logo

Mahbubnagar: చంద్రప్రభ వాహనంపై ఊరేగిన నారాయణుడు

మండల కేంద్రమైన రాజోలిలోని శ్రీలక్ష్మి వైకుంఠనారాయణ స్వామి ఉత్సవాలలో భాగంగా బుధవారం స్వామి వారికి వివిధ రకాల సేవలను వైభవంగా నిర్వహించారు.

Published : 19 Jun 2024 16:19 IST

రాజోలి: మండల కేంద్రమైన రాజోలిలోని శ్రీలక్ష్మి వైకుంఠనారాయణ స్వామి ఉత్సవాలలో భాగంగా బుధవారం స్వామి వారికి వివిధ రకాల సేవలను వైభవంగా నిర్వహించారు. వేద పండితులు స్వామివారికి ఉదయం ప్రత్యేక అభిషేకాలు, మహామంగళారతి, నిత్యహోమం పూజలు చేశారు. అనంతరం మంగళ వాయిద్యాలు, గోవిందనామ స్మరణల మధ్య చినశేష వాహనం, చంద్రప్రభ వాహన సేవ నిర్వహించారు. స్వామి వారి సేవలను చూసి భక్తులు పునీతులయ్యారు. ఆలయం నుంచి బస్టాండు గుండా ఆంజనేయస్వామి ఆలయం వరకు ఊరేగింపు కొనసాగింది. బ్రహ్మోత్సవాలలో నాల్గవ రోజైన శుక్రవారం భూదేవి, శ్రీదేవి, లక్ష్మిదేవి సమేత స్వామి వారి కల్యాణం అంగరంగవైభవంగా నిర్వహించనున్నట్లుగా ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు