శిథిల భవనాల్లో బతుకు భద్రమేనా!
వర్షాకాలం వస్తుందంటేనే పేద, మధ్యతరగతి కుటుంబాల్లో వణుకు మొదలవుతోంది. పాలమూరులో చాలామంది మట్టి మిద్దెల్లోనే నివాసం ఉంటున్నారు.
ధరూరులో భారీ వర్షానికి కూలిన ఇల్లు (పాతచిత్రం)
ధరూరు న్యూస్టుడే: వర్షాకాలం వస్తుందంటేనే పేద, మధ్యతరగతి కుటుంబాల్లో వణుకు మొదలవుతోంది. పాలమూరులో చాలామంది మట్టి మిద్దెల్లోనే నివాసం ఉంటున్నారు. భారీ వర్షాల కారణంగా మట్టి మిద్దెలు, శిథిలావస్థకు చేరిన భవనాలు కూలిపోయి అమాయకులు బలవుతున్నారు. తాజాగా నాగర్కర్నూల్ జిల్లా వనపట్లలో మట్టి మిద్దె కూలిపోయి నలుగురు దుర్మరణం పాలవ్వడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఉమ్మడి జిల్లాలో పూర్వం మట్టి మిద్దెలే నివాసాలుగా ఉండేవి. ఇప్పటికీ పేద, మధ్యతరగతి వర్గాలు చాలామంది ఈ ఇళ్లల్లోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఏటా వర్షాకాలంలో శిథిల భవనాలు కూలి మృత్యువాత పడుతూనే ఉన్నారు. 2020లో భారీ వర్షాలకు మట్టిమిద్దెలు, భవనాలు కూలిన ఘటనలో ఉమ్మడి జిల్లాలో 20 మందికి పైగా మృత్యువాత పడ్డారు. నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం రాకొండలో మట్టిమిద్దె కూలిపోయి తల్లీకుమార్తెలు మృతి చెందారు. ఈ ఘటనలను దృష్టిలో ఉంచుకొని 2021, 2022లో పల్లెప్రగతిలో చాలా వరకు శిథిలమైన ఇళ్లు, పట్టణాల్లో శిథిల భవనాలను కూల్చివేశారు. ఎలాంటి ప్రత్యామ్నాయం లేకుండా ఉండి నివాసం ఉంటున్న వాటిని కూల్చడానికి ఇంటి యజమానులు అనుమతి ఇవ్వకపోవటంతో వాటిని అలాగే వదిలేశారు. వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లనే తాత్కాలిక మరమ్మతులు చేసి వాటిలోనే నివాసం ఉంటున్నారు.
శిథిలావస్థలోని ఇళ్లలో నివాసముంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన అవసరాన్ని చెబుతూ మే 21న ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనం
46 వేలకు పైగా: పాలమూరు జిల్లాలో ప్రభుత్వ అధికారులు గుర్తించిన గణాంకాల ప్రకారం 46,701 పైగా శిథిలావస్థకు చేరిన గృహాలు, భవనాలు ఉన్నాయి. వాటిలో గత మూడేళ్లలో సుమారు 3,500 పైగా ఇళ్లు, ఇతర నిర్మాణాలను కూల్చేశారు. పట్టణ, పల్లెప్రగతిలో దాదాపుగా 14,690 పైగా నిర్మాణాలు కూల్చి శిథిలాలను తొలగించారు. వాటిలో కూడా ఆర్థిక స్థోమత ఉన్న వారు నిర్మాణాలు చేసుకోగా మిగిలిన వారు ప్రభుత్వ ఇళ్ల నిర్మాణ పథకం కోసం ఖాళీ స్థలాలను ఉంచుకొని ఎదురు చూస్తున్నారు. మిగిలిన 28,511 గృహాలు, భవనాలు ఇంకా శిథిలావస్థకే చేరి కూలే దశలో ఉన్నాయి. ఈ ఏడాది కొన్ని ప్రాంతాల్లో ఉమ్మడి జిలాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో శిథిలమైన ఇళ్లలో ఉంటున్న వారు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది. వాటిని కూల్చి నూతన నిర్మాణం చేసుకునే ఆర్థిక స్థోమత లేక అలాగే నివాసం ఉంటున్నారు. గత్యంతరం లేని పరిస్థితిలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ప్రస్తుతం పల్లెల్లో ప్రత్యేక పాలన కొనసాగుతుండటం వల్ల శిథిల భవనాలు, నిర్మాణాల తొలగింపు పట్ల తగిన చర్యలు తీసుకోవటానికి అధికారులు వెనకంజ వేస్తున్నారు. భారాస హయాంలో రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి అర్హులకు ఇస్తామని చాలామందికి పంపిణీ చేయలేకపోయారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ప్రకటించడంతో 2.71 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డీసీసీబీలో ఆధిపత్య పోరు
[ 04-07-2024]
డీసీసీబీ అధికారులు, పాలకవర్గం మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. కొన్ని నిర్ణయాల్లో ఇరు వర్గాల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. -
నడిగడ్డ నీటికష్టం తీరేదెన్నడో!
