మట్టి మిద్దె కింద తెల్లారిన బతుకులు
రెక్కాడితే గాని పూట గడవని ఓ పేద కుటుంబాన్ని మృత్యువు కబలించింది.
కుటుంబంలో నలుగురి మృతితో వనపట్లలో విషాదఛాయలు
వనపట్లలో కూలిన భాస్కర్ మట్టి మిద్దె
కందనూలు, న్యూస్టుడే : రెక్కాడితే గాని పూట గడవని ఓ పేద కుటుంబాన్ని మృత్యువు కబలించింది. మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ముగ్గురు చిన్నారులు దుర్మరణం చెందిన విషాద ఘటన సోమవారం తెల్లవారుజామున మండలంలోని వనపట్లలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గొడుగు బాలస్వామి, గొడుగు చిట్టెమ్మ దంపతులకు ఒక కుమారుడు భాస్కర్ ఉన్నారు. తల్లిదండ్రులు తమకు ఉన్న 1.20 ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్నారు. భాస్కర్ మాత్రం సొంత ఆటోను నడుపుతున్నాడు. పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన భాస్కర్ మేనత్త కూతురు పద్మ (26)తో 10 ఏళ్ల క్రితం వివాహమైంది. తల్లిదండ్రులకు పద్మ ఏకైక కుమారై, పద్మకు మాత్రం ఇద్దరు అమ్మాయిలు తేజశ్విని (07), వసంత (05) కుమారుడు రిత్విక్ (10 నెలలు) ఉన్నారు. కుటుంబ సభ్యులందరూ కలిసి ఐదు నెలల క్రితం రిత్విక్ నామకరణ డోలాహరణ కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులు అందరు కలిసి భోజనం చేసిన తరువాత బాలస్వామి, చిట్ట్టెమ్మ ఇద్దరు కలిసి కుమారుడు, కోడలును ముందుభాగంలో ఉన్న రేకుల వరండాలో పడుకోండి మేము ఇంట్లో నిద్రిస్తామని చెప్పగా బయట దోమలున్నాయని భాస్కర్, పద్మ పిల్లలతో ఇంట్లో నిద్రించారు. రాత్రి వర్షం నేపథ్యంలో 30 ఏళ్ల క్రితం నిర్మించిన మట్టి మిద్దె శిథిలావస్థకు చేరి తెల్లవారుజామున కూలిపోయింది. ప్రమాదంలో పద్మ, తేజ అశ్విని, వసంత, రిత్విక్ మట్టిలో ఇరుక్కుపోవడంతో శ్వాస ఆడక సంఘటన స్థలంలోనే దుర్మరణం చెందారు. భాస్కర్పైన మట్టి దిబ్బలు పడ్డాయి. ఇల్లు కూలిన సమయంలో పెద్దగా శబ్దం రావడంతో బయట నిద్రిస్తున్న తల్లిదండ్రులు అప్రమత్తమై కేకలు వేయడంతో ఇంటి పక్కన ఉన్న వారు స్పందించారు. మట్టి కింద ఇరుక్కుపోయిన పద్మ, చిన్నారులను బయటికి తీయగా అప్పటికే వారు మృతి చెందారు. భాస్కర్కు తీవ్ర గాయాలు కావడంతో ఆపస్మారక స్థితిలో ఉన్నాడు. వెంటనే అతడిని జనరల్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. ఒకే కుటుంబానికి చెందిన మహిళ, అల్లారుముద్దుగా పెరుగుతున్న ముగ్గురు చిన్నారులు దుర్మరణం చెందడటంతో వనపట్లలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆసుపత్రి వద్ద బాధిత కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. సంఘటన స్థలాన్ని ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేశ్రెడ్డి, సీఐ కనకయ్య, ఎస్సై గోవర్దన్, రెవెన్యూ అధికారులు పరిశీలించి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు.
నాగర్కర్నూల్ జనరల్ ఆసుపత్రి వద్ద కన్నీరు మున్నీరవుతున్న బంధువులు
జనరల్ ఆసుపత్రి వద్ద భాస్కర్ను పరామర్శిస్తున్న ఎమ్మెల్యే రాజేష్రెడ్డి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డీసీసీబీలో ఆధిపత్య పోరు
[ 04-07-2024]
డీసీసీబీ అధికారులు, పాలకవర్గం మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. కొన్ని నిర్ణయాల్లో ఇరు వర్గాల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. -
నడిగడ్డ నీటికష్టం తీరేదెన్నడో!
[ 04-07-2024]
నడిగడ్డలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి నైరాశ్యంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఉన్న ప్రాజెక్టుల్లో జూరాల తప్ప మిగిలినవన్నీ కొనసాగుతున్న ప్రాజెక్టులుగానే ఉన్నాయి. -
వీసీ లేక.. సమస్యలు తీరక!
[ 04-07-2024]
పాలమూరు విశ్వవిద్యాలయం(పీయూ) పాలక మండలి గడువు ముగియడం, శాశ్వత ఉప కులపతి లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. -
అర్హులైనా అందని పథకాలు
[ 04-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి జీరో విద్యుత్తు బిల్లు, వంటగ్యాస్ రాయితీ తదితర పథకాలు అర్హులైనా కొందరికి అందటం లేదు. -
మిగులు ఖాళీలు.. తప్పని అవస్థలు
[ 04-07-2024]
ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేసింది. అర్హులైన ఎస్జీటీలకు వివిధ సబ్జెక్టుల్లో స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించారు. -
అనిశా వలలో తహసీల్దారు
[ 04-07-2024]
పొలాన్ని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు లంచం తీసుకున్న తహసీల్దార్ బుధవారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు (అనిశా) పట్టుబడ్డారు. -
బడిబాట ప్రవేశాలు నామమాత్రం
[ 04-07-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో నూతన విద్యార్థుల ప్రవేశాలు సంఖ్య పెంచడానికి, సర్కారు పాఠశాలల్లో అందిస్తున్న విద్యా విధానాన్ని తల్లిదండ్రులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర విద్యాశాఖ అధికారులు జూన్ 6వ తేదీ నుంచి 19 వరకు ఆచార్య జయశంకర్ బాడిబాట కార్యక్రమం నిర్వహించారు. -
ఇంతింతై.. పెసరింతై
[ 04-07-2024]
పెసర పంటకు నారాయణపేట జిల్లా పెట్టింది పేరు. రకరకాల కారణాలతో ఆ పంట ఏటా తగ్గుతూ వస్తోంది. ఇప్పుడిప్పుడే మళ్లీ సాగు పుంజుకుంటోంది. జిల్లాలోనే అత్యధికంగా రైతులు దామరగిద్దలో సాగు చేస్తారు. -
నిద్దరోతున్న నిఘా కళ్లు
[ 04-07-2024]
జిల్లాలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో భద్రత కోసం అమర్చిన నిఘా కెమెరాలు నిద్ర పోతున్నాయి. -
నీటి విడుదలలో స్పష్టత కరవు
[ 04-07-2024]
ప్రస్తుత వర్షాకాలం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. -
చిరుత సంచారంతో కలకలం !
[ 04-07-2024]
నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం ఎంగంపల్లి తండా సమీపంలోని పొలాల్లో చిరుత సంచారంపై భయాందోళన నెలకొంది. -
విజయమే లక్ష్యం.. స్వర్ణమే స్వప్నం
[ 04-07-2024]
వారు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 20 మంది యువతులు. పట్టుదలతో సాధన చేస్తూ అంచెలంచెలుగా అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణులుగా ఎదిగారు. నెట్బాల్లో దేశానికి ఆశా కిరణాలుగా మారారు. -
ఆవిష్కర్తలారా.. మీకోసం
[ 04-07-2024]
ప్రజా సమస్యలకు పరిష్కారం చూపుతూ.. సృజనాత్మకతతో కొత్త ఆవిష్కరణలను చేసే వారి నుంచి ‘ఇంటింటా ఇన్నోవేటర్’ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. -
పచ్చని కొండ.. మధురానుభూతి నిండా!
[ 04-07-2024]
పేదల తిరుపతిగా విరాజిల్లుతున్న మన్యంకొండ పుణ్యక్షేత్రం పచ్చని అందాలతో కనువిందు చేస్తోంది. ఇటీవల కురిసిన వానలకు కొండపై పచ్చదనం పరచుకుంది. -
ఏడు తరగతులు.. ఒకే టీచర్
[ 04-07-2024]
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రామకృష్ణాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో 1 నుంచి 7 తరగతి వరకు 100 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. -
ఉపాధ్యాయుడిపై రౌడీషీటర్ దాడి
[ 04-07-2024]
పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడిపై బుధవారం మధ్యాహ్నం రౌడీషీటర్ దాడి చేశాడు.