ప్రతి పల్లెలో మీసేవ కేంద్రం
ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ గ్రామాన మీసేవ కేంద్రాలు ఏర్పాటు చేయబోతోంది.
ఉమ్మడి జిల్లాకు 131 మంజూరు
మహిళలతో ఏర్పాటుకు డీఆర్డీఏ కసరత్తు
న్యూస్టుడే, మహబూబ్నగర్ గ్రామీణం
ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ గ్రామాన మీసేవ కేంద్రాలు ఏర్పాటు చేయబోతోంది. ‘మహిళా శక్తి’ పేరుతో మంజూరు చేస్తున్న మీసేవ కేంద్రాల నిర్వహణ బాధ్యతలను స్వయం సహాయక సంఘాల సభ్యులైన అతివలకు అప్పగించబోతున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 131 మీసేవ కేంద్రాలను ప్రభుత్వం మంజూరు చేశారు. ఒక్క మహబూబ్నగర్ జిల్లాకే అత్యధికంగా 70 మీసేవ కేంద్రాలు కేటాయించారు. అత్యల్పంగా వనపర్తి జిల్లాకు నాలుగు కేంద్రాలు మంజూరయ్యాయి.
స్వయం సహాయక సంఘాల సభ్యులకు మీసేవ కేంద్రాల ఏర్పాటుపై అవగాహన కల్పిస్తున్న సీసీలు
స్వశక్తి సంఘాలకు అవగాహన: రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన మీసేవ కేంద్రాల ఏర్పాటుకు ఆయా జిల్లాల గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్డీఏ) అధికారులు క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగారు. కేంద్రాల నిర్వహణ బాధ్యతలు సహాయక సంఘాల్లో సభ్యులకే అప్పజెప్పాల్సి ఉండటంతో మహిళల ఎంపికకు కసరత్తు ప్రారంభించారు. కేంద్రాలు మంజూరైన గ్రామాల జాబితాలు పట్టుకుని ఆయా ఊళ్లకు వెళ్తున్న అధికారులు గ్రామైక్య సంఘాలతో సమావేశమవుతున్నారు. నెలవారి పొదుపుల ప్రగతి, స్త్రీనిధి, బ్యాంకు లింకేజీల ద్వారా తీసుకున్న రుణాల రికవరీ తీరు పరిగణనలోకి తీసుకుని ఏ గ్రేడ్లో ఉన్న సంఘాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మొదట వారికి మీసేవ కేంద్రం నిర్వహణపై ప్రాథమికంగా అవగాహన కల్పిస్తున్నారు. మీసేవ కేంద్రం నిర్వహణ బాధ్యతలు అప్పగించేందుకు కావాల్సిన విద్యార్హతలు, సాంకేతిక నైపుణ్యాలు వివరిస్తున్నారు. ఇంటర్, ఆపై ఎక్కువ చదువుకున్న మహిళలకు ప్రాధాన్యం ఇస్తారు. నిబంధనలు వివరించాక గ్రామైక్య సంఘం సమావేశంలో మీసేవ కేంద్రం నిర్వహణకు ముందుకు వచ్చే మహిళల పేర్లు తెలియజేయాలని.. నిర్ణయాన్ని వారికే వదిలేస్తున్నారు. మీసేవ కేంద్రం నిర్వహణకు ఇంటర్, ఆపై విద్యార్హతలు కలిగిన మహిళలు ఎక్కువ మంది ముందుకు వస్తే వారిలో అర్హులను ఎంపిక చేయాలని గ్రామైక్య సంఘం అధ్యక్ష, కార్యదర్శులకు సూచిస్తున్నారు.
ప్రభుత్వ భవనాల్లోనే నిర్వహణ..: మీసేవ కేంద్రాలను గ్రామాల్లోని ప్రైవేటు భవనాల్లో, ఇళ్లల్లో.. ఎక్కడపడితే అక్కడ ఏర్పాటు చేయరాదని ప్రభుత్వం స్పష్టంచేసింది. గ్రామ పంచాయతీలు, మహిళా సంఘాల భవనాలు, కమ్యూనిటీ భవనాలు, యువజన సంఘాల భవనాల్లో మాత్రమే మీసేవ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మీసేవ కేంద్రం ఏర్పాటుకు ఎంపిక చేసిన స్వయం సహాయక సంఘం సభ్యురాలికి గ్రామైక్య సంఘం సిఫారసుతో స్త్రీనిధి ద్వారా రూ.2.50 లక్షల రుణం మంజూరు చేస్తారు. ఈ డబ్బుతో సభ్యురాలు మీసేవ కేంద్రం ఏర్పాటుకు కావాల్సిన కంప్యూటరు, ప్రింటరు, జీపీఎస్, బయోమెట్రిక్ పరికరాలు, కెమెరా, టేబుళ్లు, ఇంటర్నెట్ కనెక్షన్ వంటివి సమకూర్చుకుంటారు. మీసేవ కేంద్రం ద్వారా ధరణి, స్థానికత, ఆదాయ, కుల, జనన, మరణ ధ్రువపత్రాలు, ఆధార్, ఆర్టీసీ, రైల్వే, తిరుమతి దర్శనం టికెట్ల రిజర్వేషన్ వంటి 40 రకాల సేవలను ప్రజలకు అందించి ఆదాయం పొందొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిల్లలు పుట్టలేదని వివాహిత ఆత్మహత్య
[ 05-07-2024]
మండలంలోని శిర్సనగండ్లకు చెందిన వివాహిత రాజశ్రీ(29) పిల్లలు పుట్టడంలేదని మనస్థాపంతో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. -
పర్యాటక శోభ ఒనగూరేనా..!
