logo

Rajoli: వైభవంగా శ్రీ లక్ష్మీ వైకుంఠ నారాయణ స్వామి కళ్యాణోత్సవం

మండల కేంద్రమైన రాజులకి గ్రామంలో లక్ష్మీ వైకుంఠ నారాయణస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు.

Published : 20 Jun 2024 17:02 IST

రాజోలి: మండల కేంద్రమైన రాజులకి గ్రామంలో లక్ష్మీ వైకుంఠ నారాయణస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పందిరి కార్యక్రమం, పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమాన్ని బ్యాండ్ వాయిద్యాలతో నిర్వహించారు. ఆలయ ఆవరణంలో శ్రీదేవి భూదేవి లక్ష్మీదేవి సమేత స్వామివారికి కళ్యాణం సాంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు కళ్యాణన్ని వీక్షించగా , వారికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు