logo

Mahbubnagar: గ్రామాల అభివృద్ధి విద్యతోనే సాధ్యం

గ్రామాల్లో ఉండే ప్రతి ఒక్కరు ఉన్నత విద్యను అభ్యసిస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు.

Published : 03 Jul 2024 17:42 IST

రాజోలి: గ్రామాల్లో ఉండే ప్రతి ఒక్కరు ఉన్నత విద్యను అభ్యసిస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన గట్టు మండలం పరిధిలోని వాయిలకుంట తండా, తారాపురం,  ముచ్చోనిపల్లి గ్రామాలలోని పాఠశాలల్లో అదనపు తరగతి గదులను ప్రారంభించారు. ఆధునిక భవనం స్థానిక ప్రజాప్రతినితో కలిసి ప్రారంభించారు. అనంతరం తప్పెట్ల మొర్సు గ్రామంలో పాఠశాల ఆవరణంలో విద్యార్థులతో కలిసి సహబంతి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ జంబు రామన్ గౌడ్‌, ఎంపీపీ విజయ్, జడ్పీటీసీ శ్యామల, ప్యాక్స్‌ ఛైర్మన్‌ వెంకటేష్ తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని