పారిశుద్ధ్య కార్మికులకు పెరిగిన పని భారం
జిల్లా ఆసుపత్రిలో రెండు ఏజెన్సీల మధ్యన పారిశుద్ధ్య కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు.
గుత్తేదారుల పంచాయతీతో కార్మికులకు ఇక్కట్లు
ఇటీవల ఆసుపత్రికి వచ్చిన మంత్రి జూపల్లికి తమ సమస్యలను చెప్పుకొంటున్న పారిశుద్ధ్య కార్మికులు
నాగర్కర్నూల్, న్యూస్టుడే : జిల్లా ఆసుపత్రిలో రెండు ఏజెన్సీల మధ్యన పారిశుద్ధ్య కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. అతి తక్కువ వేతనంతో పాటు పని భారం పెరిగింది. సమస్యను పరిష్కరించాలని పారిశుద్ధ్య కార్మికులు ఇటీవల జిల్లా ఆసుపత్రికి వచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావుకు మొరపెట్టుకున్నారు. జిల్లా ఆసుపత్రిలో సేవలందించే కార్మికులు ప్రైవేట్ ఏజెన్సీల కింద పనిచేస్తారు. ఏజెన్సీలే కార్మికులకు వేతనాలు చెల్లిస్తారు. నాలుగేళ్ల క్రితమే జిల్లా ఆసుపత్రిని వంద పడకల నుంచి 330 పడకలకు పెంపుదల చేశారు. మరోవైపు వైద్య విధాన పరిషత్ కింద ఉన్న జిల్లా ఆసుపత్రిని వైద్య కళాశాలకు అనుబంధంగా మార్పు చేశారు. దీంతో రోగుల సంఖ్య పెరిగింది. వైద్య కళాశాల రావడంతో వైద్యుల సంఖ్య అధికమైంది. కానీ జిల్లా ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య పెరగలేదు. ఇప్పుడు పనిచేసే కార్మికులకు పెరిగిన వేతనాలు కాకుండా కేవలం రూ.7,600 మాత్రమే చెల్లిస్తున్నారు. కార్మికులకు కొత్త జీవో ప్రకారం ప్రకారం రూ.15వేలు చెల్లించాల్సి ఉంది. కానీ ఇక్కడ అది అమలు కావడం లేదు. ఆసుపత్రిలో పనులు చేయించే రెండు ఏజెన్సీలు కోర్టుకు వెళ్లాయి. వివాదం కోర్టులో ఉందని కార్మికులకు పాత వేతనాలే చెల్లిస్తున్నారు.
కార్మికులపై పెరిగిన పని భారం.. : జిల్లా ఆసుపత్రిలో ప్రస్తుతం ఉన్న దానికి 100 నుంచి 140 మంది కార్మికులు పని చేయాల్సి ఉంటుంది. పారిశుద్ధ్యం, సెక్యూరిటీ, శానిటేషన్ పనులు చేయించాల్సి ఉంటుంది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాల్సి ఉంటుంది. 140 మంది పని చేయాల్సిన చోట కేవలం 30 మందితో పనులు చేయిస్తున్నారు. దీంతో ఉన్నవారిపై పని భారం విపరీతంగా పెరిగింది. మా గోడును పట్టించుకోండంటూ ఆసుపత్రికి వచ్చిన అధికారులు, ప్రజాప్రతినిధులకు కార్మికులు మొర పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం 33 మంది ఉన్నట్లుగా చూపిస్తున్నారు. కానీ 26 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఉన్న వారితో నెట్టుకొస్తున్నారు. ఆసుపత్రిలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు ఇబ్బందులు తప్పటం లేదు. కొద్ది రోజుల్లోనే కోర్టులో ఉన్న వివాదం అయిపోతుందని, ఆ తర్వాత కొత్తగా కార్మికులను తీసుకుంటామని జిల్లా ఆసుపత్రి అధికారులు పేర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డీసీసీబీలో ఆధిపత్య పోరు
[ 04-07-2024]
డీసీసీబీ అధికారులు, పాలకవర్గం మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. కొన్ని నిర్ణయాల్లో ఇరు వర్గాల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. -
నడిగడ్డ నీటికష్టం తీరేదెన్నడో!
[ 04-07-2024]
నడిగడ్డలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి నైరాశ్యంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఉన్న ప్రాజెక్టుల్లో జూరాల తప్ప మిగిలినవన్నీ కొనసాగుతున్న ప్రాజెక్టులుగానే ఉన్నాయి. -
వీసీ లేక.. సమస్యలు తీరక!