[ 05-07-2024]
పాలమూరులో పర్యాటక రంగం అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. గత ప్రభుత్వం ఉమ్మడి జిల్లాను ఎకో, రివర్, టెంపుల్ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించి కసరత్తు చేసింది. -
బడికి వెళ్లిన బాల వధువు
[ 05-07-2024]
బాలికను వివాహం చేసుకున్న యువకుడిపై పోక్సో కేసు నమోదైన ఘటన గండీడ్ మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై శేఖర్రెడ్డి కథనం ప్రకారం.. గండీడ్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు బీరప్ప ఆరో తరగతి చదివే అదే గ్రామానికి చెందిన బాలికను గత నెలలో వివాహం చేసుకున్నాడు. -
వెంటాడుతున్న డెంగీ భయం
[ 05-07-2024]
జిల్లాలోని అనేక ప్రాంతాల్లో డెంగీ కేసులు ప్రజలను భయపెడుతున్నాయి. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దోమలు ఎక్కువై విష జ్వరాలు వస్తున్నాయి. పారిశుద్ధ్యలోపం కారణంగా డెంగీ బారినపడుతున్నారు. -
అతివల వ్యాపారాలకు పెద్దపీట
[ 05-07-2024]
మహిళలు తాము సంపాదించిన దాంట్లో ఏళ్లుగా కొంత పొదుపు చేసుకుంటూ.. బ్యాంకుల ద్వారా రుణాలు పొందుతున్నారు. -
పాలమూరు అభివృద్ధికి కలిసి పనిచేస్తా
[ 05-07-2024]
కేంద ప్రభుత్వ సహకారం లేకుండా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కాంగ్రెస్ నేతలు ఏమీ చేయలేరని ఎంపీ డీకే అరుణ అన్నారు. -
గోదాములు దూరం.. రైతుకు భారం
[ 05-07-2024]
ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ పరంగా తగిన రేక్ పాయింట్లు (గూడ్స్ షెడ్లు) లేకపోవడంతో ఆర్థికపరంగా రైతులు అదనపు భారాన్ని మోయాల్సి వస్తోంది. -
ఐటీఐల్లో ప్రవేశానికి రెండో విడత నోటిఫికేషన్
[ 05-07-2024]
ఐటీఐ కోర్సుల్లో రెండో విడత ప్రవేశానికి ఉపాధి శిక్షణ శాఖ నోటిఫికేషన్ జారీ చేసినట్లు మహబూబ్నగర్ జిల్లా కన్వీనర్, మెట్టుగడ్డ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ బి.శాంతయ్య తెలిపారు. -
పట్టుదలతో చదివారు.. ఫలితంతో మెరిశారు
[ 05-07-2024]
నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం పాలెంలోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కళాశాల విద్యార్థులు ప్రతిభతో కళాశాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తున్నారు. -
ప్రాజెక్టుల పెండింగ్ పనులపై నివేదికలివ్వండి
[ 05-07-2024]
పాలమూరులోని సాగునీటి ప్రాజెక్టుల్లో పెండింగ్ పనులపై పూర్తిస్థాయి నివేదికలు ఇవ్వాలని మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. -
ఎస్సీ గురుకులాల్లో మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తులు
[ 05-07-2024]
ఎస్సీ గురుకుల విద్యాలయాల్లో మిగులు సీట్లను భర్తీ చేసేందుకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. -
అనుమతిలేని వ్యాపారం.. అన్నదాతకు నష్టం
[ 05-07-2024]
అన్నదాతల అమాయకత్వం, దిగుబడులపై ఆశ బయో కంపెనీలకు సిరులు కురిపిస్తుంటే... వాటిని రైతులకు అమ్ముతున్న డీలర్లకు లాభాలతో పాటు విహార యాత్రల్లో, విందులు.. చిందులు తొక్కిస్తున్నాయి. -
టిప్పర్ కింద పడి యువకుడి మృతి
[ 05-07-2024]
టిప్పర్ కింద పడి నర్సిరెడ్డి(30) అనే యువకుడు మృతి చెందిన సంఘటన నారాయణపేటలో చోటుచేసుకుంది. పద్మమ్మ, అనంత్రెడ్డిలకు ముగ్గురు ఆడపిల్లలు. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. -
ఎమ్మెల్యేను కాంగ్రెస్లో చేర్చుకోవద్దని నిరసనలు
[ 05-07-2024]
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి(భారాస)ని కాంగ్రెస్లో చేర్చుకోవద్దంటూ గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కాంగ్రెస్ శ్రేణులు ధర్నాలు నిర్వహించాయి.
తాజా వార్తలు (Latest News)
-
అసలు కథ ముందుంది.. ‘కల్కి’ సీక్వెల్పై స్పందించిన నాగ్ అశ్విన్
-
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు భంగపాటు.. అధికారం దిశగా లేబర్ పార్టీ
-
ద్వారంపూడి వారి కాలుష్య పరిశ్రమ
-
వైకాపా విధేయుల్లో వణుకు.. అంటకాగిన అధికారులపై కూటమి ప్రభుత్వం ఆరా
-
అనుమతి లేకున్నా ఉన్నట్లు చూపి ప్లాట్ల విక్రయం.. కాకాణి సొంతూరిలో భారీ మోసం
-
హైదరాబాద్ ఇళ్ల అమ్మకాల్లో 21% వృద్ధి