ఎవరిని అడగాలి? తిరిగిరాని ధరణి స్లాట్ రద్దు సొమ్ములు
రాష్ట్ర ప్రభుత్వం భూ రికార్డుల సంస్కరణల్లో భాగంగా పలు మార్పులు చేయడానికి ప్రస్తుతం అమలులో ఉన్న ధరణి పోర్టల్ స్థానంలో ఒక కొత్త పోర్టల్ను తీసుకుని రావడానికి ముమ్మరంగా ప్రయత్నిస్తోంది.
గద్వాల కలెక్టరేట్, న్యూస్టుడే: రాష్ట్ర ప్రభుత్వం భూ రికార్డుల సంస్కరణల్లో భాగంగా పలు మార్పులు చేయడానికి ప్రస్తుతం అమలులో ఉన్న ధరణి పోర్టల్ స్థానంలో ఒక కొత్త పోర్టల్ను తీసుకుని రావడానికి ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ధరణి పోర్టల్ను పూర్తిగా రద్దు చేయడమా? లేక సంస్కరణలు చేపట్టి క్షేత్రస్థాయిలో భూ సమస్యలు తలెత్తకుండా పటిష్ఠమైన విధానాన్ని అమలులోకి తీసుకుని రావడమా? అనే దానిపై కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ధరణి పోర్టల్ ద్వారా భూ క్రయ, విక్రయాల కోసం రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖలకు నిబంధనల ప్రకారం ఫీజులు చెల్లించి స్లాట్ బుక్ చేసుకున్న వారు చాలా మంది అనివార్య పరిస్థితుల్లో రద్దు చేసుకున్నారు. నిబంధనల ప్రకారం వీరందరికి ఫీజులు వారి ఖాతాకు తిరిగి జమ చేయాల్సి ఉంది. కానీ ఇంత వరకు దానిపై ప్రభుత్వం ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ఈ మొత్తం జిల్లాలో రూ.2 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
కార్యాలయాల చుట్టూ తిరుగుతూ..
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ కోసం మీ సేవలో ఆయా ప్రాంతాల్లో భూమి మార్కెట్ విలువలో 7.5 శాతం నిబంధనల ప్రకారం ఫీజు చెల్లించి ఒప్పందం ప్రకారం స్లాట్ బుకింగ్ చేసుకుంటారు. స్లాట్ కేటాయించిన రోజున సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో ఇరు వర్గాల సమక్షంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను అధికారులు పూర్తి చేస్తారు. రిజిస్ట్రేషన్ చివరి క్షణంలో వారసత్వ భూముల విషయంలో సమస్యలు తలెత్తడం, మిస్సింగ్ సర్వే నంబర్లు ఉండటం, ఆన్లైన్లో సర్వే నంబర్లు కనిపించకపోవడం, భూమి విక్రయంపై అభ్యంతరాలు వ్యక్తం కావడం, వ్యక్తిగత కారణాలతో చివరి క్షణంలో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఇలా నిలిచిపోతే రైతు చెల్లించిన ఫీజు మొత్తం తిరిగి ఆయన ఖాతాలో జమ కావాల్సి ఉంది. అలా కాకపోవడంతో రైతులు తహసీల్దార్ కార్యాలయాలు, మీ సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు.
అధికారులేమంటున్నారంటే
భూములు, స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకుని, ఆ తరువాత రద్దు చేసుకున్న వారికి ప్రభుత్వం నేరుగా వారి ఖాతాలోకి చలానా సొమ్ములు జమ చేస్తుందని రెవెన్యూ అధికారులు అంటున్నారు. స్లాట్ రుసుములు ప్రభుత్వ ఖజానాలో జమ అవుతున్నాయి. స్లాట్ రద్దు చేసుకున్న వారికి తిరిగి అక్కడి నుంచే రావాల్సి ఉంటుంది. ఈ విషయం రెవెన్యూ శాఖకు సంబంధం లేదు. దీనిపై ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వారు పేర్కొంటున్నారు.
ఎందుకు రద్దు చేశారో తెలియదు..
నాకు ఇటిక్యాల మండలం, షేక్ పల్లి గ్రామంలో 11.39 ఎకరాల భూమి ఉంది. అందులో 10 ఎకరాల భూమిని నా సమీప బంధువు పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఖాతా మార్పు చేయడం కోసం గతేడాది నిబంధనల ప్రకారం రూ.25,858లను మీ సేవలో చెల్లించి స్లాట్ బుక్ చేసుకున్నాను. తహసీల్దార్ స్లాట్ను రద్దు చేశారు. స్లాట్ ఎందుకు రద్దు చేశారో తెలియడం లేదు. స్లాట్ బుకింగ్ చేసిన సమయంలో చెల్లించిన సొమ్ములు ఇంత వరకు రాలేదు.
రాముడు, షేక్పల్లి, ఇటిక్యాల మండలం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురి మృతి
[ 01-07-2024]
నాగర్కర్నూలు జిల్లాలోని వనపట్లలో విషాదం చోటు చేసుకుంది. మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. -
పులకించిన పెద్దపోతులపాడు
[ 01-07-2024]
మారుమూల గ్రామంలో, ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించి, బ్యాంకింగ్ రంగంలోనే అత్యున్నతమైన ఎస్బీఐ ఛైర్మన్ పదవికి ఎంపికవడమంటే సాధారణ విషయం కాదు. -
ఎఫ్సీఐకి బియ్యం అప్పగించటమెలా?
[ 01-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరం (2023-24) ఖరీఫ్కు సంబంధించిన సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్)ను ఎఫ్సీఐకి కచ్చితంగా ఇవ్వాల్సిందేనని స్పష్టం చేయటంతో ఉమ్మడి జిల్లాలోని కొందరు మిల్లర్లకు ఆందోళన మొదలైంది. -
అందని అల్పాహారం
[ 01-07-2024]
గ్రామీణ ప్రాంతాల్లో ఖాళీ కడుపుతో ప్రభుత్వ పాఠశాలలకు హాజరయ్యే విద్యార్థుల్లో శారీరక బలహీనతను, ఆకలితో అలమటిస్తూ చదువుపై ఆసక్తి తగ్గే పరిస్థితిని అధిగమించేందుకు భారాస ప్రభుత్వం దసరా కానుకగా గత ఏడాది -
వైకుంఠధామాలనూ వదలట్లేదు!
[ 01-07-2024]
ప్రతి మనిషికి కూడు, గూడు, గుడ్డ ఎంత అవసరమో మరణించిన తరువాత ఖననం చేసేందుకు కొంత స్థలం అవసరం వస్తోంది. ఇది గమనించిన ప్రభుత్వం అన్ని గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. -
కొత్త చట్టాలతో సత్వర న్యాయం
[ 01-07-2024]
బ్రిటీష్ కాలం నాటి చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాలు జులై 1 నుంచి అమలులోకి రానున్నాయి. వీటితో బాధితులు సత్వర న్యాయం పొందే వీలుందని, దోషులకు విధించే శిక్షలతో పాటు జరిమానాలు -
ఎస్జీటీల బదిలీ ఉత్తర్వులకు ఏర్పాట్లు
[ 01-07-2024]
ఉమ్మడి పాలమూరు జిల్లాలో సుమారు నాలుగు వేలకుపైగా ఎస్జీటీలు బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎస్జీటీల బదిలీ ఉత్తర్వులు సోమవారం ఉదయం ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. -
ప్రైవేటులో అనుచితం
[ 01-07-2024]
నిరుపేద విద్యార్థి నర్సింహ చదువులో రాణిస్తున్నాడు. వాడిని మంచి కార్పొరేట్ పాఠశాలలో చదివిస్తే ఇంకా రాణిస్తాడని తండ్రి ఆశ. ప్రైవేటు పాఠాశాలలో చేర్పించటానికి వెళ్లాడు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
[ 01-07-2024]
శాంతినగర్లోని ఇందిరానగర్కు చెందిన హరిజన సోమన్న అలియాస్ సంశాన్(20) ఆదివారం తెల్లవారుజామున ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. బంధువుల కథనం ప్రకారం.. -
పిల్లలమర్రి పిలుస్తోంది!
[ 01-07-2024]
ఏడు శతాబ్దాల చరిత్ర కలిగి, మూడున్నర ఎకరాల్లో విస్తరించి ఉమ్మడి పాలమూరు జిల్లాకు తలమానికంగా నిలిచే పిల్లల మర్రికి పునర్వైభవం రానుంది. త్వరలోనే పిల్లలమర్రి సందర్శకుల కోసం గేట్లు తెరచుకోనున్నాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లాంటి సినిమాలు చాలా అరుదు.. ఆడియన్స్కు థ్యాంక్స్ చెప్పిన నాగ్ అశ్విన్
-
నీట్ రీ-టెస్ట్ ఫలితాలు విడుదల.. మారిన ర్యాంకుల జాబితా
-
కేసీఆర్కు హైకోర్టులో చుక్కెదురు
-
దిగొచ్చిన వాణిజ్య సిలిండర్ ధర.. రూ.32 తగ్గింపు
-
మొరాయించిన శ్రీశైలం దేవస్థానం వెబ్సైట్.. నిలిచిన ఆన్లైన్ టికెట్ల జారీ
-
రో.. ఈ వీడ్కోలు బాధగా ఉంది: రితికా సజ్దే ఎమోషనల్ పోస్ట్