logo

Mahbubnagar: పాఠశాల కోసం భవనాలు పరిశీలన

వడ్డేపల్లిలో నిర్వహిస్తున్న రాజోలి కస్తూర్భా పాఠశాల కోసం మండల కేంద్రంలో శనివారం డీఈవో ఇందిరా భవనాలను పరిశీలించారు.

Published : 15 Jun 2024 19:07 IST

రాజోలి: వడ్డేపల్లిలో నిర్వహిస్తున్న రాజోలి కస్తూర్భా పాఠశాల కోసం మండల కేంద్రంలో శనివారం డీఈవో ఇందిరా భవనాలను పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న భవనం ఇబ్బందికరంగా ఉండడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆమె ఎంఈఓ నరసింహులుతో కలిసి ఉర్దూ పాఠశాల, ఎస్సీ వసతి గృహ భవనాలను పరిశీలించారు. భవనాల పరిస్థితిని మతాధికారులకు వివరించి తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ నర్సింలు, హెచ్ఎం భగవంతు రెడ్డి, కస్తూర్బా ప్రత్యేక అధికారి చంద్రకళ తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు