నేటితో ముగియనున్న ఎంపీటీసీల పదవీ కాలం
మండల పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గం(ఎంపీటీసీ) సభ్యుల పదవీ కాలం జులై 3తో ముగియనుంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న మండల పరిషత్తుల పాలకవర్గాల గడవు కూడా ముగుస్తుంది.
నిధులు, విధుల కోసం పోరాడినా దక్కని ఫలితం
న్యూస్టుడే, మహబూబ్నగర్ పట్టణం : మండల పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గం(ఎంపీటీసీ) సభ్యుల పదవీ కాలం జులై 3తో ముగియనుంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న మండల పరిషత్తుల పాలకవర్గాల గడవు కూడా ముగుస్తుంది. మండల పరిషత్తులు ప్రత్యక్ష అధికారుల పాలన, పర్యవేక్షణలోకి వెళ్లనున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 719 మంది ఎంపీటీసీ సభ్యులుగా గెలుపొందారు. వీరిలో కొందరు వివిధ కారణాలతో రాజీనామా చేయగా పలువురు మృతి చెందారు. ఆది నుంచి ఎంపీటీసీ సభ్యులు తమకు విధులు కేటాయించాలని పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించినా లాభం లేకపోయింది. అయిదేళ్ల కాలంలో ఎంపీటీసీ సభ్యులకు ఆశించిన మేర నిధులు కూడా మంజూరు కాలేదు.
ఐదేళ్లలో వచ్చింది రూ.8లక్షల లోపే : అయిదేళ్ల పదవీ కాలంలో ఒక్కో ఎంపీటీసీ సభ్యుడికి రూ.8లక్షల నిధులు కూడా విడుదల కాలేదు. రాష్ట్ర ఆర్థిక సంఘం నిధుల నుంచి ఓ ఏడాది రూ.1.50లక్షలు, మరో ఏడాది రూ.2లక్షలు వచ్చాయి. 15వ ఆర్థిక సంఘం నిధులు రెండేళ్లే, అదీ రూ.2లక్షల చొప్పున రూ.4లక్షలే వచ్చాయి. ఇంకా రెండేళ్ల నిధులు రావాల్సి ఉంది. మొత్తం మీద ఒక్కో ఎంపీటీసీకి రూ.7.50లక్షలు వచ్చాయి. 15వ ఆర్థిక సంఘం నిధులను వారు గ్రామాల్లో సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీలకు కేటాయించారు.
పంచాయతీల్లో కుర్చీ దక్కలేదు..: రెండు, మూడు గ్రామాలకు ఒక ఎంపీటీసీ సభ్యుడిగా గెలుపొందిన తమకు ఆయా పంచాయతీల్లో తమకు ప్రత్యేక కుర్చీ, టేబుల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసినా నెరవేరలేదు. గ్రామ, మండల స్థాయి అభివృద్ధి కమిటీల్లో సభ్యులుగా నియమించాలన్న కోరికా నెరవేరలేదు. మండల పరిషత్తు స్థాయీ సంఘాలను పునరుద్ధరించాలని, మండల పరిషత్తు పాఠశాలలకు తమను ఛైర్మన్లుగా నియమించాలని, ప్రతి ఎంపీటీసీకి ఏటా రూ.20లక్షల నిధులు రాష్ట్ర బడ్జెట్లో కేటాయించాలని ఆందోళనలు చేసినా ఫలితం దక్కలేదు.
ఆరు నెలలుగా వేతనం అందలే : పలుమార్లు మా 29 డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఒక్కటీ నెరవేరలేదు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనూ మరో దఫా డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. వచ్చిన కొద్ది పాటి నిధులతో చిన్న చిన్న పనులు చేశాం. ఆరు నెలలుగా మాకు ఇచ్చే గౌరవ వేతనం కూడా ఇవ్వలేదు.
రఘునాథ్, ఎంపీటీసీ సభ్యుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాజెక్టులు పరుగు పెట్టేనా?
[ 07-07-2024]
ఉమ్మడి పాలమూరులోని సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టి సారించారు. -
నడిగడ్డలో కొత్త సమీకరణం
[ 07-07-2024]
ఉమ్మడి మహబూబ్నగర్లో గత శాసనసభ ఎన్నికల ముందు వరకు 14 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ఎమ్మెల్సీలతో వెలుగు వెలిగిన భారాసకు ఇప్పుడు గడ్డు కాలం ఎదుర్కొంటోంది. -
చెంచు చిన్నారులతో వెట్టి
[ 07-07-2024]
నలమల్ల ప్రాంతంలో ఇటీవల చెంచుమహిళపై దాష్టీకం మరువకముందే మరో చెంచు చిన్నారులను జీతంగా పనిలో పెట్టుకుని వేధించిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో శనివారం వెలుగులోకి వచ్చింది. -
ప్రభుత్వ కళాశాలపై విముఖం
[ 07-07-2024]
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత విద్య, ఉచిత పుస్తకాలు అందజేస్తున్నా.. ఆశించిన స్థాయిలో ప్రవేశాలు రావడం లేదు. -
చేరువైన సాంకేతిక విద్య
[ 07-07-2024]
బీటెక్.. దేశంలో లక్షలాది విద్యార్థులు తమ స్వప్నాన్ని సాకారం చేసుకోవడం కోసం ఎంచుకునే ప్రథమ మార్గం. -
పీహెచ్సీల్లో పరీక్షలు చేసే వారేరీ?
[ 07-07-2024]
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసే ల్యాబ్ టెక్నీషియన్లు పూర్తి స్థాయిలో లేకపోవడంతో రోగులు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
అలంకారప్రాయంగా ఎన్సీడీ కేంద్రాలు
[ 07-07-2024]
అసంక్రమిత వ్యాధుల నివారణకు (నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్) ఏర్పాటు చేసిన కేంద్రాలు అలంకారప్రాయంగా ఉన్నాయి. -
చెంచుల్లో వేధిస్తున్న రక్తహీనత
[ 07-07-2024]
నాగర్కర్నూల్ జిల్లా నల్లమల ప్రాంతంలోని లోతట్టు చెంచుగూడెంలు రక్తహీనతకు నిలయంగా మారుతున్నాయి. -
కార్యశాలతో ముందడుగు
[ 07-07-2024]
తరగతి గదిలో విన్న పాఠ్యాంశాన్ని ప్రయోగాత్మకంగా చేయడం వల్ల విద్యార్థుల్లో మేధాశక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. -
విద్యుత్తు స్తంభాన్ని ఢీకొన్న లారీ.. డ్రైవర్ మృతి
[ 07-07-2024]
కృష్ణా మండలంలోని సారోపవర్ ప్లాంటు వద్ద శనివారం లారీ, విద్యుత్తు స్తంభాన్ని ఢీకొన్న ఘటనలో లారీ డ్రైవర్ మృతి చెందారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సమస్య అని వస్తే.. రాత్రి ఫోన్ చేయమన్నారు
-
గ్రామ సచివాలయ భవనాన్ని అద్దెకిచ్చేశారు!
-
పురుగుల మందు నువ్వు తాగుతావా..?పిల్లలకు పట్టించనా..!
-
గుడ్డిగా నిర్మించారు.. అడ్డుగా వదిలేశారు
-
బంగ్లా ఆధునికీకరణకు రూ.60 లక్షలు!.. వైకాపా హయాంలో ఓ అధికారిణి ఇష్టారాజ్యం
-
పూరీ జగన్నాథుని రత్న భాండాగారంపై 9వ తేదీన నిర్ణయం