ప్రైవేటులో అనుచితం
నిరుపేద విద్యార్థి నర్సింహ చదువులో రాణిస్తున్నాడు. వాడిని మంచి కార్పొరేట్ పాఠశాలలో చదివిస్తే ఇంకా రాణిస్తాడని తండ్రి ఆశ. ప్రైవేటు పాఠాశాలలో చేర్పించటానికి వెళ్లాడు.
నిరుపేదలకు దక్కని 25 శాతం ఉచిత సీట్లు
నిరుపేద విద్యార్థి నర్సింహ చదువులో రాణిస్తున్నాడు. వాడిని మంచి కార్పొరేట్ పాఠశాలలో చదివిస్తే ఇంకా రాణిస్తాడని తండ్రి ఆశ. ప్రైవేటు పాఠాశాలలో చేర్పించటానికి వెళ్లాడు. ప్రవేశ పరీక్ష పెట్టిన పాఠశాల యాజమాన్యం చదువులో మీ అబ్బాయి మంచిగా రాణిస్తున్నాడు మా పాఠశాలలో చేర్పించండన్నారు. సార్ ప్రభుత్వం 25 శాతం సీట్లు నిరుపేదలకు కేటాయించాలని నిబంధన ఉంది కదా దాని ప్రకారం మా వాడిని చేర్చుకోండి అన్నాడు తండ్రి. అప్పటి వరకు చదువులో రాణిస్తున్నాడని అన్న యాజమాన్యం వెంటనే మాట మార్చి మా దగ్గర ఇప్పటికే పరిమితికి మించి ఆ తరగతిలో విద్యార్థులను చేర్చుకున్నాం, ఇక చేర్చుకోలేమంటూ చెప్పి వారిని వెనక్కు పంపించేశారు.
ధరూరు, న్యూస్టుడే: విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలలో ఉన్న విద్యార్థుల సంఖ్యలో 25 శాతం సీట్లు నిరుపేదలకు, దివ్వాంగులకు కేటాయించి ఉచిత విద్యను అందించాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ వాటి అమలు మాత్రం ఎక్కడా కనిపించటం లేదు. నిరుపేద విద్యార్థులతో కూడా నిర్ణీత ఫీజులు వసూలు చేస్తున్నారు. అది కూడా నాన్ రెసిడెన్సియల్ అయితే రూ.వేలల్లో రెసిడెన్సియల్ అయితే రూ.లక్షల్లోనే వసూలు చేస్తున్నారు. ఫీజుల నియంత్రణ అన్నది ప్రభుత్వ పరిధిలో లేకపోవటం. పర్యవేక్షణ చేయాల్సిన ప్రభుత్వ అధికారులే ప్రైవేటుకే వత్తాసు పలకటం. వెరసి పరిస్థితి ఇలా తయారైందని విద్యార్థుల తల్లిదండ్రులంటున్నారు.
ఉచితం ఇవ్వాల్సిందిలా..: ఇక 2009 విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలలో ఉన్న విద్యార్థుల సంఖ్యలో 25 శాతం సీట్లు ఉచితంగా నిరుపేదలకు ఇవ్వాల్సి వస్తే అందులో ఎస్సీలకు 10 శాతం ఎస్టీలకు 4 శాతం, బీసీలకు 4 శాతం నిరుపేదలు దివ్యాంగులకు కలిపి మిగిలినవి కేటాయించాలి. ఉమ్మడి జిల్లాలో 850 వరకు ప్రైవేటు పాఠశాలలున్నాయి. వాటి పరిధిలో 2.37 లక్షల మంది విద్యార్థులు చదువులు ఫీజులు చెల్లించి చదువుతున్నారు. ఒక్కో పాఠశాలలో కనిష్ఠంగా 200 నుంచి గరిష్ఠంగా 1,200 మంది విద్యార్థులు చదువుతున్నారు. అందులో 25 శాతం సీట్లు ఉచితంగా కేటాయిస్తే దాదాపు 60 వేల మంది నిరుపేద విద్యార్థులకు ఉచితంగా విద్య అందే అవకాశం ఉంటుంది.
అధికారులేంచేస్తున్నారు: ఇక ప్రైవేటు పాఠశాలల తనిఖీలకు ప్రారంభ సమయంలో అధికారులు వెళ్తుంటారు. రికార్డుల్లో మాత్రం నిరుపేదలకు నిబంధనల ప్రకారం సీట్లు కేటాయించినట్లుగా చూపిస్తున్నారు. తర్వాత వారి నుంచి యథావిధిగా ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్నారు. తమకు రికార్డుల్లో ఉచిత విద్య అందుతున్న విషయం విద్యార్థులకు గానీ వారి తల్లిదండ్రులకు గానీ తెలియకుండా యాజమాన్యాలు జాగ్రత్తపడుతున్నాయి. దీనిపై ఉన్నతాధికారుల పర్యవేక్షించి అసలు ఉచిత విద్య అందిస్తున్న విద్యార్థుల జాబితాను బహిర్గతం చేస్తే ప్రైవేటు పాఠశాలల ఉచితం ఎంత శాతం అనేది బయటపడుతుందని విద్యార్థి సంఘాలు అంటున్నాయి.
