అయ్యో! పేట
ఏ ఒక్క మండలంలోనూ ఎంఈవోలు లేని జిల్లాగా అరుదైన రికార్డును నారాయణపేట సొంతం చేసుకుంది.
ఒక్క ఎంఈవో లేని జిల్లా
మంత్రోనిపల్లిలో మధ్యాహ్న భోజనం నిలిచిపోవడంతో టిఫిన్లు తెచ్చుకున్న విద్యార్థులు
న్యూస్టుడే, నారాయణపేట న్యూటౌన్: ఏ ఒక్క మండలంలోనూ ఎంఈవోలు లేని జిల్లాగా అరుదైన రికార్డును నారాయణపేట సొంతం చేసుకుంది. విద్యావ్యవస్థలో జిల్లాస్థాయి పర్యవేక్షణకు డీఈవో, మండల స్థాయిలో పర్యవేక్షణకు ఎంఈవో(మండల విద్యాధికారి) ఉంటారు. ప్రస్తుతం జిల్లాలో 13 మండలాలు ఉండగా, ఈ నెల నుంచి ఏ ఒక్క మండలంలోనూ రెగ్యులర్ ఎంఈవో లేకుండా పోయారు. గత నెలాఖరు వరకు ఊట్కూరు మండల విద్యాధికారిగా ఉన్న వెంకటయ్య గత నెలాఖరున పదవీ విరమణ చేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది.
జిల్లాలో ఉన్న ఏకైక రెగ్యులర్ ఎంఈవో వెంకటయ్య ఊట్కూరుతో పాటు నర్వ, మక్తల్, మాగనూరు, కృష్ణా మండలాలకు ఇన్ఛార్జిగా ఉండేవారు. ప్రస్తుతం ఆ అయిదు మండలాలు ఇన్ఛార్జిలు లేని అనాథలయ్యాయి. కోస్గి, నారాయణపేట జీహెచ్ఎంలు అంజలీదేవి, గోపాల్నాయక్ బదిలీపై వెళ్లక ముందు ఇన్ఛార్జి ఎంఈవోలుగా పనిచేశారు. అంజలీదేవి కోస్గితో పాటు ధన్వాడ, మరికల్ మండలాలకు ఇన్ఛార్జి. ఈమె బదిలీలో భాగంగా కొన్ని నెలల కిందట మహబూబ్నగర్ వెళ్లారు. గోపాల్నాయక్ దామరగిద్ద, నారాయణపేట, మద్దూరు మండలాల ఇన్ఛార్జి. ఈయన కొన్ని నెలల కిందట మహబూబ్నగర్ జిల్లాలోని వేపూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలకు బదిలీపై వెళ్లారు. వేరే జిల్లాల్లో పనిచేస్తూ ఇక్కడ ఇన్ఛార్జి ఎంఈవోలుగా ఏం చేస్తారో అర్థంకాని పరిస్థితి. ఉన్నతాధికార యంత్రాంగం అక్కడ, ఇక్కడ వేరుగా ఉండటంతో జవాబుదారీ ఎలా సాధ్యమన్నది ప్రశ్న.
నోడల్ అధికారుల సేవలు అంతంతే!
ప్రభుత్వం క్లస్టర్ జీహెచ్ఎంలను మండల నోడల్ అధికారులుగా నియమించినా వారికి తమ పాఠశాల బాధ్యతల్ని చూసుకునేందుకే సమయం సరిపోవడంలేదు. వీరు తమ క్లస్టర్ పరిధిలోని పాఠశాలల పర్యవేక్షణ కూడా వారికి కష్టమే. అలాంటిది ఎంఈవోలుగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తారంటే అత్యాశే. ప్రస్తుతం జిల్లాలో పర్యవేక్షణ కొరవడి కొన్ని బడుల్లో సిబ్బంది ఆడిందే ఆటగా మారింది. పర్యవేక్షణ పకడ్బందీగా ఉన్న సమయంలోనే మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలలకు ఉపాధ్యాయులు వెళ్లని సంఘటనలు కోకొల్లలు. ప్రస్తుతం అడిగే వారే లేకపోవడంతో చదువులు దైవాధీనం... పిల్లల అదృష్టంలా మారింది. ఉదాహరణకు ధన్వాడ మండలం మంత్రోనిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను పరిశీలిస్తే ఇక్కడ ఉపాధ్యాయుడు, వంట ఏజెన్సీ ప్రతినిధికి మధ్య తలెత్తిన పేచీ మూలంగా మధ్యాహ్న భోజనం ఆగిపోయింది. ఎంఈవో ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. ఇకనైనా ప్రభుత్వం జిల్లాలో విద్యావ్యవస్థను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిల్లలు పుట్టలేదని వివాహిత ఆత్మహత్య
[ 05-07-2024]
మండలంలోని శిర్సనగండ్లకు చెందిన వివాహిత రాజశ్రీ(29) పిల్లలు పుట్టడంలేదని మనస్థాపంతో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. -
పర్యాటక శోభ ఒనగూరేనా..!
