logo

Mahbubnagar: 17 నుంచి నారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు

మండల కేంద్రమైన రాజోలిలో శ్రీ లక్ష్మీ వైకుంఠ నారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.

Published : 11 Jun 2024 15:51 IST

రాజోలి: మండల కేంద్రమైన రాజోలిలో శ్రీ లక్ష్మీ వైకుంఠ నారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆలయ కమిటీ సభ్యులు సమావేశమై ఉత్సవాలపై చర్చించారు. ఈ నెల 24వ తేదీ వరకు ఉత్సవాలు జరగనుండగా, 20వ తేదీన స్వామి వారి కళ్యాణం, 22న రథోత్సవం నిర్వహించనున్నారు. పూజారి గోపీనాథ్ వేద మంత్రాలతో కళ్యాణం లగ్నపత్రికను రాసి, ఆలయ కమిటీ సభ్యులకు అందించారు. కార్యక్రమంలో ఛైర్మన్ శ్రీనివాసులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని