భూదాన్ భూమికి రెక్కలు
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నడిబొడ్డులో ఉన్న భూదాన్ భూమికి రెక్కలొచ్చాయి.
జడ్చర్ల పట్టణంలో మాయాజాలం
ఈనాడు, మహబూబ్నగర్-న్యూస్టుడే, జడ్చర్ల గ్రామీణం: మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నడిబొడ్డులో ఉన్న భూదాన్ భూమికి రెక్కలొచ్చాయి. రెండెకరాల్లో ఉన్న ఈ భూమి ఇప్పుడు రికార్డుల్లో కనిపించడం లేదు. పట్టణంలో ఎకరా విలువ సుమారు రూ.3 కోట్ల వరకు ధర పలుకుతోంది. దీంతో భూదాన్ భూమిపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. తెర వెనుక కొందరిని పెట్టి రూ.కోట్ల విలువైన ఈ భూమిని రికార్డుల్లో లేకుండా చేసి తర్వాత పట్టాగా మార్చుకున్నారు. గతంలో ఇక్కడ భూదాన్ భూమి ఉందని జిల్లా ఉన్నతాధికారులు స్పష్టంగా ప్రొసీడింగ్స్ ఇచ్చినా కూడా దానికి ఎన్వోసీ ఇచ్చి పట్టాగా మార్చడం గమనార్హం.
జడ్చర్లలోని ఓ సర్వే నంబరులో 2023 జులైలో 2.10 ఎకరాల్లో భూదాన్ భూమి ఉందని తహసీల్దార్ రిపోర్టు ఇచ్చారని కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ ఉత్తర్వులు
జడ్చర్లలోని ఓ సర్వే నంబరులో మొత్తం 16.32 ఎకరాల స్థలం ఉంది. ఇందులో 2.10 ఎకరాల స్థలం భూదాన్ భూమికి సంబంధించింది. ఈ స్థలాన్ని జడ్చర్ల మొదటి ఎమ్మెల్యే కొత్త కేశవులు 1957-58లో భూదాన్ యజ్ఞంలో భాగంగా ప్రభుత్వానికి దానంగా ఇచ్చారు. తర్వాత ఈ భూమిని పోతిరెడ్డిపల్లి చెన్నయ్యకు అసైన్డు చేశారు. ఈ భూమిని ఆ కుటుంబం కేవలం సాగు చేసుకుని జీవనాధారం పొందాలి. వారసత్వంగా వారి కుటుంబ సభ్యుల పేరు మీద బదలాయించవచ్చు. ఈ భూమిని అమ్మడం, కొనడం చేయకూడదు. కేవలం జీవనోపాధికే ఉపయోగించుకోవాలి. లేకుంటే ప్రభుత్వం ఈ భూమిని స్వాధీనం చేసుకోవాలి. చెన్నయ్య తర్వాత ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద ఈ భూమిని బదిలీ చేశారు. 2023లో దీనిని పట్టాగా మార్చడానికి కొందరు ప్రయత్నించారు. అప్పటి తహసీల్దారు ఖాస్రా రికార్డు ఆధారంగా ఆ సర్వే నంబరులో 16.32 ఎకరాల స్థలం ఉందని, ఇందులోనే కొత్త కేశవులుకు సంబంధించిన 2.10 ఎకరాలు భూదాన్ బోర్డుకు అందించారని, ఇది నిషేధిత జాబితాలోకి వస్తుందని నివేదిక ఇచ్చారు. దీనిపై అప్పటి కలెక్టర్ ప్రొసీడింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చారు. తర్వాత ఏమైందో.. 2024 ఏప్రిల్ నుంచి ఈ భూమి పట్టాగా మారిపోయింది. రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన వెబ్సైట్లో ఈ సర్వేనంబరులో 2.10 ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో పొందు పరిచారు. కానీ ధరణిలో ఎలా రికార్డుల నుంచి మాయం చేశారన్న దానిపై రెవెన్యూ శాఖే సమాధానం చెప్పాలి.
