నేడు నల్లమలకు మంత్రి సీతక్క రాక
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ(సీతక్క) మంగళవారం నల్లమలలో పర్యటించనున్నారు.
అమ్రాబాద్ మండలం తెలుగుపల్లిలో మంత్రి ప్రారంభించనున్న కేజీబీవీ
అమ్రాబాద్, న్యూస్టుడే: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ(సీతక్క) మంగళవారం నల్లమలలో పర్యటించనున్నారు. మండలంలోని తెలుగుపల్లిలో ఉదయం రూ.3.5 కోట్లతో నిర్మించిన కేజీబీవీని ప్రారంభించి తర్వాత గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేసి ఆవరణలో మొక్కలు నాటి వన మహోత్సవాన్ని ప్రారంభిస్తారు. తర్వాత ఎల్మపల్లిలో ఎస్సీ సామాజిక భవనానికి, అమ్రాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. మ.12 గంటలకు పదర మండలం రాయలగండి శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో అభివృద్ధి పనులను ప్రారంభించి అనంతరం అచ్చంపేట మండలం బయలుదేరుతారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ పాల్గొంటారని ఎంపీడీవో మోహన్లాల్ తెలిపారు.
ఉప్పునుంతల, న్యూస్టుడే: మండలంలో రహదారుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు మంత్రి సీతక్క మంగళవారం రానున్నారని.. మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని జడ్పీటీసీ ప్రతాప్రెడ్డి, నాయకులు కట్టా అనంతరెడ్డి, తిప్పర్తి నర్సింహారెడ్డి ఓ ప్రకటనలో కోరారు. జిన్కుంట-మామిళ్లపల్లి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన, మామిళ్లపలి-ఉప్పరిపల్లి రహదారి ప్రారంభోత్సవం చేయనున్నారని చెప్పారు.
అచ్చంపేట, న్యూస్టుడే : రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క మంగళవారం అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారని ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ తెలిపారు. నియోజకవర్గంలోని అమ్రాబాద్, పదర, ఉప్పునుంతల, అచ్చంపేట మండలాల్లో పర్యటిస్తారన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు అచ్చంపేటలో నిర్వహించే మహిళా సంఘాల సమావేశంలో పాల్గొని చెక్కులు పంపిణీ చేయనున్నారని పేర్కొన్నారు. మంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు శ్రద్ధ తీసుకోవాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిల్లలు పుట్టలేదని వివాహిత ఆత్మహత్య
[ 05-07-2024]
మండలంలోని శిర్సనగండ్లకు చెందిన వివాహిత రాజశ్రీ(29) పిల్లలు పుట్టడంలేదని మనస్థాపంతో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. -
పర్యాటక శోభ ఒనగూరేనా..!
[ 05-07-2024]
పాలమూరులో పర్యాటక రంగం అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. గత ప్రభుత్వం ఉమ్మడి జిల్లాను ఎకో, రివర్, టెంపుల్ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించి కసరత్తు చేసింది. -
బడికి వెళ్లిన బాల వధువు
[ 05-07-2024]
బాలికను వివాహం చేసుకున్న యువకుడిపై పోక్సో కేసు నమోదైన ఘటన గండీడ్ మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై శేఖర్రెడ్డి కథనం ప్రకారం.. గండీడ్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు బీరప్ప ఆరో తరగతి చదివే అదే గ్రామానికి చెందిన బాలికను గత నెలలో వివాహం చేసుకున్నాడు. -
వెంటాడుతున్న డెంగీ భయం
[ 05-07-2024]
జిల్లాలోని అనేక ప్రాంతాల్లో డెంగీ కేసులు ప్రజలను భయపెడుతున్నాయి. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దోమలు ఎక్కువై విష జ్వరాలు వస్తున్నాయి. పారిశుద్ధ్యలోపం కారణంగా డెంగీ బారినపడుతున్నారు. -
అతివల వ్యాపారాలకు పెద్దపీట
[ 05-07-2024]
మహిళలు తాము సంపాదించిన దాంట్లో ఏళ్లుగా కొంత పొదుపు చేసుకుంటూ.. బ్యాంకుల ద్వారా రుణాలు పొందుతున్నారు. -
పాలమూరు అభివృద్ధికి కలిసి పనిచేస్తా
[ 05-07-2024]
కేంద ప్రభుత్వ సహకారం లేకుండా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కాంగ్రెస్ నేతలు ఏమీ చేయలేరని ఎంపీ డీకే అరుణ అన్నారు. -
గోదాములు దూరం.. రైతుకు భారం
[ 05-07-2024]
ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ పరంగా తగిన రేక్ పాయింట్లు (గూడ్స్ షెడ్లు) లేకపోవడంతో ఆర్థికపరంగా రైతులు అదనపు భారాన్ని మోయాల్సి వస్తోంది. -
ఐటీఐల్లో ప్రవేశానికి రెండో విడత నోటిఫికేషన్
[ 05-07-2024]
ఐటీఐ కోర్సుల్లో రెండో విడత ప్రవేశానికి ఉపాధి శిక్షణ శాఖ నోటిఫికేషన్ జారీ చేసినట్లు మహబూబ్నగర్ జిల్లా కన్వీనర్, మెట్టుగడ్డ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ బి.శాంతయ్య తెలిపారు. -
పట్టుదలతో చదివారు.. ఫలితంతో మెరిశారు
[ 05-07-2024]
నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం పాలెంలోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కళాశాల విద్యార్థులు ప్రతిభతో కళాశాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తున్నారు. -
ప్రాజెక్టుల పెండింగ్ పనులపై నివేదికలివ్వండి
[ 05-07-2024]
పాలమూరులోని సాగునీటి ప్రాజెక్టుల్లో పెండింగ్ పనులపై పూర్తిస్థాయి నివేదికలు ఇవ్వాలని మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. -
ఎస్సీ గురుకులాల్లో మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తులు
[ 05-07-2024]
ఎస్సీ గురుకుల విద్యాలయాల్లో మిగులు సీట్లను భర్తీ చేసేందుకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. -
అనుమతిలేని వ్యాపారం.. అన్నదాతకు నష్టం
[ 05-07-2024]
అన్నదాతల అమాయకత్వం, దిగుబడులపై ఆశ బయో కంపెనీలకు సిరులు కురిపిస్తుంటే... వాటిని రైతులకు అమ్ముతున్న డీలర్లకు లాభాలతో పాటు విహార యాత్రల్లో, విందులు.. చిందులు తొక్కిస్తున్నాయి. -
టిప్పర్ కింద పడి యువకుడి మృతి
[ 05-07-2024]
టిప్పర్ కింద పడి నర్సిరెడ్డి(30) అనే యువకుడు మృతి చెందిన సంఘటన నారాయణపేటలో చోటుచేసుకుంది. పద్మమ్మ, అనంత్రెడ్డిలకు ముగ్గురు ఆడపిల్లలు. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. -
ఎమ్మెల్యేను కాంగ్రెస్లో చేర్చుకోవద్దని నిరసనలు
[ 05-07-2024]
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి(భారాస)ని కాంగ్రెస్లో చేర్చుకోవద్దంటూ గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కాంగ్రెస్ శ్రేణులు ధర్నాలు నిర్వహించాయి.