రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
శాంతినగర్లోని ఇందిరానగర్కు చెందిన హరిజన సోమన్న అలియాస్ సంశాన్(20) ఆదివారం తెల్లవారుజామున ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. బంధువుల కథనం ప్రకారం..
సోమన్న
వడ్డేపల్లి, న్యూస్టుడే: శాంతినగర్లోని ఇందిరానగర్కు చెందిన హరిజన సోమన్న అలియాస్ సంశాన్(20) ఆదివారం తెల్లవారుజామున ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. బంధువుల కథనం ప్రకారం.. బీటెక్ మూడో సంవత్సరం పూర్తి చేసిన యువకుడు హైదరాబాద్లో ర్యాపిడో బైకర్గా ద్విచక్ర వాహనం మీద ప్రయాణికులను తరలిస్తూ ఉపాధి పొందుతున్నాడు. న్యూమలక్పేట సిగ్నల్ వద్ద ద్విచక్రవాహనాన్ని ఆటో ఢీకొనడంతో కింద పడగా వెనుక నుంచి వేగంగా వస్తున్న గుర్తుతెలియని వాహనం తలపై ఎక్కడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.
నీటి సంపులో పడి వృద్ధుడి మృత్యువాత
తెలకపల్లి, న్యూస్టుడే : సంపులో నీటిని తోడుతూ ప్రమాదవశాత్తు అందులో పడి వృద్ధుడు మృతి చెందిన ఘటన మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. గడ్డంపల్లి గ్రామానికి చెందిన పర్వతాలు(77) తన ఇంటి ఎదుట ఉన్న సంపులో నీటిని తోడుతున్నాడు. ప్రమాదవశాత్తు జారి సంపులో పడి మృతి చెందాడు. ఆ సమయంలో ఎవరూ లేరు. కొందరు చిన్నారులు సాయంత్రం గమనించి నాగర్కర్నూల్లో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. ఎస్సై నరేశ్ని వివరణ కోరగా.. ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.
పరిశ్రమలో విద్యుదాఘాతంతో ఒకరు..
బాలానగర్, న్యూస్టుడే : ఓ పరిశ్రమలో విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. జడ్చర్ల మండలం చిన్న ఆదిరాల గ్రామానికి చెందిన రమేశ్(38) గత 14 సంవత్సరాలుగా బాలానగర్ మండల కేంద్రంలోని ఓ పరిశ్రమలో పొక్లెయిన్ డ్రైవర్, ఎలక్ట్రిషన్గా పనిచేస్తున్నాడు. అక్కడే ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. ఆదివారం పరిశ్రమలో విద్యుత్తు రాకపోవడంతో స్తంభం దగ్గర టిప్పర్ పైకి ఎక్కి తీగలు సరిచేస్తుండగా షాక్కు గురై కిందపడ్డాడు. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం షాద్నగర్లోని ఓ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. సీఐటీయూ నాయకులు, బంధువులు మృతదేహంతో పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని, కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని పరిశ్రమ ఎదుట ఆందోళన చేపట్టారు. సీఐ నాగార్జునగౌడ్, ఎస్సైలు తిరుపాజీ, చంద్రమోహన్లు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడారు. న్యాయం చేసే విధంగా కృషి చేస్తామని చెప్పడంతో శాంతింపజేశారు. ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై తిరుపాజీ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డీసీసీబీలో ఆధిపత్య పోరు
[ 04-07-2024]
డీసీసీబీ అధికారులు, పాలకవర్గం మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. కొన్ని నిర్ణయాల్లో ఇరు వర్గాల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. -
నడిగడ్డ నీటికష్టం తీరేదెన్నడో!
[ 04-07-2024]
నడిగడ్డలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి నైరాశ్యంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఉన్న ప్రాజెక్టుల్లో జూరాల తప్ప మిగిలినవన్నీ కొనసాగుతున్న ప్రాజెక్టులుగానే ఉన్నాయి. -
వీసీ లేక.. సమస్యలు తీరక!
