ఎస్జీటీల బదిలీ ఉత్తర్వులకు ఏర్పాట్లు
ఉమ్మడి పాలమూరు జిల్లాలో సుమారు నాలుగు వేలకుపైగా ఎస్జీటీలు బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎస్జీటీల బదిలీ ఉత్తర్వులు సోమవారం ఉదయం ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
నేడు కొత్త స్థానాల్లో చేరేలా ఆదేశాలు
సముదాయ పాఠశాల సమావేశంలో పాల్గొన్న ఎస్జీటీ ఉపాధ్యాయులు (పాత)
అచ్చంపేట, న్యూస్టుడే : ఉమ్మడి పాలమూరు జిల్లాలో సుమారు నాలుగు వేలకుపైగా ఎస్జీటీలు బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎస్జీటీల బదిలీ ఉత్తర్వులు సోమవారం ఉదయం ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. శనివారం రాత్రి 11 గంటల నుంచి ఆదివారం రాత్రి 10 గంటల వరకు బదిలీ కోసం వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇవ్వడంతో ఉపాధ్యాయులు ఆ పనిలో నిమగ్నమయ్యారు. ఇంట్లో ల్యాప్టాప్లు, కంప్యూటర్లు ఉన్న ఉపాధ్యాయులు అర్ధరాత్రి నుంచే వెబ్ ఆప్షన్లు పెట్టుకున్నారు. కంప్యూటర్లు లేని వారు ఆప్షన్లను కాగితాలపై రాసుకొని ఇంటర్నెట్ కేంద్రాలకు పరుగెత్తి ప్రాధాన్యతా క్రమంలో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవడానికి తంటాలు పడ్డారు. ఒక్కొక్కరు వెబ్ ఆప్షన్లు ఇవ్వడానికి 30-45 నిమిషాలు పట్టింది. రాత్రి సమయంలో కూడా ఇంటర్నెట్ కేంద్రాల వారిని అందుబాటులో ఉంచుకొని ఆప్షన్లు పెట్టుకుంటున్నారు. సమయం తక్కువగా ఇచ్చారని ఎస్జీటీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్ఏల బదిలీలు, పదోన్నతుల సమయంలో తక్కువ మంది ఉపాధ్యాయులు ఉండటంతో ఆప్షన్లు పెట్టుకోవడానికి ఇబ్బంది ఎదురు కాలేదు.
ఇప్పటికే 3,929 మందికి స్థాన చలనం : ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 1,725 మంది ఎస్ఏలకు బదిలీ అయ్యారు. మరో 1,975 మంది ఎస్జీటీలు ఎస్ఏలుగా, 229 మంది ఎస్ఏలు జీహెచ్ఎంలుగా పదోన్నతి పొందారు. వివిధ విభాగాల్లో కలిపి ఉమ్మడి జిల్లాలో 3,929 మంది ఉపాధ్యాయులు కొత్త పాఠశాలల్లో విధుల్లో చేరారు. ప్రస్తుతం ఎస్జీటీల బదిలీలతో మరో రెండు వేల మందికి స్థాన చలనం కలగనుంది. ఒకే పాఠశాలలో 8 ఏళ్ల పాటు పనిచేసిన ఎస్జీటీలు విధిగా మరో పాఠశాలకు బదిలీ కానున్నారు. 8 ఏళ్లలోపు వారు కోరుకుంటే తప్ప వారికి బదిలీ ఉండదు. ఆప్షన్లలో వారికి ఆసక్తి ఉన్న కొన్ని పాఠశాలలను నమోదు చేసి తరువాత ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాల పేరు చివరన పెడతారు. మరో అనుకూలమైన స్థానం లభిస్తే బదిలీ అవుతారు లేకపోతే ప్రస్తుత పాఠశాలలనే కొనసాగుతారు.
వెంటనే చేరేలా ఆదేశాలు : బదిలీకి అర్హులైన ఉపాధ్యాయులు ఆదివారం రాత్రి 10 గంటల వరకు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వగా రాత్రి 11.59 గంటల వరకు ఎడిట్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. అర్ధరాత్రి సమయంలో ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం పట్ల ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బదిలీల్లో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు, తెలుగు, ఉర్దూ, హిందీ, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రాఫ్ట్, సంగీతం తదితర విభాగాలకు చెందిన ఎస్జీటీ స్థాయి వారిని బదిలీ చేయనున్నారు. బదిలీ ఉత్తర్వులు పొందిన ఉపాధ్యాయులు ఆదివారం మధ్యాహ్నం పాత స్థానాల నుంచి విడుదలై సోమవారం ఉదయం కొత్త స్థానాల్లో చేరేలా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డీసీసీబీలో ఆధిపత్య పోరు
[ 04-07-2024]
డీసీసీబీ అధికారులు, పాలకవర్గం మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. కొన్ని నిర్ణయాల్లో ఇరు వర్గాల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. -
నడిగడ్డ నీటికష్టం తీరేదెన్నడో!
