కొత్త చట్టాలతో సత్వర న్యాయం
బ్రిటీష్ కాలం నాటి చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాలు జులై 1 నుంచి అమలులోకి రానున్నాయి. వీటితో బాధితులు సత్వర న్యాయం పొందే వీలుందని, దోషులకు విధించే శిక్షలతో పాటు జరిమానాలు
అమలుకు సిద్ధమైన ఉమ్మడి జిల్లా పోలీసు యంత్రాంగం
పాలమూరులో పోలీసులకు కొత్త చట్టాలపై శిక్షణ ఇస్తున్న అధికారులు
న్యూస్టుడే, మహబూబ్నగర్ నేరవిభాగం : బ్రిటీష్ కాలం నాటి చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాలు జులై 1 నుంచి అమలులోకి రానున్నాయి. వీటితో బాధితులు సత్వర న్యాయం పొందే వీలుందని, దోషులకు విధించే శిక్షలతో పాటు జరిమానాలు గణనీయంగా పెరిగాయని న్యాయ నిపుణులు, పోలీసు అధికారులు చెబుతున్నారు. నూతన చట్టాల అమలుకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పోలీసు యంత్రాం గం సిద్ధమైంది. నెల రోజులుగా 14 బ్యాచ్లుగా డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లకు శిక్షణ ఇచ్చారు. కొత్త చట్టాల ప్రకారమే కేసులు నమోదు చేయటంతో పాటు తీర్పులు వెలువడనున్నాయి. ఈ సందర్భంగా పోలీసు అధికారులను ‘న్యూస్టుడే’ సంప్రదించగా ఆసక్తికర విషయాలు తెలిపారు.
మార్పు ఇలా..
- చిన్న నేరాలకు జరిమానాలు బాగా పెరగనున్నాయి. ప్రస్తుతం చిన్న ప్రమాదానికి బాధ్యులైన వారికి రూ.500 జరిమానా ఉండేది. ఇప్పుడు రూ.5వేలకు పెరిగింది. ఘర్షణ కేసుల్లో చేతులతో కొడితే రూ.1,000 జరిమానా విధించేవారు. రూ.10వేలకు పెంచారు. కర్రలతో దాడిచేస్తే రూ.1,000 ఉన్న జరిమానా రూ.20వేలకు పెరిగింది. జైలు శిక్ష కూడా పడుతుంది.
- ఏడేళ్ల లోపు శిక్షలు పడే కేసుల్లో ఏవైనా సందేహాలు ఉంటే డీఎస్పీ అనుమతితో మళ్లీ దర్యాప్తు చేయొచ్చు. కేసును 14 రోజుల లోపల విచారణ పూర్తి చేయాల్సి ఉంటుంది. నేరానికి సంబంధించిన ఆధారాలు లభ్యమైతే కేసును బలంగా నమోదు చేయొచ్చు. ఆధారాలు లభ్యం కాకపోతే ఆ కేసును మూసివేయొచ్చు.
- జీరో ఎఫ్ఐఆర్ సౌకర్యం అందుబాటులోకి రానుంది. దేశంలోని ఎక్కడ ఎలాంటి ప్రమాదాలు, హత్యలు, అత్యాచారాలు, గ్యాంగ్రేప్లు, ఏ నేరం జరిగినా బాధితులు సమీపంలోని పోలీస్ స్టేషన్ను సంప్రదించి ఫిర్యాదు చేయొచ్చు. ఆ పోలీస్ స్టేషన్ సిబ్బంది బాధితులకు రక్షణ కల్పించి అండగా నిలుస్తారు. దర్యాప్తు చేసి స్టేట్మెంట్లను రికార్డు చేసి బాధితులు నివసించే ప్రాంతంలోని పోలీస్ స్టేషన్కు అంతర్జాలం ద్వారా కేసు బదిలీ చేస్తారు.
