కార్మికుల సంక్షేమానికి భరోసా కరవు
భవన నిర్మాణ రంగాల్లో పని చేస్తున్న కార్మికులకు భరోసా కరవైంది. కార్మికుల సంక్షేమం, ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న పథకాలు అందడం లేదు.
అచ్చంపేట న్యూటౌన్, న్యూస్టుడే : భవన నిర్మాణ రంగాల్లో పని చేస్తున్న కార్మికులకు భరోసా కరవైంది. కార్మికుల సంక్షేమం, ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న పథకాలు అందడం లేదు. కార్మికుల సంక్షేమంపై క్షేత్ర స్థాయిలో అవగాహన లేకపోవడంతో కనీసం గుర్తింపు కార్డులు కూడా పొందలేకపోతున్నారు. నాగర్కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్లో సహాయ కార్మిక శాఖ కార్యాలయాలున్నాయి. జిల్లా కేంద్రంలోని కార్మిక సహాయ అధికారి ఇటీవల పదవీ విరమణ పొందడంతో కల్వకుర్తికి చెందిన మహేందర్ ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకున్నారు. వనపర్తికి చెందిన వేణుగోపాల్ రెండేళ్ల నుంచి అచ్చంపేటకు ఇన్ఛార్జి అధికారిగా కొనసాగుతున్నారు. అచ్చంపేటలో విధులు నిర్వహించే అధికారి ప్రతి గురు, శుక్రవారాల్లో మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు కార్యాలయం వద్ద సూచిక బోర్డును ప్రదర్శించారు. దీంతో మిగిలిన రోజుల్లో కార్యాలయానికి తాళం కూడా తీయడం లేదు. అచ్చంపేట, కల్వకుర్తిలో నేటికి అద్దె భవనాల్లోనే కార్యాలయాలు నిర్వహిస్తున్నారు. నాగర్కర్నూల్ జిల్లా వ్యాప్తంగా 42,697 మంది భవన నిర్మాణ కార్మికులుండగా, 99,226 మంది పురపాలిక, పంచాయతీ, హమాలి తదితర అసంఘటిత రంగాల్లోని కార్మికులు ఈశ్రమ్ పథకానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందులో కల్వకుర్తిలో 7,264 మంది కాగా అచ్చంపేటలో 11,470 మంది అర్హులుగా నమోదై ఉన్నారు. అచ్చంపేట సహాయ కార్మిక శాఖ పరిధిలో కార్మికుల సంక్షేమానికి అవగాహన సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఈశ్రమ్ గుర్తింపు కార్డులివ్వాల్సిన అధికారులు తమకేమి పట్టన్నట్లు వ్యవహరిస్తున్నారు.
ఈశ్రమ్తో ఉపయోగాలు .. : అసంఘటిత రంగాల్లోని కార్మికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈశ్రమ్ పథకం ద్వారా గుర్తింపు కార్డు కలిగి ఉండాలి. రూ.110 లు చెల్లించి కార్మికుడిగా గుర్తింపు కలిగి ఉన్న కుటుంబాల్లో అమ్మాయి వివాహానికి రూ.30 వేలు, అనంతరం రెండు ప్రసవాల వరకు రూ.30 వేల చొప్పున చెల్లిస్తారు. రెండో అమ్మాయి వివాహానికి కూడా పథకం వర్తిస్తుంది. అదేవిధంగా కార్మికులు సాధారణంగా మరణిస్తే రూ.1.30 లక్షలు, ప్రమాధంలో మరణిస్తే రూ.6.30 లక్షలు పొందవచ్చు. పని ప్రదేశంలో గాయపడినా పరిస్థితిని బట్టి పరిహారం అందుతుంది. కార్మికులు ప్రతి ఐదేళ్లకోసారి రూ.60 లను చెల్లించి గుర్తింపు కార్డులను రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది.