ఆ భూములు నిషేధిత జాబితాలోకి..
ఈ సర్వే నంబరులో 2.10 ఎకరాల భూదాన్ భూమి పోగా మిగతా 14.22 ఎకరాలు పట్టా భూమిగా ఉంది. ఈ భూమిని ప్రస్తుతం ధరణిలో నిషేధిత జాబితాలో పెట్టడంతో యజమానులు లబోదిబోమంటున్నారు. భూదాన్ భూమిని జాబితా నుంచి తొలగించి పట్టా భూముల్ని ఎలా చేర్చుతారనే దానిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భూదాన్ భూమికి ఎన్వోసీ ఇచ్చిన సమయంలోనే పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తప్పించుకోవడానికి ఇలా చేసినట్లు తెలుస్తోంది. ఈ సర్వే నంబరులో పెద్ద ఎత్తున స్థిరాస్తి వ్యాపారం జరుగుతోంది. వెంచర్లు వేస్తే రూ.కోట్లలో ఆదాయం వస్తోంది. స్థిరాస్తి వ్యాపారులు, నేతల ప్రమేయం ఉంది. ఈ సర్వే నంబరుపై హైడ్రామా కొనసాగుతోంది. పట్టా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలంటే ధరణిలో దరఖాస్తు చేసుకోవాలి. సీసీఎల్ఏ నుంచి అనుమతులు రావాలి. దీనికి రూ.లక్షల్లో ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి. దీనిపై జడ్చర్ల తహసీల్దార్ సత్యనారాయణరెడ్డిని ‘ఈనాడు’ వివరణగా కోరగా ధరణిలో స్లాట్ బుక్ చేసుకోవడం, నిషేధిత జాబితాలో ఈ భూమి ఉన్నట్లు కనిపించకపోవడంతో రిజిస్ట్రేషన్ చేసినట్లు చెప్పారు.
భూదాన్ భూములు నిషేధిత జాబితాలోనే ఉంటాయి. జడ్చర్లలోని సర్వే నంబరులో ఎన్ని ఎకరాలు భూమి ఉంది? భూదాన్ భూమి ఎంత ఉంది? నిషేధిత జాబితా నుంచి ఎలా తొలగించారు? రిజిస్ట్రేషన్ ఎలా చేశారు? వంటి వాటిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తాం. నిజమని తేలితే చర్యలు తీసుకుంటాం.
మోహన్రావు, అదనపు కలెక్టర్ (రెవెన్యూ), మహబూబ్నగర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డీసీసీబీలో ఆధిపత్య పోరు
[ 04-07-2024]
డీసీసీబీ అధికారులు, పాలకవర్గం మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. కొన్ని నిర్ణయాల్లో ఇరు వర్గాల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. -
నడిగడ్డ నీటికష్టం తీరేదెన్నడో!
[ 04-07-2024]
నడిగడ్డలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి నైరాశ్యంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఉన్న ప్రాజెక్టుల్లో జూరాల తప్ప మిగిలినవన్నీ కొనసాగుతున్న ప్రాజెక్టులుగానే ఉన్నాయి. -
వీసీ లేక.. సమస్యలు తీరక!