[ 04-07-2024]
నడిగడ్డలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి నైరాశ్యంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఉన్న ప్రాజెక్టుల్లో జూరాల తప్ప మిగిలినవన్నీ కొనసాగుతున్న ప్రాజెక్టులుగానే ఉన్నాయి. -
వీసీ లేక.. సమస్యలు తీరక!
[ 04-07-2024]
పాలమూరు విశ్వవిద్యాలయం(పీయూ) పాలక మండలి గడువు ముగియడం, శాశ్వత ఉప కులపతి లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. -
అర్హులైనా అందని పథకాలు
[ 04-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి జీరో విద్యుత్తు బిల్లు, వంటగ్యాస్ రాయితీ తదితర పథకాలు అర్హులైనా కొందరికి అందటం లేదు. -
మిగులు ఖాళీలు.. తప్పని అవస్థలు
[ 04-07-2024]
ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేసింది. అర్హులైన ఎస్జీటీలకు వివిధ సబ్జెక్టుల్లో స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించారు. -
అనిశా వలలో తహసీల్దారు
[ 04-07-2024]
పొలాన్ని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు లంచం తీసుకున్న తహసీల్దార్ బుధవారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు (అనిశా) పట్టుబడ్డారు. -
బడిబాట ప్రవేశాలు నామమాత్రం
[ 04-07-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో నూతన విద్యార్థుల ప్రవేశాలు సంఖ్య పెంచడానికి, సర్కారు పాఠశాలల్లో అందిస్తున్న విద్యా విధానాన్ని తల్లిదండ్రులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర విద్యాశాఖ అధికారులు జూన్ 6వ తేదీ నుంచి 19 వరకు ఆచార్య జయశంకర్ బాడిబాట కార్యక్రమం నిర్వహించారు. -
ఇంతింతై.. పెసరింతై
[ 04-07-2024]
పెసర పంటకు నారాయణపేట జిల్లా పెట్టింది పేరు. రకరకాల కారణాలతో ఆ పంట ఏటా తగ్గుతూ వస్తోంది. ఇప్పుడిప్పుడే మళ్లీ సాగు పుంజుకుంటోంది. జిల్లాలోనే అత్యధికంగా రైతులు దామరగిద్దలో సాగు చేస్తారు. -
నిద్దరోతున్న నిఘా కళ్లు
[ 04-07-2024]
జిల్లాలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో భద్రత కోసం అమర్చిన నిఘా కెమెరాలు నిద్ర పోతున్నాయి. -
నీటి విడుదలలో స్పష్టత కరవు
[ 04-07-2024]
ప్రస్తుత వర్షాకాలం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. -
చిరుత సంచారంతో కలకలం !
[ 04-07-2024]
నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం ఎంగంపల్లి తండా సమీపంలోని పొలాల్లో చిరుత సంచారంపై భయాందోళన నెలకొంది. -
విజయమే లక్ష్యం.. స్వర్ణమే స్వప్నం
[ 04-07-2024]
వారు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 20 మంది యువతులు. పట్టుదలతో సాధన చేస్తూ అంచెలంచెలుగా అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణులుగా ఎదిగారు. నెట్బాల్లో దేశానికి ఆశా కిరణాలుగా మారారు. -
ఆవిష్కర్తలారా.. మీకోసం
[ 04-07-2024]
ప్రజా సమస్యలకు పరిష్కారం చూపుతూ.. సృజనాత్మకతతో కొత్త ఆవిష్కరణలను చేసే వారి నుంచి ‘ఇంటింటా ఇన్నోవేటర్’ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. -
పచ్చని కొండ.. మధురానుభూతి నిండా!
[ 04-07-2024]
పేదల తిరుపతిగా విరాజిల్లుతున్న మన్యంకొండ పుణ్యక్షేత్రం పచ్చని అందాలతో కనువిందు చేస్తోంది. ఇటీవల కురిసిన వానలకు కొండపై పచ్చదనం పరచుకుంది. -
ఏడు తరగతులు.. ఒకే టీచర్
[ 04-07-2024]
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రామకృష్ణాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో 1 నుంచి 7 తరగతి వరకు 100 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. -
ఉపాధ్యాయుడిపై రౌడీషీటర్ దాడి
[ 04-07-2024]
పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడిపై బుధవారం మధ్యాహ్నం రౌడీషీటర్ దాడి చేశాడు.
తాజా వార్తలు (Latest News)
-
వరల్డ్ కప్ మెడల్తో పంత్.. ట్రోల్ చేసిన అక్షర్, సిరాజ్
-
ఇంకా పరారీలోనే భోలే బాబా.. ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు
-
ఘనంగా వరలక్ష్మీ శరత్కుమార్ రిసెప్షన్.. తారల సందడి
-
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ
-
అన్లిమిటెడ్ క్లెయిం మొత్తంతో ఐసీఐసీఐ ఆరోగ్య బీమా పాలసీ!
-
వాయు కాలుష్యంతో భారత్లో ఏటా 33 వేల మరణాలు: లాన్సెట్