ఎఫ్సీఐకి బియ్యం అప్పగించటమెలా?
రాష్ట్ర ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరం (2023-24) ఖరీఫ్కు సంబంధించిన సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్)ను ఎఫ్సీఐకి కచ్చితంగా ఇవ్వాల్సిందేనని స్పష్టం చేయటంతో ఉమ్మడి జిల్లాలోని కొందరు మిల్లర్లకు ఆందోళన మొదలైంది.
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో మిల్లర్ల తర్జన భర్జన
ఇప్పటికే నల్లబజారుకు చాలా మిల్లుల ధాన్యం
వనపర్తి జిల్లాలోని ఓ మిల్లులో సీఎంఆర్ లేకపోవడంతో ఆరా తీస్తున్న టాస్క్ఫోర్స్ బృందం
ఈనాడు, మహబూబ్నగర్, వనపర్తి న్యూటౌన్, న్యూస్టుడే : రాష్ట్ర ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరం (2023-24) ఖరీఫ్కు సంబంధించిన సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్)ను ఎఫ్సీఐకి కచ్చితంగా ఇవ్వాల్సిందేనని స్పష్టం చేయటంతో ఉమ్మడి జిల్లాలోని కొందరు మిల్లర్లకు ఆందోళన మొదలైంది. సెప్టెంబరు 30 లోపు పూర్తి స్థాయిలో సీఎంఆర్ను అప్పగించాల్సి ఉండగా ఇప్పటికే పలువురు మిల్లర్లు సీఎంఆర్ను అక్రమంగా తమిళనాడు, కర్ణాటక, ఏపీకి తరలించి సొమ్ము చేసుకున్నారు. వారంతా ఎలాగైనా ఎఫ్సీఐకి ఇవ్వకుండా ఎలా ఎగ్గొట్టాలని రకరకాల మార్గాలు వెతుకుతున్నారు.
బెడిసికొట్టిన ప్రయత్నం..
గత ఖరీఫ్ సీఎంఆర్ చాలా మిల్లర్ల వద్ద ప్రస్తుతం లేదు. గతంలో మిల్లర్లు సీఎంఆర్ను నల్లబజారుకు తరలించినా ఇతర మార్గాల ద్వారా ఎఫ్సీఐకి కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి బియ్యం అప్పగించేవారు. రేషన్ దుకాణాలు, ప్రజల నుంచి పీడీఎస్ బియ్యాన్ని సేకరించి రీసైక్లింగ్ చేసి అందించేవారు. అప్పగించింది సీఎంఆరా.., పీడీఎస్ బియ్యమా అనేది తనిఖీ చేయకుండా కొందరు అధికారులు సహకరించేవారు. ఈసారి సీఎంఆర్ను ఎఫ్సీఐకే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పటంతో మిల్లర్లకు చుక్కెదురైంది. ఎఫ్సీఐకి సీఎంఆర్ అప్పగిస్తే నాణ్యతా ప్రమాణాల పరీక్షలు నిర్వహిస్తారు. పాత బియ్యమే రీసైక్లింగ్ చేసినట్లు తేలితే తిరస్కరిస్తారు. ఈ పరిస్థితుల్లో ఇటీవల వనపర్తి జిల్లాలో నాలుగు మిల్లుల సీఎంఆర్ను నిర్మాణంలో ఉన్న ఓ మిల్లుకు బదిలీచేయడం పెద్ద దుమారం రేపింది. దీనిపై ‘ఈనాడు’లో కథనం రావడంతో బదిలీ ఉత్తర్వులు ఆపేశారు. ఎఫ్సీఐకి ఇవ్వాల్సిన పరిస్థితిని తప్పించేందుకే మిల్లుల్లో ధాన్యం లేకపోయినా బదిలీ ఉత్తర్వులు ఇప్పించుకున్నారు. మిగతా మిల్లర్లు ఇదే చేయాలనుకున్నా బెడిసి కొట్టడంతో ఏం చేయాలో తేల్చుకోలేకపోతున్నారు.
అన్నిచోట్ల తనిఖీ చేస్తే..
మూడు రోజుల కిందట వనపర్తి జిల్లాలోని రెండు మిల్లుల్లో టాస్క్ఫోర్స్ బృందం, జిల్లా అధికారులు తనిఖీలు చేయగా రెండింటా అక్రమాలు వెలుగుచూశాయి. ఒక మిల్లులో 9,259 మెట్రిక్ టన్నులు, మరో మిల్లులో స్వల్పంగా ధాన్యం లేనట్లు గుర్తించారు. ఈ ధాన్యం విలువ రూ.30కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. భారీగా ధాన్యం లేని రైస్ మిల్లు యజమానిపై పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. అన్ని మిల్లుల్లో దాడులు చేస్తే పెద్ద ఎత్తున మోసాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వనపర్తి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లాల పౌర సరఫరాల శాఖ మేనేజర్లు ఇర్ఫాన్, ప్రవీణ్, బాలరాజులను ‘ఈనాడు’ సంప్రదించగా మిల్లుల్లో తనిఖీలు చేసి నిల్వ లేకపోతే చర్యలు తీసుకుంటామన్నారు.