- 33 కేసుల్లో శిక్షలు పెరిగాయి. గరిష్ఠంగా పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి. 83 నేరాల్లో రూ.10వేల నుంచి రూ.2లక్షల వరకు జరిమానాలు విధించే అవకాశాలు ఉన్నాయి. బాధితులు వైద్యచికిత్స చేయించడానికి అయ్యే ఖర్చు దోషి నుంచే రాబట్టాలని కొత్త చట్టం చెబుతోంది.
- రహదారులపై వాహనాలను గుర్తు తెలియని వాహనదారులు ఢీకొట్టి వెళ్తుంటారు. అలా వెళ్లిన వారికి ఇక నుంచి పదేళ్ల జైలు శిక్ష పడనుంది. ప్రమాదం జరిగినప్పుడు వాహనదారులు సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ను సంప్రదించి ప్రమాదం వివరాలను చెప్పిన వారికి, ఘటనా స్థలంలో ఉండి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన వారికి వేసే శిక్ష తీవ్రత తగ్గుతుంది. అలాంటి వారికి స్టేషన్ బెయిల్ వచ్చే అవకాశాలు ఉంటాయి.
- ప్రస్తుతం కలెక్టర్లకు జిల్లా, ఆర్డీవో డివిజన్, తహసీల్దార్లకు మండల మేజిస్ట్రేట్గా అధికారాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం జిల్లా ఎస్పీలకు స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్గా అధికారాలు రానున్నాయి. దీనివల్ల కొన్ని కేసుల్లో నేరుగా ఉత్తర్వులు జారీ చేసే అధికారం ఎస్పీకి రానుంది.
- రూ.5వేల లోపు దొంగతనాలు చేసిన వారికి, చిన్న చిన్న నేరాలు చేసిన వారికి, ప్రభుత్వ ఆధికారులతో వాగ్వాదానికి దిగి విధులకు ఆటంకం కల్పించిన వారికి రహదారులు, పురపాలికలు, అనాథ శరణాలయాల్లో సామాజిక సేవలు అందించేలా తీర్పు ఇవ్వనున్నారు.
సదస్సులు నిర్వహిస్తాం.. : జులై 1 నుంచి కొత్త చట్టాల ప్రకారమే పోలీసులు పౌరులకు సేవలు అందించాల్సి ఉంటుంది. కొత్త చట్టాలపై పోలీసు సిబ్బందికి శిక్షణ ఇస్తున్నాం. విద్యార్థులు, యువకులు, మహిళలు ఇలా అన్ని వర్గాల వారికి అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా సదస్సులు ఏర్పాటు చేస్తాం.
పి.వెంకటేశ్వర్లు, మహబూబ్నగర్ డీఎస్పీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డీసీసీబీలో ఆధిపత్య పోరు
[ 04-07-2024]
డీసీసీబీ అధికారులు, పాలకవర్గం మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. కొన్ని నిర్ణయాల్లో ఇరు వర్గాల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. -
నడిగడ్డ నీటికష్టం తీరేదెన్నడో!
[ 04-07-2024]
నడిగడ్డలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి నైరాశ్యంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఉన్న ప్రాజెక్టుల్లో జూరాల తప్ప మిగిలినవన్నీ కొనసాగుతున్న ప్రాజెక్టులుగానే ఉన్నాయి. -
వీసీ లేక.. సమస్యలు తీరక!