[ 04-07-2024]
పాలమూరు విశ్వవిద్యాలయం(పీయూ) పాలక మండలి గడువు ముగియడం, శాశ్వత ఉప కులపతి లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. -
అర్హులైనా అందని పథకాలు
[ 04-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి జీరో విద్యుత్తు బిల్లు, వంటగ్యాస్ రాయితీ తదితర పథకాలు అర్హులైనా కొందరికి అందటం లేదు. -
మిగులు ఖాళీలు.. తప్పని అవస్థలు
[ 04-07-2024]
ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేసింది. అర్హులైన ఎస్జీటీలకు వివిధ సబ్జెక్టుల్లో స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించారు. -
అనిశా వలలో తహసీల్దారు
[ 04-07-2024]
పొలాన్ని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు లంచం తీసుకున్న తహసీల్దార్ బుధవారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు (అనిశా) పట్టుబడ్డారు. -
బడిబాట ప్రవేశాలు నామమాత్రం
[ 04-07-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో నూతన విద్యార్థుల ప్రవేశాలు సంఖ్య పెంచడానికి, సర్కారు పాఠశాలల్లో అందిస్తున్న విద్యా విధానాన్ని తల్లిదండ్రులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర విద్యాశాఖ అధికారులు జూన్ 6వ తేదీ నుంచి 19 వరకు ఆచార్య జయశంకర్ బాడిబాట కార్యక్రమం నిర్వహించారు. -
ఇంతింతై.. పెసరింతై
[ 04-07-2024]
పెసర పంటకు నారాయణపేట జిల్లా పెట్టింది పేరు. రకరకాల కారణాలతో ఆ పంట ఏటా తగ్గుతూ వస్తోంది. ఇప్పుడిప్పుడే మళ్లీ సాగు పుంజుకుంటోంది. జిల్లాలోనే అత్యధికంగా రైతులు దామరగిద్దలో సాగు చేస్తారు. -
నిద్దరోతున్న నిఘా కళ్లు
[ 04-07-2024]
జిల్లాలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో భద్రత కోసం అమర్చిన నిఘా కెమెరాలు నిద్ర పోతున్నాయి. -
నీటి విడుదలలో స్పష్టత కరవు
[ 04-07-2024]
ప్రస్తుత వర్షాకాలం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. -
చిరుత సంచారంతో కలకలం !
[ 04-07-2024]
నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం ఎంగంపల్లి తండా సమీపంలోని పొలాల్లో చిరుత సంచారంపై భయాందోళన నెలకొంది. -
విజయమే లక్ష్యం.. స్వర్ణమే స్వప్నం
[ 04-07-2024]
వారు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 20 మంది యువతులు. పట్టుదలతో సాధన చేస్తూ అంచెలంచెలుగా అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణులుగా ఎదిగారు. నెట్బాల్లో దేశానికి ఆశా కిరణాలుగా మారారు. -
ఆవిష్కర్తలారా.. మీకోసం
[ 04-07-2024]
ప్రజా సమస్యలకు పరిష్కారం చూపుతూ.. సృజనాత్మకతతో కొత్త ఆవిష్కరణలను చేసే వారి నుంచి ‘ఇంటింటా ఇన్నోవేటర్’ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. -
పచ్చని కొండ.. మధురానుభూతి నిండా!
[ 04-07-2024]
పేదల తిరుపతిగా విరాజిల్లుతున్న మన్యంకొండ పుణ్యక్షేత్రం పచ్చని అందాలతో కనువిందు చేస్తోంది. ఇటీవల కురిసిన వానలకు కొండపై పచ్చదనం పరచుకుంది. -
ఏడు తరగతులు.. ఒకే టీచర్
[ 04-07-2024]
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రామకృష్ణాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో 1 నుంచి 7 తరగతి వరకు 100 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. -
ఉపాధ్యాయుడిపై రౌడీషీటర్ దాడి
[ 04-07-2024]
పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడిపై బుధవారం మధ్యాహ్నం రౌడీషీటర్ దాడి చేశాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఉద్యోగులు పనివేళలు పాటించాల్సిందే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
వంచకుడు అంజాద్పై కేసు.. పెళ్లి చేసుకుంటానని బలవంతాన తీసుకెళ్లినట్లు తేజస్విని స్టేట్మెంట్
-
జగన్ రంగుల మాయకు రూ.కోట్ల ఖర్చు!
-
గురువెక్కడో మేమూ అక్కడే.. ఆయన వెళ్లిన పాఠశాలలోనే చేరిన 133 మంది విద్యార్థులు
-
నేటి నుంచి ఎప్సెట్ కౌన్సెలింగ్