భూమి సర్వే చేయాలని రైతు ఆత్మహత్యాయత్నం
భూమి కబ్జా చేసి ధరణిలో పేర్లు నమోదు చేసుకున్నారని, సర్వే చేసి హద్దులు చూపాలని కోరుతున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ రైతు పరశురాముడు కలెక్టరేట్లోని ప్రజావాణిలో సోమవారం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
ప్రజావాణి హాల్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న రైతు
గద్వాల కలెక్టరేట్, న్యూస్టుడే : భూమి కబ్జా చేసి ధరణిలో పేర్లు నమోదు చేసుకున్నారని, సర్వే చేసి హద్దులు చూపాలని కోరుతున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ రైతు పరశురాముడు కలెక్టరేట్లోని ప్రజావాణిలో సోమవారం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సకాలంలో పోలీసులు, సిబ్బంది అడ్డుకుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయిజ మండలం యాపదిన్నె శివారులోని గుడిదొడ్డి గ్రామానికి చెందిన బాధితుడి తండ్రి వడ్డె సవారన్నకు ఓ సర్వే నంబర్లో 1986లో ప్రభుత్వం ఐదెకరాల భూమి కేటాయించింది. బాధితుల కథనం మేరకు.. సవారన్న మృతి చెందగా వారసత్వంగా ముగ్గురు కుమారులు అయిన పరశురాముడు, తిమ్మప్ప, కృష్ణ పేరున ఖాతా మార్పు చేయాలని కొన్నేళ్లుగా అయిజ తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. జీవనోపాధి కోసం కడప ప్రాంతానికి వలస వెళ్లామని, తిరిగి గ్రామానికి చేరుకున్నామని చెప్పారు. వారసత్వంగా కుటుంబానికి సంక్రమించాల్సిన భూమిని రాజకీయ అండదండలున్న గ్రామానికి చెందిన ముగ్గురు రైతులు కబ్జా చేసి వారి పొలంలో కలిపేసుకున్నారని ఆరోపించారు. ఓ సారి సర్వే అధికారులు వచ్చినా బడా రాజకీయ నేత బెదిరించడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలిపారు. ఉచిత సలహాలు ఇస్తున్నారు తప్ప సర్వే చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లాపాపలతో సహా కలెక్టర్కు తమ గోడును విన్నవించుకోవడానికి ఇక్కడకు వచ్చామని, ఆవేశంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని బాధితుడి సోదరులు తిమ్మప్ప, కృష్ణ చెప్పారు. భూమి సర్వే చేసి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా అధికారుల సమక్షంలో ఈ ఘటన జరగడంతో ప్రజావాణి నిర్వహించే హాల్లో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది.
భూ సమస్య పరిష్కరించాలని మహిళ..
పెట్రోల్ ఒంటిపై పోసుకొనేందుకు యత్నిస్తున్న జయమ్మను వారిస్తున్న డీటీ పట్టాభి
లింగాల, న్యూస్టుడే: భూ సమస్య పరిష్కరించాలంటూ రెవెన్యూ కార్యాలయం ఎదుట గాలేటి జయమ్మ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సోమవారం లింగాలలో చోటు చేసుకొంది. అధికారులు న్యాయం చేయలంటూ పెట్రోల్ ఉన్న బాటిల్తో జయమ్మ ఆందోళన చేపట్టింది. విషయాన్ని గమనించిన ఉప తహసీల్దారు పట్టాభి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాధితురాలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. లింగాల శివారులోని ఓ సర్వే నంబరులో 1.37 ఎకరాలకు సంబంధించి సాగు చేస్తున్న భూమిని ఇతరులకు పట్టా చేయటంపై రెవెన్యూ, కలెక్టరు కార్యాలయాల్లో పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేదని వాపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిల్లలు పుట్టలేదని వివాహిత ఆత్మహత్య
[ 05-07-2024]
మండలంలోని శిర్సనగండ్లకు చెందిన వివాహిత రాజశ్రీ(29) పిల్లలు పుట్టడంలేదని మనస్థాపంతో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. -
పర్యాటక శోభ ఒనగూరేనా..!