జిల్లాల వారీగా పరిస్థితిదీ
ప్రభుత్వం గతేడాది ఖరీఫ్లో ఉమ్మడి జిల్లాలోని 321 మిల్లులకు 3,81,024 మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయించింది. గడువులోగా 2,55,376 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ఎఫ్సీఐకి అందించాలి. మిల్లర్లు ఇప్పటివరకు 73,587 మెట్రిక్ టన్నులు (28.81 శాతం) మాత్రమే అందించారు. మిగతా 1,81,789 మెట్రిక్ టన్నులు (71.18 శాతం) అప్పగించాల్సి ఉంది. అత్యధికంగా నాగర్కర్నూల్లో 83.79 శాతం, వనపర్తిలో 81.70, మహబూబ్నగర్లో 50.98, నారాయణపేటలో 39.23, జోగులాంబ గద్వాలలో 23.58 శాతం సీఎంఆర్ ఇవ్వాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డీసీసీబీలో ఆధిపత్య పోరు
[ 04-07-2024]
డీసీసీబీ అధికారులు, పాలకవర్గం మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. కొన్ని నిర్ణయాల్లో ఇరు వర్గాల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. -
నడిగడ్డ నీటికష్టం తీరేదెన్నడో!
[ 04-07-2024]
నడిగడ్డలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి నైరాశ్యంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఉన్న ప్రాజెక్టుల్లో జూరాల తప్ప మిగిలినవన్నీ కొనసాగుతున్న ప్రాజెక్టులుగానే ఉన్నాయి. -
వీసీ లేక.. సమస్యలు తీరక!
[ 04-07-2024]
పాలమూరు విశ్వవిద్యాలయం(పీయూ) పాలక మండలి గడువు ముగియడం, శాశ్వత ఉప కులపతి లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. -
అర్హులైనా అందని పథకాలు
[ 04-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి జీరో విద్యుత్తు బిల్లు, వంటగ్యాస్ రాయితీ తదితర పథకాలు అర్హులైనా కొందరికి అందటం లేదు. -
మిగులు ఖాళీలు.. తప్పని అవస్థలు
[ 04-07-2024]
ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేసింది. అర్హులైన ఎస్జీటీలకు వివిధ సబ్జెక్టుల్లో స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించారు. -
అనిశా వలలో తహసీల్దారు
[ 04-07-2024]
పొలాన్ని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు లంచం తీసుకున్న తహసీల్దార్ బుధవారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు (అనిశా) పట్టుబడ్డారు. -
బడిబాట ప్రవేశాలు నామమాత్రం
[ 04-07-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో నూతన విద్యార్థుల ప్రవేశాలు సంఖ్య పెంచడానికి, సర్కారు పాఠశాలల్లో అందిస్తున్న విద్యా విధానాన్ని తల్లిదండ్రులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర విద్యాశాఖ అధికారులు జూన్ 6వ తేదీ నుంచి 19 వరకు ఆచార్య జయశంకర్ బాడిబాట కార్యక్రమం నిర్వహించారు. -
ఇంతింతై.. పెసరింతై
[ 04-07-2024]
పెసర పంటకు నారాయణపేట జిల్లా పెట్టింది పేరు. రకరకాల కారణాలతో ఆ పంట ఏటా తగ్గుతూ వస్తోంది. ఇప్పుడిప్పుడే మళ్లీ సాగు పుంజుకుంటోంది. జిల్లాలోనే అత్యధికంగా రైతులు దామరగిద్దలో సాగు చేస్తారు. -
నిద్దరోతున్న నిఘా కళ్లు
[ 04-07-2024]
జిల్లాలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో భద్రత కోసం అమర్చిన నిఘా కెమెరాలు నిద్ర పోతున్నాయి. -
నీటి విడుదలలో స్పష్టత కరవు
[ 04-07-2024]
ప్రస్తుత వర్షాకాలం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. -
చిరుత సంచారంతో కలకలం !
[ 04-07-2024]
నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం ఎంగంపల్లి తండా సమీపంలోని పొలాల్లో చిరుత సంచారంపై భయాందోళన నెలకొంది. -
విజయమే లక్ష్యం.. స్వర్ణమే స్వప్నం
[ 04-07-2024]
వారు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 20 మంది యువతులు. పట్టుదలతో సాధన చేస్తూ అంచెలంచెలుగా అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణులుగా ఎదిగారు. నెట్బాల్లో దేశానికి ఆశా కిరణాలుగా మారారు. -
ఆవిష్కర్తలారా.. మీకోసం
[ 04-07-2024]
ప్రజా సమస్యలకు పరిష్కారం చూపుతూ.. సృజనాత్మకతతో కొత్త ఆవిష్కరణలను చేసే వారి నుంచి ‘ఇంటింటా ఇన్నోవేటర్’ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. -
పచ్చని కొండ.. మధురానుభూతి నిండా!
[ 04-07-2024]
పేదల తిరుపతిగా విరాజిల్లుతున్న మన్యంకొండ పుణ్యక్షేత్రం పచ్చని అందాలతో కనువిందు చేస్తోంది. ఇటీవల కురిసిన వానలకు కొండపై పచ్చదనం పరచుకుంది. -
ఏడు తరగతులు.. ఒకే టీచర్
[ 04-07-2024]
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రామకృష్ణాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో 1 నుంచి 7 తరగతి వరకు 100 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. -
ఉపాధ్యాయుడిపై రౌడీషీటర్ దాడి
[ 04-07-2024]
పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడిపై బుధవారం మధ్యాహ్నం రౌడీషీటర్ దాడి చేశాడు.
తాజా వార్తలు (Latest News)
-
సందేహం అక్కర్లేదు.. నేనే అధ్యక్ష అభ్యర్థిని: బైడెన్
-
వరల్డ్ కప్ మెడల్తో పంత్.. ట్రోల్ చేసిన అక్షర్, సిరాజ్
-
ఇంకా పరారీలోనే భోలే బాబా.. ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు
-
ఘనంగా వరలక్ష్మీ శరత్కుమార్ రిసెప్షన్.. తారల సందడి
-
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ
-
అన్లిమిటెడ్ క్లెయిం మొత్తంతో ఐసీఐసీఐ ఆరోగ్య బీమా పాలసీ!