జిల్లాలో సగటు కంటే తక్కువగా నమోదు
కొత్త చట్టాలు, సెక్షన్లతో పోలీసుల కసరత్తు
న్యూస్టుడే, మహబూబ్నగర్ నేరవిభాగం
కృష్ణ మండల కేంద్రంలోని ఓ కిరాణం షాపులో నిషేధిత గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్నారు. సోమవారం టాస్క్ఫోర్స్, కృష్ణ పోలీసులు సంయుక్తంగా దుకాణంపై దాడి చేసి రూ.9,335ల విలువైన గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నారు. దుకాణదారుడిపై కొత్త చట్టం బీఎన్ఎస్ఎస్లోని 223, 272, 275 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గతంలో ఐపీసీ 188, 270, 273 సెక్షన్ల కింద కేసు నమోదు చేసే వారు. కొత్త చట్టం ప్రకారం రూ.5వేల వరకు జరిమానా విధిస్తారు. కేసు తీవ్రతను బట్టి జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి.
జిల్లాల వారీగా
- నారాయణపేట :04
- నాగర్కర్నూల్ :02
- వనపర్తి :01
- జోగులాంబ గద్వాల :01
- మహబూబ్నగర్ :01
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఠాణాలకు వచ్చిన ఫిర్యాదులపై పోలీసులు భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్) కింద కేసులు నమోదు చేస్తున్నారు. కొత్త చట్టాలు అమలులోకి వచ్చిన తొలిరోజైన జులై 1న ఉమ్మడి జిల్లాలో కేసుల నమోదు సంఖ్య చాలా తగ్గిపోయింది. పోలీసు అధికారులు నేరాలు కొత్త చట్టాల్లోని ఏయే సెక్షన్ల కిందకు వస్తాయో క్షుణ్ణంగా పరిశీలించి ఎఫ్ఐఆర్ చేస్తున్నారు. నిత్యం చాలా కేసులు నమోదయ్యే మహబూబ్నగర్ గ్రామీణా ఠాణాలో ఒక్కటి కూడా కాలేదు. మహబూబ్నగర్ జిల్లాలో 10 నుంచి 15 వరకు, ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 30 నుంచి 40 కేసులు చేసేవారు. అలాంటిది తొలిరోజు 9 కేసులే నమోదయ్యాయి. అత్యధికంగా నారాయణపేట జిల్లాలో నారాయణపేట పట్టణం, మక్తల్, కృష్ణ, దామరగిద్ద ఠాణాల్లో ఒక్కోటి చొప్పున నాలుగు కేసులు నమోదయ్యాయి. నాగర్కర్నూల్, చారగొండ ఠాణాల్లో ఒకటి చొప్పున రెండు కేసులు నమోదయ్యాయి. వనపర్తిలో అంబులెన్సు, ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనపై కేసు నమోదైంది. రాజోలిలో ఒకటి, మహబూబ్నగర్ రెండో పట్టణ ఠాణాలో ఒకటి చొప్పున రెండు అనుమానాస్పద మృతి కేసులు నమోదయ్యాయి.
భూత్పూర్ పురపాలిక అమిస్తాపూర్కు చెందిన పెద్ద చిన్నయ్య(47) గత నెల 30న వ్యవసాయ పనులు చేస్తుండగా ఎడమ కాలికి గాయమైంది. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా కాలుకు శస్త్రచికిత్స చేశారు. మరుసటి రోజు సోమవారం ఉదయం చనిపోయారు. గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. తన భర్తకు 339 ఎంజీ./డి.ఎల్. మేర మధుమేహం ఉన్నట్లు రిపోర్టు వచ్చినా శస్త్రచికిత్స చేశారని, ఆయన మృతికి వైద్యులే కారణమని చిన్నయ్య భార్య రెండో పట్టణ ఠాణా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బీఎన్ఎస్ఎస్ 194 సెక్షన్ కింద అనుమానాస్పద మృతిగా చేసు నమోదు చేశారు. గతంలో 174 ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేసేవారు.
జాగ్రత్తలు తీసుకుంటున్నాం..
- డి.జానకి, ఎస్పీ, మహబూబ్నగర్
పోలీసు శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు 238 పేజీలతో ప్రత్యేక బుక్లెట్ పంపించారు. అందులో ఏ విషయానికి ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేయాలో ఉంది. వాంగ్మూలం, ఆడియో, వీడియో స్టేట్మెంట్లను రికార్డు చేయడానికి కొత్త విధానం అమలులోకి వచ్చింది. అందువల్ల అన్ని వివరాలు తీసుకుని జాగ్రత్తగా కేసులు నమోదు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. కొత్త చట్టాల్లోని సెక్షన్లపై పట్టు రావడానికి కొంత సమయం పడుతుంది. మా సిబ్బందికి రోజూ ఉదయం 15 నిమిషాలు తర్ఫీదు ఇస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో చెలగాటం!
[ 06-07-2024]
పాలమూరులో అక్రమ వ్యాపారులు అమాయకుల పాలిట శాపంగా మారుతోంది. అనుమతులు లేకుండా ఇసుక, మొరం, ఇటుక వ్యాపారాలు చాలావరకు అనుమతుల్లేకుండా జరుగుతున్నాయి. -
నూతన చట్టాలతో.. సత్వర న్యాయం
[ 06-07-2024]
కొత్త చట్టాలైన భారత న్యాయ్ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్ ద్వారా బాధితులకు సత్వర న్యాయం అందుతుందని ఎస్పీ డి.జానకి తెలిపారు. -
మీ సేవ నగదు రహితం
[ 06-07-2024]
మీ సేవ కేంద్రాల నిర్వహణలో అధిక వసూళ్లకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. జవాబుదారీతనం ఉండాలని.. ప్రజలు నేరుగా డబ్బు చెల్లించకుండా ఈనెల ఒకటో తేదీ నుంచి క్యాష్లెస్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. -
ప్రభుత్వ ఆసుపత్రిలో నీటి ఎద్దడి
[ 06-07-2024]
మహబూబ్నగర్ జనరల్ ఆసుపత్రిలో నీటి ఎద్దడితో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వేసవికాలంలో నీటి కటకట ఏర్పడింది. ప్రస్తుతం వానాకాలంలో కూడా అదే సమస్య నెలకొంది. -
సిరిగల వారికి చెల్లును..
[ 06-07-2024]
సిరి కొద్దీ చిన్నెలు.. అని మన పూర్వీకులు అంటారు.. ఆర్థిక స్థితి బాగుంటే ఎన్నైనా చేసుకోవచ్చు. కానీ పక్కవారిని చూసి వివాహఖర్చులు పెంచుకుని అప్పులపాలవ్వడం ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో చాలాప్రాంతాల్లో చూస్తున్నాం. -
బదిలీ అయినా.. పాత స్థానాల్లోనే!
[ 06-07-2024]
జిల్లాలో 501 మంది ఉపాధ్యాయులు బదిలీ చేస్తూ.. రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. బదిలీ అయిన వారిలో 155 మందిని జిల్లా విద్యాశాఖ అధికారులు రిలీవ్ చేయలేదు. -
ప్రతి పల్లెకు ప్రభుత్వ బడి లక్ష్యం నెరవేరేనా?
[ 06-07-2024]
గతంలో మూతపడిన ప్రతి పాఠశాలను ఈఏడాదినుంచి తెరిపించి బడులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించినా విద్యాశాఖ ప్రస్తుతం వాటి ఊసే ఎత్తడంలేదు. -
తుంపర, బిందు సేద్యం విస్తరణకు అడుగులు
[ 06-07-2024]
జిల్లా రైతులు అత్యధికంగా వర్షాధార పంటలు సాగు చేస్తుంటారు. మరికొందరు బోరుబావులపై ఆధారపడుతున్నారు. వరి వంటి పంటలకు నీటి వినియోగం అధికం. -
సేవలకు సిద్ధం.. ఆదర్శ పోలీసు స్టేషన్
[ 06-07-2024]
ఆధునిక హంగులతో భిన్నంగా నిర్మించిన ధన్వాడ మోడల్ పోలీసు స్టేషన్ భవనం సేవలకు సిద్ధమైంది. రూ. 3 కోట్లు ఖర్చుతో జుబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ తరహాలో దీని నిర్మించారు. -
కొత్త చట్టాలతో సత్వర న్యాయం
[ 06-07-2024]
కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాల ద్వారా కేసుల నమోదు, ప్రత్యక్షంగా ఆన్లైన్ ద్వారా పారదర్శకంగా చేయవచ్చని ఎస్పీ రక్షితకృష్ణమూర్తి అన్నారు. -
అచ్చంపేట పుర ఛైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధం
[ 06-07-2024]
అచ్చంపేట పురపాలిక ఛైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఎన్నికల అధికారి, స్థానిక ఆర్డీవో మాధవి ఆధ్వర్యంలో శనివారం ఉదయం 11 గంటలకు ఛైర్మన్ ఎన్నిక నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. -
బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి పదేళ్ల్ల జైలు
[ 06-07-2024]
ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడికి రాజేంద్రనగర్లోని ప్రత్యేక పోక్సో కోర్టు జడ్జి పి.ఆంజనేయులు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించారు. -
టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం.. యువకుడి మృతి
[ 06-07-2024]
టిప్పర్ డ్రైవర్ అజాగ్రత్త వల్ల ఓ యువకుడు మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు కథనం మేరకు.. బిహార్ రాష్ట్రానికి చెందిన లాలుయాదవ్(27) మండలంలోని పలుగుమీదితండా గ్రామ శివారులోని ఓ పరిశమ్రలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. -
పట్టణ ప్రణాళికాధికారిపై దాడి
[ 06-07-2024]
ఇళ్ల మధ్య ఉన్న మిర్చి గిర్నిని జప్తు చేసేందుకు వెళ్లిన పట్టణ ప్రణాళికాధికారి విజయ్కుమార్ పై శ్రీకాంత్ అనే వ్యక్తి దాడికి పాల్పడిన సంఘటన శుక్రవారం పట్టణంలోని గాంధీనగర్లో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కాళేశ్వరం పంపహౌస్ ఇంజినీర్లను విచారించనున్న పీసీ ఘోష్ కమిషన్
-
సమంతకు క్షమాపణలు చెప్పిన డాక్టర్.. కానీ..
-
సికింద్రాబాద్‑గోవా బైవీక్లీ ఎక్స్ప్రెస్ రైలు.. ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన కిషన్రెడ్డి
-
నటుడు రాజ్ తరుణ్ వ్యవహారంలో మరో ట్విస్ట్
-
అస్సాం అతలాకుతలం.. ఉప్పొంగుతున్న నదులు
-
జియో నుంచి కొత్తగా 5జీ డేటా బూస్టర్ ప్లాన్స్