[ 05-07-2024]
పాలమూరులో పర్యాటక రంగం అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. గత ప్రభుత్వం ఉమ్మడి జిల్లాను ఎకో, రివర్, టెంపుల్ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించి కసరత్తు చేసింది. -
బడికి వెళ్లిన బాల వధువు
[ 05-07-2024]
బాలికను వివాహం చేసుకున్న యువకుడిపై పోక్సో కేసు నమోదైన ఘటన గండీడ్ మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై శేఖర్రెడ్డి కథనం ప్రకారం.. గండీడ్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు బీరప్ప ఆరో తరగతి చదివే అదే గ్రామానికి చెందిన బాలికను గత నెలలో వివాహం చేసుకున్నాడు. -
వెంటాడుతున్న డెంగీ భయం
[ 05-07-2024]
జిల్లాలోని అనేక ప్రాంతాల్లో డెంగీ కేసులు ప్రజలను భయపెడుతున్నాయి. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దోమలు ఎక్కువై విష జ్వరాలు వస్తున్నాయి. పారిశుద్ధ్యలోపం కారణంగా డెంగీ బారినపడుతున్నారు. -
అతివల వ్యాపారాలకు పెద్దపీట
[ 05-07-2024]
మహిళలు తాము సంపాదించిన దాంట్లో ఏళ్లుగా కొంత పొదుపు చేసుకుంటూ.. బ్యాంకుల ద్వారా రుణాలు పొందుతున్నారు. -
పాలమూరు అభివృద్ధికి కలిసి పనిచేస్తా
[ 05-07-2024]
కేంద ప్రభుత్వ సహకారం లేకుండా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కాంగ్రెస్ నేతలు ఏమీ చేయలేరని ఎంపీ డీకే అరుణ అన్నారు. -
గోదాములు దూరం.. రైతుకు భారం
[ 05-07-2024]
ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ పరంగా తగిన రేక్ పాయింట్లు (గూడ్స్ షెడ్లు) లేకపోవడంతో ఆర్థికపరంగా రైతులు అదనపు భారాన్ని మోయాల్సి వస్తోంది. -
ఐటీఐల్లో ప్రవేశానికి రెండో విడత నోటిఫికేషన్
[ 05-07-2024]
ఐటీఐ కోర్సుల్లో రెండో విడత ప్రవేశానికి ఉపాధి శిక్షణ శాఖ నోటిఫికేషన్ జారీ చేసినట్లు మహబూబ్నగర్ జిల్లా కన్వీనర్, మెట్టుగడ్డ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ బి.శాంతయ్య తెలిపారు. -
పట్టుదలతో చదివారు.. ఫలితంతో మెరిశారు
[ 05-07-2024]
నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం పాలెంలోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కళాశాల విద్యార్థులు ప్రతిభతో కళాశాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తున్నారు. -
ప్రాజెక్టుల పెండింగ్ పనులపై నివేదికలివ్వండి
[ 05-07-2024]
పాలమూరులోని సాగునీటి ప్రాజెక్టుల్లో పెండింగ్ పనులపై పూర్తిస్థాయి నివేదికలు ఇవ్వాలని మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. -
ఎస్సీ గురుకులాల్లో మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తులు
[ 05-07-2024]
ఎస్సీ గురుకుల విద్యాలయాల్లో మిగులు సీట్లను భర్తీ చేసేందుకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. -
అనుమతిలేని వ్యాపారం.. అన్నదాతకు నష్టం
[ 05-07-2024]
అన్నదాతల అమాయకత్వం, దిగుబడులపై ఆశ బయో కంపెనీలకు సిరులు కురిపిస్తుంటే... వాటిని రైతులకు అమ్ముతున్న డీలర్లకు లాభాలతో పాటు విహార యాత్రల్లో, విందులు.. చిందులు తొక్కిస్తున్నాయి. -
టిప్పర్ కింద పడి యువకుడి మృతి
[ 05-07-2024]
టిప్పర్ కింద పడి నర్సిరెడ్డి(30) అనే యువకుడు మృతి చెందిన సంఘటన నారాయణపేటలో చోటుచేసుకుంది. పద్మమ్మ, అనంత్రెడ్డిలకు ముగ్గురు ఆడపిల్లలు. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. -
ఎమ్మెల్యేను కాంగ్రెస్లో చేర్చుకోవద్దని నిరసనలు
[ 05-07-2024]
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి(భారాస)ని కాంగ్రెస్లో చేర్చుకోవద్దంటూ గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కాంగ్రెస్ శ్రేణులు ధర్నాలు నిర్వహించాయి.
తాజా వార్తలు (Latest News)
-
అసలు కథ ముందుంది.. ‘కల్కి’ సీక్వెల్పై స్పందించిన నాగ్ అశ్విన్
-
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు భంగపాటు.. అధికారం దిశగా లేబర్ పార్టీ
-
ద్వారంపూడి వారి కాలుష్య పరిశ్రమ
-
వైకాపా విధేయుల్లో వణుకు.. అంటకాగిన అధికారులపై కూటమి ప్రభుత్వం ఆరా
-
అనుమతి లేకున్నా ఉన్నట్లు చూపి ప్లాట్ల విక్రయం.. కాకాణి సొంతూరిలో భారీ మోసం
-
హైదరాబాద్ ఇళ్ల అమ్మకాల్లో 21% వృద్ధి