[ 05-07-2024]
పాలమూరులో పర్యాటక రంగం అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. గత ప్రభుత్వం ఉమ్మడి జిల్లాను ఎకో, రివర్, టెంపుల్ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించి కసరత్తు చేసింది. -
బడికి వెళ్లిన బాల వధువు
[ 05-07-2024]
బాలికను వివాహం చేసుకున్న యువకుడిపై పోక్సో కేసు నమోదైన ఘటన గండీడ్ మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై శేఖర్రెడ్డి కథనం ప్రకారం.. గండీడ్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు బీరప్ప ఆరో తరగతి చదివే అదే గ్రామానికి చెందిన బాలికను గత నెలలో వివాహం చేసుకున్నాడు. -
వెంటాడుతున్న డెంగీ భయం
[ 05-07-2024]
జిల్లాలోని అనేక ప్రాంతాల్లో డెంగీ కేసులు ప్రజలను భయపెడుతున్నాయి. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దోమలు ఎక్కువై విష జ్వరాలు వస్తున్నాయి. పారిశుద్ధ్యలోపం కారణంగా డెంగీ బారినపడుతున్నారు. -
అతివల వ్యాపారాలకు పెద్దపీట
[ 05-07-2024]
మహిళలు తాము సంపాదించిన దాంట్లో ఏళ్లుగా కొంత పొదుపు చేసుకుంటూ.. బ్యాంకుల ద్వారా రుణాలు పొందుతున్నారు. -
పాలమూరు అభివృద్ధికి కలిసి పనిచేస్తా
[ 05-07-2024]
కేంద ప్రభుత్వ సహకారం లేకుండా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కాంగ్రెస్ నేతలు ఏమీ చేయలేరని ఎంపీ డీకే అరుణ అన్నారు. -
గోదాములు దూరం.. రైతుకు భారం
[ 05-07-2024]
ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ పరంగా తగిన రేక్ పాయింట్లు (గూడ్స్ షెడ్లు) లేకపోవడంతో ఆర్థికపరంగా రైతులు అదనపు భారాన్ని మోయాల్సి వస్తోంది. -
ఐటీఐల్లో ప్రవేశానికి రెండో విడత నోటిఫికేషన్
[ 05-07-2024]
ఐటీఐ కోర్సుల్లో రెండో విడత ప్రవేశానికి ఉపాధి శిక్షణ శాఖ నోటిఫికేషన్ జారీ చేసినట్లు మహబూబ్నగర్ జిల్లా కన్వీనర్, మెట్టుగడ్డ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ బి.శాంతయ్య తెలిపారు. -
పట్టుదలతో చదివారు.. ఫలితంతో మెరిశారు
[ 05-07-2024]
నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం పాలెంలోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కళాశాల విద్యార్థులు ప్రతిభతో కళాశాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తున్నారు. -
ప్రాజెక్టుల పెండింగ్ పనులపై నివేదికలివ్వండి
[ 05-07-2024]
పాలమూరులోని సాగునీటి ప్రాజెక్టుల్లో పెండింగ్ పనులపై పూర్తిస్థాయి నివేదికలు ఇవ్వాలని మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. -
ఎస్సీ గురుకులాల్లో మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తులు
[ 05-07-2024]
ఎస్సీ గురుకుల విద్యాలయాల్లో మిగులు సీట్లను భర్తీ చేసేందుకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. -
అనుమతిలేని వ్యాపారం.. అన్నదాతకు నష్టం
[ 05-07-2024]
అన్నదాతల అమాయకత్వం, దిగుబడులపై ఆశ బయో కంపెనీలకు సిరులు కురిపిస్తుంటే... వాటిని రైతులకు అమ్ముతున్న డీలర్లకు లాభాలతో పాటు విహార యాత్రల్లో, విందులు.. చిందులు తొక్కిస్తున్నాయి. -
టిప్పర్ కింద పడి యువకుడి మృతి
[ 05-07-2024]
టిప్పర్ కింద పడి నర్సిరెడ్డి(30) అనే యువకుడు మృతి చెందిన సంఘటన నారాయణపేటలో చోటుచేసుకుంది. పద్మమ్మ, అనంత్రెడ్డిలకు ముగ్గురు ఆడపిల్లలు. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. -
ఎమ్మెల్యేను కాంగ్రెస్లో చేర్చుకోవద్దని నిరసనలు
[ 05-07-2024]
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి(భారాస)ని కాంగ్రెస్లో చేర్చుకోవద్దంటూ గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కాంగ్రెస్ శ్రేణులు ధర్నాలు నిర్వహించాయి.
తాజా వార్తలు (Latest News)
-
అసలు కథ ముందుంది.. ‘కల్కి’ సీక్వెల్పై స్పందించిన నాగ్ అశ్విన్
-
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు భంగపాటు.. అధికారం దిశగా లేబర్ పార్టీ
-
ద్వారంపూడి వారి కాలుష్య పరిశ్రమ
-
వైకాపా విధేయుల్లో వణుకు.. అంటకాగిన అధికారులపై కూటమి ప్రభుత్వం ఆరా
-
అనుమతి లేకున్నా.. ఉన్నట్లు చూపి ప్లాట్ల విక్రయం
-
హైదరాబాద్ ఇళ్ల అమ్మకాల్లో 21% వృద్ధి