[ 04-07-2024]
నడిగడ్డలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి నైరాశ్యంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఉన్న ప్రాజెక్టుల్లో జూరాల తప్ప మిగిలినవన్నీ కొనసాగుతున్న ప్రాజెక్టులుగానే ఉన్నాయి. -
వీసీ లేక.. సమస్యలు తీరక!
[ 04-07-2024]
పాలమూరు విశ్వవిద్యాలయం(పీయూ) పాలక మండలి గడువు ముగియడం, శాశ్వత ఉప కులపతి లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. -
అర్హులైనా అందని పథకాలు
[ 04-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి జీరో విద్యుత్తు బిల్లు, వంటగ్యాస్ రాయితీ తదితర పథకాలు అర్హులైనా కొందరికి అందటం లేదు. -
మిగులు ఖాళీలు.. తప్పని అవస్థలు
[ 04-07-2024]
ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేసింది. అర్హులైన ఎస్జీటీలకు వివిధ సబ్జెక్టుల్లో స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించారు. -
అనిశా వలలో తహసీల్దారు
[ 04-07-2024]
పొలాన్ని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు లంచం తీసుకున్న తహసీల్దార్ బుధవారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు (అనిశా) పట్టుబడ్డారు. -
బడిబాట ప్రవేశాలు నామమాత్రం
[ 04-07-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో నూతన విద్యార్థుల ప్రవేశాలు సంఖ్య పెంచడానికి, సర్కారు పాఠశాలల్లో అందిస్తున్న విద్యా విధానాన్ని తల్లిదండ్రులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర విద్యాశాఖ అధికారులు జూన్ 6వ తేదీ నుంచి 19 వరకు ఆచార్య జయశంకర్ బాడిబాట కార్యక్రమం నిర్వహించారు. -
ఇంతింతై.. పెసరింతై
[ 04-07-2024]
పెసర పంటకు నారాయణపేట జిల్లా పెట్టింది పేరు. రకరకాల కారణాలతో ఆ పంట ఏటా తగ్గుతూ వస్తోంది. ఇప్పుడిప్పుడే మళ్లీ సాగు పుంజుకుంటోంది. జిల్లాలోనే అత్యధికంగా రైతులు దామరగిద్దలో సాగు చేస్తారు. -
నిద్దరోతున్న నిఘా కళ్లు
[ 04-07-2024]
జిల్లాలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో భద్రత కోసం అమర్చిన నిఘా కెమెరాలు నిద్ర పోతున్నాయి. -
నీటి విడుదలలో స్పష్టత కరవు
[ 04-07-2024]
ప్రస్తుత వర్షాకాలం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. -
చిరుత సంచారంతో కలకలం !
[ 04-07-2024]
నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం ఎంగంపల్లి తండా సమీపంలోని పొలాల్లో చిరుత సంచారంపై భయాందోళన నెలకొంది. -
విజయమే లక్ష్యం.. స్వర్ణమే స్వప్నం
[ 04-07-2024]
వారు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 20 మంది యువతులు. పట్టుదలతో సాధన చేస్తూ అంచెలంచెలుగా అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణులుగా ఎదిగారు. నెట్బాల్లో దేశానికి ఆశా కిరణాలుగా మారారు. -
ఆవిష్కర్తలారా.. మీకోసం
[ 04-07-2024]
ప్రజా సమస్యలకు పరిష్కారం చూపుతూ.. సృజనాత్మకతతో కొత్త ఆవిష్కరణలను చేసే వారి నుంచి ‘ఇంటింటా ఇన్నోవేటర్’ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. -
పచ్చని కొండ.. మధురానుభూతి నిండా!
[ 04-07-2024]
పేదల తిరుపతిగా విరాజిల్లుతున్న మన్యంకొండ పుణ్యక్షేత్రం పచ్చని అందాలతో కనువిందు చేస్తోంది. ఇటీవల కురిసిన వానలకు కొండపై పచ్చదనం పరచుకుంది. -
ఏడు తరగతులు.. ఒకే టీచర్
[ 04-07-2024]
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రామకృష్ణాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో 1 నుంచి 7 తరగతి వరకు 100 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. -
ఉపాధ్యాయుడిపై రౌడీషీటర్ దాడి
[ 04-07-2024]
పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడిపై బుధవారం మధ్యాహ్నం రౌడీషీటర్ దాడి చేశాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కరకట్టపై దస్త్రాల దహనం.. విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశం
-
సందేహం అక్కర్లేదు.. నేనే అధ్యక్ష అభ్యర్థిని: బైడెన్
-
వరల్డ్ కప్ మెడల్తో పంత్.. ట్రోల్ చేసిన అక్షర్, సిరాజ్
-
ఇంకా పరారీలోనే భోలే బాబా.. ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు
-
ఘనంగా వరలక్ష్మీ శరత్కుమార్ రిసెప్షన్.. తారల సందడి
-
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