వైకుంఠధామాలనూ వదలట్లేదు!
ప్రతి మనిషికి కూడు, గూడు, గుడ్డ ఎంత అవసరమో మరణించిన తరువాత ఖననం చేసేందుకు కొంత స్థలం అవసరం వస్తోంది. ఇది గమనించిన ప్రభుత్వం అన్ని గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
పంచదేవ్పహాడ్లో చదును చేయడానికి సిద్ధంగా శ్మశానవాటిక
న్యూస్టుడే-మక్తల్ గ్రామీణం: ప్రతి మనిషికి కూడు, గూడు, గుడ్డ ఎంత అవసరమో మరణించిన తరువాత ఖననం చేసేందుకు కొంత స్థలం అవసరం వస్తోంది. ఇది గమనించిన ప్రభుత్వం అన్ని గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అనేక గ్రామాల్లో శ్మశానవాటికలకు హద్దులు ఏర్పాటు చేస్తున్నా కబ్జాదారులు వాటిని తొలగించి అక్రమాలకు పాల్పడుతున్నారు. మూడేళ్ల క్రితం ప్రతి గ్రామంలో రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూములు గుర్తించి ఎకరం, రెండు, మూడు ఎకరాల వరకు ఎంత స్థలం ఉంటే అంత స్థలంలో హద్దులు ఏర్పాటు చేసి వైకుంఠధామాల నిర్మాణాలు చేపట్టారు. ఒక్కొక్క శ్మశానానికి రూ.12.60లక్షలు ఖర్చుచేసి నిర్మాణాలు చేపట్టారు. అందులో రెండు స్నానపుగదులు, విశ్రాంతి హాల్, పూజకట్ట, ముఖద్వారం, దహనం చేసేందుకు రెండు కట్టలు నిర్మించడంతోపాటు విద్యుత్తు, నీటి సౌకర్యం కల్పించారు. కొన్ని ప్రదేశాల్లో రక్షణగోడ నిర్మాణాలు చేపట్టగా, అనేక గ్రామాల్లో నిర్మించలేదు. దీంతో కబ్జాదారులు దర్జాగా చదునుచేసి పంటలు సాగు చేసుకుంటున్నారు.
- కోస్గి పట్టణంలోని చెన్నారం రహదారిలో శ్మశాన వాటిక స్థలం అర ఎకరాకు పైగా కబ్జాకు గురైంది. ఇక్కడ ఖననం చేసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
- మక్తల్ మండలం కర్నిలో ఎకరం 30 గుంటలు శ్మశాన వాటికకు కేటాయించారు. అందులో పది గుంటలకుపైగా కబ్జాకు గురైనట్లు గ్రామస్థులు అంటున్నారు. పంచదేవ్పహాడ్లో మూడు ఎకరాల పది గుంటల స్థలాన్ని కేటాయించారు. అందులో శ్మశాన వాటికకు రెండు ఎకరాలు, పల్లె ప్రకృతి వనానికి ఎకరం, నర్సరీకి పది గుంటల భూమిని కేటాయించారు. ప్రస్తుతం ఇక్కడ ఎకరానికి పైగా కబ్జాకు గురైంది. ఈ స్థలంలో గత ఏడాది హరితహారంలో భాగంగా 800 మొక్కలు నాటారు. రాత్రి వేళలో బడా నాయకుడు మొక్కలు తొలగించి కబ్జా చేసుకున్నారు. గుడిగండ్లలో శ్మశాన వాటికకు రెండు ఎకరాల భూమిని కేటాయించారు. అందులో ఎకరాకుపైగా స్థలం ఆక్రమణకు గురైంది. ఓ రైతు పంట సాగు చేస్తున్నాడు. జక్లేర్లో ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోవడంతో చెరువులో శ్మశాన వాటిక నిర్మించారు. చెరువు నిండితే శ్మశానవాటిక నీటిలో మునిగి ఉంటుంది.
- నారాయణపేటలోని యాదవనగర్ రహదారిలో ఎస్సీవాడ శ్మశానవాటికకు రెండు ఎకరాలు కేటాయించారు. కొందరు రియల్ వ్యాపారులు స్థలాన్ని కబ్జా చేస్తున్నారు. స్థానిక అధికారులు, నాయకుల అండతో కబ్జా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ కూడా అర ఎకరం కబ్జాకు గురైంది. వీటితోపాటు అనేక గ్రామాల్లో శ్మశాన వాటిక స్థలాలు కబ్జా చేస్తున్నారు. అధికారులు చొరవ తీసుకొని కబ్జాలకు గురైన స్థలాలను స్వాధీనం చేసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
కఠిన చర్యలు తప్పవు..
- అశోక్కుమార్, జిల్లా అదనపు కలెక్టరు(రెవెన్యూ), నారాయణపేట
వైకుంఠధామాల స్థలాలను సర్వే చేయిస్తాం. ఆక్రమణలు తొలగిస్తాం. అప్పటికీ ఆక్రమణదారులు స్థలాలను వదలకుంటే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. ఏ ఉద్దేశంతో వైకుంఠధామాలు ఏర్పాటు చేశారో ఆ లక్ష్యానికి విఘాతం కలగనివ్వం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డీసీసీబీలో ఆధిపత్య పోరు
[ 04-07-2024]
డీసీసీబీ అధికారులు, పాలకవర్గం మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. కొన్ని నిర్ణయాల్లో ఇరు వర్గాల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. -
నడిగడ్డ నీటికష్టం తీరేదెన్నడో!