నిబంధనలు అమలు చేస్తాం: నిబంధనల ప్రకారం ప్రైవేటులో ఉచితంగా 25 శాతం సీట్లు నిరుపేదలకు కేటాయించేలా చర్యలు తీసుకుంటాం. తనిఖీలు చేపట్టి నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూస్తాం
ఇందిర, జిల్లా విద్యాధికారిణి, జోగులాంబ జిల్లా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డీసీసీబీలో ఆధిపత్య పోరు
[ 04-07-2024]
డీసీసీబీ అధికారులు, పాలకవర్గం మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. కొన్ని నిర్ణయాల్లో ఇరు వర్గాల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. -
నడిగడ్డ నీటికష్టం తీరేదెన్నడో!
[ 04-07-2024]
నడిగడ్డలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి నైరాశ్యంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఉన్న ప్రాజెక్టుల్లో జూరాల తప్ప మిగిలినవన్నీ కొనసాగుతున్న ప్రాజెక్టులుగానే ఉన్నాయి. -
వీసీ లేక.. సమస్యలు తీరక!
[ 04-07-2024]
పాలమూరు విశ్వవిద్యాలయం(పీయూ) పాలక మండలి గడువు ముగియడం, శాశ్వత ఉప కులపతి లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. -
అర్హులైనా అందని పథకాలు
[ 04-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి జీరో విద్యుత్తు బిల్లు, వంటగ్యాస్ రాయితీ తదితర పథకాలు అర్హులైనా కొందరికి అందటం లేదు. -
మిగులు ఖాళీలు.. తప్పని అవస్థలు
[ 04-07-2024]
ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేసింది. అర్హులైన ఎస్జీటీలకు వివిధ సబ్జెక్టుల్లో స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించారు. -
అనిశా వలలో తహసీల్దారు
[ 04-07-2024]
పొలాన్ని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు లంచం తీసుకున్న తహసీల్దార్ బుధవారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు (అనిశా) పట్టుబడ్డారు. -
బడిబాట ప్రవేశాలు నామమాత్రం
[ 04-07-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో నూతన విద్యార్థుల ప్రవేశాలు సంఖ్య పెంచడానికి, సర్కారు పాఠశాలల్లో అందిస్తున్న విద్యా విధానాన్ని తల్లిదండ్రులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర విద్యాశాఖ అధికారులు జూన్ 6వ తేదీ నుంచి 19 వరకు ఆచార్య జయశంకర్ బాడిబాట కార్యక్రమం నిర్వహించారు. -
ఇంతింతై.. పెసరింతై
[ 04-07-2024]
పెసర పంటకు నారాయణపేట జిల్లా పెట్టింది పేరు. రకరకాల కారణాలతో ఆ పంట ఏటా తగ్గుతూ వస్తోంది. ఇప్పుడిప్పుడే మళ్లీ సాగు పుంజుకుంటోంది. జిల్లాలోనే అత్యధికంగా రైతులు దామరగిద్దలో సాగు చేస్తారు. -
నిద్దరోతున్న నిఘా కళ్లు
[ 04-07-2024]
జిల్లాలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో భద్రత కోసం అమర్చిన నిఘా కెమెరాలు నిద్ర పోతున్నాయి. -
నీటి విడుదలలో స్పష్టత కరవు
[ 04-07-2024]
ప్రస్తుత వర్షాకాలం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. -
చిరుత సంచారంతో కలకలం !
[ 04-07-2024]
నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం ఎంగంపల్లి తండా సమీపంలోని పొలాల్లో చిరుత సంచారంపై భయాందోళన నెలకొంది. -
విజయమే లక్ష్యం.. స్వర్ణమే స్వప్నం
[ 04-07-2024]
వారు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 20 మంది యువతులు. పట్టుదలతో సాధన చేస్తూ అంచెలంచెలుగా అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణులుగా ఎదిగారు. నెట్బాల్లో దేశానికి ఆశా కిరణాలుగా మారారు. -
ఆవిష్కర్తలారా.. మీకోసం
[ 04-07-2024]
ప్రజా సమస్యలకు పరిష్కారం చూపుతూ.. సృజనాత్మకతతో కొత్త ఆవిష్కరణలను చేసే వారి నుంచి ‘ఇంటింటా ఇన్నోవేటర్’ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. -
పచ్చని కొండ.. మధురానుభూతి నిండా!
[ 04-07-2024]
పేదల తిరుపతిగా విరాజిల్లుతున్న మన్యంకొండ పుణ్యక్షేత్రం పచ్చని అందాలతో కనువిందు చేస్తోంది. ఇటీవల కురిసిన వానలకు కొండపై పచ్చదనం పరచుకుంది. -
ఏడు తరగతులు.. ఒకే టీచర్
[ 04-07-2024]
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రామకృష్ణాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో 1 నుంచి 7 తరగతి వరకు 100 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. -
ఉపాధ్యాయుడిపై రౌడీషీటర్ దాడి
[ 04-07-2024]
పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడిపై బుధవారం మధ్యాహ్నం రౌడీషీటర్ దాడి చేశాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సందేహం అక్కర్లేదు.. నేనే అధ్యక్ష అభ్యర్థిని: బైడెన్
-
వరల్డ్ కప్ మెడల్తో పంత్.. ట్రోల్ చేసిన అక్షర్, సిరాజ్
-
ఇంకా పరారీలోనే భోలే బాబా.. ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు
-
ఘనంగా వరలక్ష్మీ శరత్కుమార్ రిసెప్షన్.. తారల సందడి
-
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ
-
అన్లిమిటెడ్ క్లెయిం మొత్తంతో ఐసీఐసీఐ ఆరోగ్య బీమా పాలసీ!