అర్హులందరూ కార్డు పొందాలి : జిల్లాలో అసంఘటిత రంగాల్లో పని చేస్తున్న కార్మికులందరు ఈశ్రమ్ గుర్తింపు కార్డును కలిగి ఉండాలి. పథకం ద్వారా క్షేత్ర స్థాయిలో అందుతున్న ప్రోత్సాహం, పరిహారంపై అవగాహన కలిగి ఉండాలి. జిల్లా వ్యాప్తంగా కార్మికులకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతున్నాం. కార్మికుల కుటుంబాల్లో అమ్మాయి వివాహానికి ప్రోత్సాహం, కార్మికులు గాయపడినా, మరణించినా పరిహారం పొందే అవకాశాలపై అవగాహన కల్పిస్తున్నాం..
మహేందర్, ఇన్ఛార్జి జిల్లా కార్మిక శాఖాధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాజెక్టులు పరుగు పెట్టేనా?
[ 07-07-2024]
ఉమ్మడి పాలమూరులోని సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టి సారించారు. -
నడిగడ్డలో కొత్త సమీకరణం
[ 07-07-2024]
ఉమ్మడి మహబూబ్నగర్లో గత శాసనసభ ఎన్నికల ముందు వరకు 14 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ఎమ్మెల్సీలతో వెలుగు వెలిగిన భారాసకు ఇప్పుడు గడ్డు కాలం ఎదుర్కొంటోంది. -
చెంచు చిన్నారులతో వెట్టి
[ 07-07-2024]
నలమల్ల ప్రాంతంలో ఇటీవల చెంచుమహిళపై దాష్టీకం మరువకముందే మరో చెంచు చిన్నారులను జీతంగా పనిలో పెట్టుకుని వేధించిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో శనివారం వెలుగులోకి వచ్చింది. -
ప్రభుత్వ కళాశాలపై విముఖం
[ 07-07-2024]
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత విద్య, ఉచిత పుస్తకాలు అందజేస్తున్నా.. ఆశించిన స్థాయిలో ప్రవేశాలు రావడం లేదు. -
చేరువైన సాంకేతిక విద్య
[ 07-07-2024]
బీటెక్.. దేశంలో లక్షలాది విద్యార్థులు తమ స్వప్నాన్ని సాకారం చేసుకోవడం కోసం ఎంచుకునే ప్రథమ మార్గం. -
పీహెచ్సీల్లో పరీక్షలు చేసే వారేరీ?
[ 07-07-2024]
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసే ల్యాబ్ టెక్నీషియన్లు పూర్తి స్థాయిలో లేకపోవడంతో రోగులు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
అలంకారప్రాయంగా ఎన్సీడీ కేంద్రాలు
[ 07-07-2024]
అసంక్రమిత వ్యాధుల నివారణకు (నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్) ఏర్పాటు చేసిన కేంద్రాలు అలంకారప్రాయంగా ఉన్నాయి. -
చెంచుల్లో వేధిస్తున్న రక్తహీనత
[ 07-07-2024]
నాగర్కర్నూల్ జిల్లా నల్లమల ప్రాంతంలోని లోతట్టు చెంచుగూడెంలు రక్తహీనతకు నిలయంగా మారుతున్నాయి. -
కార్యశాలతో ముందడుగు
[ 07-07-2024]
తరగతి గదిలో విన్న పాఠ్యాంశాన్ని ప్రయోగాత్మకంగా చేయడం వల్ల విద్యార్థుల్లో మేధాశక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. -
విద్యుత్తు స్తంభాన్ని ఢీకొన్న లారీ.. డ్రైవర్ మృతి
[ 07-07-2024]
కృష్ణా మండలంలోని సారోపవర్ ప్లాంటు వద్ద శనివారం లారీ, విద్యుత్తు స్తంభాన్ని ఢీకొన్న ఘటనలో లారీ డ్రైవర్ మృతి చెందారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జగన్నాథుడి రథయాత్ర.. కిక్కిరిసిన పూరీ వీధులు
-
మైనర్ల చేతిలో అశ్లీల కంటెంట్.. అడ్డుకట్టకు స్పెయిన్ వినూత్న ఆలోచన!
-
‘భారతీయుడు 2’.. నేను అలా అనలేదు: కమల్ హాసన్ క్లారిటీ
-
అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో పేలిన బాయిలర్.. 20 మందికి గాయాలు
-
ప్లేయర్ల ప్రైవసీ కోసం వింబుల్డన్లో తొలిసారి ‘AI’
-
ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సమాజంలో మార్పు: సీఎం రేవంత్రెడ్డి