[ 04-07-2024]
నడిగడ్డలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి నైరాశ్యంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఉన్న ప్రాజెక్టుల్లో జూరాల తప్ప మిగిలినవన్నీ కొనసాగుతున్న ప్రాజెక్టులుగానే ఉన్నాయి. -
వీసీ లేక.. సమస్యలు తీరక!
[ 04-07-2024]
పాలమూరు విశ్వవిద్యాలయం(పీయూ) పాలక మండలి గడువు ముగియడం, శాశ్వత ఉప కులపతి లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. -
అర్హులైనా అందని పథకాలు
[ 04-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి జీరో విద్యుత్తు బిల్లు, వంటగ్యాస్ రాయితీ తదితర పథకాలు అర్హులైనా కొందరికి అందటం లేదు. -
మిగులు ఖాళీలు.. తప్పని అవస్థలు
[ 04-07-2024]
ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేసింది. అర్హులైన ఎస్జీటీలకు వివిధ సబ్జెక్టుల్లో స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించారు. -
అనిశా వలలో తహసీల్దారు
[ 04-07-2024]
పొలాన్ని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు లంచం తీసుకున్న తహసీల్దార్ బుధవారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు (అనిశా) పట్టుబడ్డారు. -
బడిబాట ప్రవేశాలు నామమాత్రం
[ 04-07-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో నూతన విద్యార్థుల ప్రవేశాలు సంఖ్య పెంచడానికి, సర్కారు పాఠశాలల్లో అందిస్తున్న విద్యా విధానాన్ని తల్లిదండ్రులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర విద్యాశాఖ అధికారులు జూన్ 6వ తేదీ నుంచి 19 వరకు ఆచార్య జయశంకర్ బాడిబాట కార్యక్రమం నిర్వహించారు. -
ఇంతింతై.. పెసరింతై
[ 04-07-2024]
పెసర పంటకు నారాయణపేట జిల్లా పెట్టింది పేరు. రకరకాల కారణాలతో ఆ పంట ఏటా తగ్గుతూ వస్తోంది. ఇప్పుడిప్పుడే మళ్లీ సాగు పుంజుకుంటోంది. జిల్లాలోనే అత్యధికంగా రైతులు దామరగిద్దలో సాగు చేస్తారు. -
నిద్దరోతున్న నిఘా కళ్లు
[ 04-07-2024]
జిల్లాలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో భద్రత కోసం అమర్చిన నిఘా కెమెరాలు నిద్ర పోతున్నాయి. -
నీటి విడుదలలో స్పష్టత కరవు
[ 04-07-2024]
ప్రస్తుత వర్షాకాలం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. -
చిరుత సంచారంతో కలకలం !
[ 04-07-2024]
నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం ఎంగంపల్లి తండా సమీపంలోని పొలాల్లో చిరుత సంచారంపై భయాందోళన నెలకొంది. -
విజయమే లక్ష్యం.. స్వర్ణమే స్వప్నం
[ 04-07-2024]
వారు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 20 మంది యువతులు. పట్టుదలతో సాధన చేస్తూ అంచెలంచెలుగా అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణులుగా ఎదిగారు. నెట్బాల్లో దేశానికి ఆశా కిరణాలుగా మారారు. -
ఆవిష్కర్తలారా.. మీకోసం
[ 04-07-2024]
ప్రజా సమస్యలకు పరిష్కారం చూపుతూ.. సృజనాత్మకతతో కొత్త ఆవిష్కరణలను చేసే వారి నుంచి ‘ఇంటింటా ఇన్నోవేటర్’ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. -
పచ్చని కొండ.. మధురానుభూతి నిండా!
[ 04-07-2024]
పేదల తిరుపతిగా విరాజిల్లుతున్న మన్యంకొండ పుణ్యక్షేత్రం పచ్చని అందాలతో కనువిందు చేస్తోంది. ఇటీవల కురిసిన వానలకు కొండపై పచ్చదనం పరచుకుంది. -
ఏడు తరగతులు.. ఒకే టీచర్
[ 04-07-2024]
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రామకృష్ణాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో 1 నుంచి 7 తరగతి వరకు 100 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. -
ఉపాధ్యాయుడిపై రౌడీషీటర్ దాడి
[ 04-07-2024]
పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడిపై బుధవారం మధ్యాహ్నం రౌడీషీటర్ దాడి చేశాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పుష్పక్ ఏసీ జనరల్ బస్పాస్ రూ.5 వేలు
-
రాజధాని అమరావతి స్థితిగతులివీ..
-
నిమ్మకాయ నీళ్లకు రూ.28 లక్షలు.. నవ్విపోదురు గాక ‘నా’కేటి సిగ్గ‘ని’
-
కాంగ్రెస్లోకి భారాస గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి?
-
పిల్లర్లే నల్లబల్లలు.. నాడు-నేడు పనులు పూర్తికాక ఇక్కట్లు
-
మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వాయిదా