[ 04-07-2024]
పాలమూరు విశ్వవిద్యాలయం(పీయూ) పాలక మండలి గడువు ముగియడం, శాశ్వత ఉప కులపతి లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. -
అర్హులైనా అందని పథకాలు
[ 04-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి జీరో విద్యుత్తు బిల్లు, వంటగ్యాస్ రాయితీ తదితర పథకాలు అర్హులైనా కొందరికి అందటం లేదు. -
మిగులు ఖాళీలు.. తప్పని అవస్థలు
[ 04-07-2024]
ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేసింది. అర్హులైన ఎస్జీటీలకు వివిధ సబ్జెక్టుల్లో స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించారు. -
అనిశా వలలో తహసీల్దారు
[ 04-07-2024]
పొలాన్ని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు లంచం తీసుకున్న తహసీల్దార్ బుధవారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు (అనిశా) పట్టుబడ్డారు. -
బడిబాట ప్రవేశాలు నామమాత్రం
[ 04-07-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో నూతన విద్యార్థుల ప్రవేశాలు సంఖ్య పెంచడానికి, సర్కారు పాఠశాలల్లో అందిస్తున్న విద్యా విధానాన్ని తల్లిదండ్రులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర విద్యాశాఖ అధికారులు జూన్ 6వ తేదీ నుంచి 19 వరకు ఆచార్య జయశంకర్ బాడిబాట కార్యక్రమం నిర్వహించారు. -
ఇంతింతై.. పెసరింతై
[ 04-07-2024]
పెసర పంటకు నారాయణపేట జిల్లా పెట్టింది పేరు. రకరకాల కారణాలతో ఆ పంట ఏటా తగ్గుతూ వస్తోంది. ఇప్పుడిప్పుడే మళ్లీ సాగు పుంజుకుంటోంది. జిల్లాలోనే అత్యధికంగా రైతులు దామరగిద్దలో సాగు చేస్తారు. -
నిద్దరోతున్న నిఘా కళ్లు
[ 04-07-2024]
జిల్లాలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో భద్రత కోసం అమర్చిన నిఘా కెమెరాలు నిద్ర పోతున్నాయి. -
నీటి విడుదలలో స్పష్టత కరవు
[ 04-07-2024]
ప్రస్తుత వర్షాకాలం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. -
చిరుత సంచారంతో కలకలం !
[ 04-07-2024]
నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం ఎంగంపల్లి తండా సమీపంలోని పొలాల్లో చిరుత సంచారంపై భయాందోళన నెలకొంది. -
విజయమే లక్ష్యం.. స్వర్ణమే స్వప్నం
[ 04-07-2024]
వారు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 20 మంది యువతులు. పట్టుదలతో సాధన చేస్తూ అంచెలంచెలుగా అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణులుగా ఎదిగారు. నెట్బాల్లో దేశానికి ఆశా కిరణాలుగా మారారు. -
ఆవిష్కర్తలారా.. మీకోసం
[ 04-07-2024]
ప్రజా సమస్యలకు పరిష్కారం చూపుతూ.. సృజనాత్మకతతో కొత్త ఆవిష్కరణలను చేసే వారి నుంచి ‘ఇంటింటా ఇన్నోవేటర్’ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. -
పచ్చని కొండ.. మధురానుభూతి నిండా!
[ 04-07-2024]
పేదల తిరుపతిగా విరాజిల్లుతున్న మన్యంకొండ పుణ్యక్షేత్రం పచ్చని అందాలతో కనువిందు చేస్తోంది. ఇటీవల కురిసిన వానలకు కొండపై పచ్చదనం పరచుకుంది. -
ఏడు తరగతులు.. ఒకే టీచర్
[ 04-07-2024]
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రామకృష్ణాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో 1 నుంచి 7 తరగతి వరకు 100 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. -
ఉపాధ్యాయుడిపై రౌడీషీటర్ దాడి
[ 04-07-2024]
పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడిపై బుధవారం మధ్యాహ్నం రౌడీషీటర్ దాడి చేశాడు.
తాజా వార్తలు (Latest News)
-
మియాపూర్లో యువతిపై అత్యాచారం.. తీవ్రంగా పరిగణించిన ఎన్సీడబ్ల్యూ
-
జైలుకు వెళ్లి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసిన జగన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ద్వితీయ శ్రేణినగరాల్లోనూ ఐటీ విస్తరిస్తాం: మంత్రి శ్రీధర్బాబు
-
ప్రధాని నరేంద్ర మోదీతో ముగిసిన భారత క్రికెటర్ల భేటీ
-
రిషి సునాక్కు మళ్లీ విజయం దక్కేనా? బ్రిటన్లో మొదలైన ఓటింగ్