[ 04-07-2024]
పాలమూరు విశ్వవిద్యాలయం(పీయూ) పాలక మండలి గడువు ముగియడం, శాశ్వత ఉప కులపతి లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. -
అర్హులైనా అందని పథకాలు
[ 04-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి జీరో విద్యుత్తు బిల్లు, వంటగ్యాస్ రాయితీ తదితర పథకాలు అర్హులైనా కొందరికి అందటం లేదు. -
మిగులు ఖాళీలు.. తప్పని అవస్థలు
[ 04-07-2024]
ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేసింది. అర్హులైన ఎస్జీటీలకు వివిధ సబ్జెక్టుల్లో స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించారు. -
అనిశా వలలో తహసీల్దారు
[ 04-07-2024]
పొలాన్ని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు లంచం తీసుకున్న తహసీల్దార్ బుధవారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు (అనిశా) పట్టుబడ్డారు. -
బడిబాట ప్రవేశాలు నామమాత్రం
[ 04-07-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో నూతన విద్యార్థుల ప్రవేశాలు సంఖ్య పెంచడానికి, సర్కారు పాఠశాలల్లో అందిస్తున్న విద్యా విధానాన్ని తల్లిదండ్రులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర విద్యాశాఖ అధికారులు జూన్ 6వ తేదీ నుంచి 19 వరకు ఆచార్య జయశంకర్ బాడిబాట కార్యక్రమం నిర్వహించారు. -
ఇంతింతై.. పెసరింతై
[ 04-07-2024]
పెసర పంటకు నారాయణపేట జిల్లా పెట్టింది పేరు. రకరకాల కారణాలతో ఆ పంట ఏటా తగ్గుతూ వస్తోంది. ఇప్పుడిప్పుడే మళ్లీ సాగు పుంజుకుంటోంది. జిల్లాలోనే అత్యధికంగా రైతులు దామరగిద్దలో సాగు చేస్తారు. -
నిద్దరోతున్న నిఘా కళ్లు
[ 04-07-2024]
జిల్లాలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో భద్రత కోసం అమర్చిన నిఘా కెమెరాలు నిద్ర పోతున్నాయి. -
నీటి విడుదలలో స్పష్టత కరవు
[ 04-07-2024]
ప్రస్తుత వర్షాకాలం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. -
చిరుత సంచారంతో కలకలం !
[ 04-07-2024]
నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం ఎంగంపల్లి తండా సమీపంలోని పొలాల్లో చిరుత సంచారంపై భయాందోళన నెలకొంది. -
విజయమే లక్ష్యం.. స్వర్ణమే స్వప్నం
[ 04-07-2024]
వారు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 20 మంది యువతులు. పట్టుదలతో సాధన చేస్తూ అంచెలంచెలుగా అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణులుగా ఎదిగారు. నెట్బాల్లో దేశానికి ఆశా కిరణాలుగా మారారు. -
ఆవిష్కర్తలారా.. మీకోసం
[ 04-07-2024]
ప్రజా సమస్యలకు పరిష్కారం చూపుతూ.. సృజనాత్మకతతో కొత్త ఆవిష్కరణలను చేసే వారి నుంచి ‘ఇంటింటా ఇన్నోవేటర్’ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. -
పచ్చని కొండ.. మధురానుభూతి నిండా!
[ 04-07-2024]
పేదల తిరుపతిగా విరాజిల్లుతున్న మన్యంకొండ పుణ్యక్షేత్రం పచ్చని అందాలతో కనువిందు చేస్తోంది. ఇటీవల కురిసిన వానలకు కొండపై పచ్చదనం పరచుకుంది. -
ఏడు తరగతులు.. ఒకే టీచర్
[ 04-07-2024]
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రామకృష్ణాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో 1 నుంచి 7 తరగతి వరకు 100 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. -
ఉపాధ్యాయుడిపై రౌడీషీటర్ దాడి
[ 04-07-2024]
పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడిపై బుధవారం మధ్యాహ్నం రౌడీషీటర్ దాడి చేశాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కరకట్టపై దస్త్రాల దహనం.. విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశం
-
సందేహం అక్కర్లేదు.. నేనే అధ్యక్ష అభ్యర్థిని: బైడెన్
-
వరల్డ్ కప్ మెడల్తో పంత్.. ట్రోల్ చేసిన అక్షర్, సిరాజ్
-
ఇంకా పరారీలోనే భోలే బాబా.. ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు
-
ఘనంగా వరలక్ష్మీ శరత్కుమార్ రిసెప్షన్.. తారల సందడి
-
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