[ 04-07-2024]
పాలమూరు విశ్వవిద్యాలయం(పీయూ) పాలక మండలి గడువు ముగియడం, శాశ్వత ఉప కులపతి లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. -
అర్హులైనా అందని పథకాలు
[ 04-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి జీరో విద్యుత్తు బిల్లు, వంటగ్యాస్ రాయితీ తదితర పథకాలు అర్హులైనా కొందరికి అందటం లేదు. -
మిగులు ఖాళీలు.. తప్పని అవస్థలు
[ 04-07-2024]
ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేసింది. అర్హులైన ఎస్జీటీలకు వివిధ సబ్జెక్టుల్లో స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించారు. -
అనిశా వలలో తహసీల్దారు
[ 04-07-2024]
పొలాన్ని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు లంచం తీసుకున్న తహసీల్దార్ బుధవారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు (అనిశా) పట్టుబడ్డారు. -
బడిబాట ప్రవేశాలు నామమాత్రం
[ 04-07-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో నూతన విద్యార్థుల ప్రవేశాలు సంఖ్య పెంచడానికి, సర్కారు పాఠశాలల్లో అందిస్తున్న విద్యా విధానాన్ని తల్లిదండ్రులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర విద్యాశాఖ అధికారులు జూన్ 6వ తేదీ నుంచి 19 వరకు ఆచార్య జయశంకర్ బాడిబాట కార్యక్రమం నిర్వహించారు. -
ఇంతింతై.. పెసరింతై
[ 04-07-2024]
పెసర పంటకు నారాయణపేట జిల్లా పెట్టింది పేరు. రకరకాల కారణాలతో ఆ పంట ఏటా తగ్గుతూ వస్తోంది. ఇప్పుడిప్పుడే మళ్లీ సాగు పుంజుకుంటోంది. జిల్లాలోనే అత్యధికంగా రైతులు దామరగిద్దలో సాగు చేస్తారు. -
నిద్దరోతున్న నిఘా కళ్లు
[ 04-07-2024]
జిల్లాలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో భద్రత కోసం అమర్చిన నిఘా కెమెరాలు నిద్ర పోతున్నాయి. -
నీటి విడుదలలో స్పష్టత కరవు
[ 04-07-2024]
ప్రస్తుత వర్షాకాలం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. -
చిరుత సంచారంతో కలకలం !
[ 04-07-2024]
నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం ఎంగంపల్లి తండా సమీపంలోని పొలాల్లో చిరుత సంచారంపై భయాందోళన నెలకొంది. -
విజయమే లక్ష్యం.. స్వర్ణమే స్వప్నం
[ 04-07-2024]
వారు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 20 మంది యువతులు. పట్టుదలతో సాధన చేస్తూ అంచెలంచెలుగా అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణులుగా ఎదిగారు. నెట్బాల్లో దేశానికి ఆశా కిరణాలుగా మారారు. -
ఆవిష్కర్తలారా.. మీకోసం
[ 04-07-2024]
ప్రజా సమస్యలకు పరిష్కారం చూపుతూ.. సృజనాత్మకతతో కొత్త ఆవిష్కరణలను చేసే వారి నుంచి ‘ఇంటింటా ఇన్నోవేటర్’ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. -
పచ్చని కొండ.. మధురానుభూతి నిండా!
[ 04-07-2024]
పేదల తిరుపతిగా విరాజిల్లుతున్న మన్యంకొండ పుణ్యక్షేత్రం పచ్చని అందాలతో కనువిందు చేస్తోంది. ఇటీవల కురిసిన వానలకు కొండపై పచ్చదనం పరచుకుంది. -
ఏడు తరగతులు.. ఒకే టీచర్
[ 04-07-2024]
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రామకృష్ణాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో 1 నుంచి 7 తరగతి వరకు 100 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. -
ఉపాధ్యాయుడిపై రౌడీషీటర్ దాడి
[ 04-07-2024]
పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడిపై బుధవారం మధ్యాహ్నం రౌడీషీటర్ దాడి చేశాడు.
తాజా వార్తలు (Latest News)
-
పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వాయిదా
-
సగర్వంగా స్వదేశానికి.. భారత్ చేరుకున్న రోహిత్ సేన
-
ఉచిత ఇసుక మార్గదర్శకాలు సిద్ధం
-
ఏపీలో సినీ స్టూడియో నిర్మాణానికి కృషి: మంత్రి కందుల దుర్గేష్
-
వెళ్లిపోవాలనుకునేవారిని ఎంత కాలం ఆపగలం?.. పార్టీ నేతలతో జగన్
-
దిల్లీ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు.. నేడు ప్రధాని మోదీతో భేటీ