logo

Telugu news: బావిలో మట్టిపడి వ్యక్తి మృతి

జోగులాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం ఇర్కిచేడు గ్రామంలో బావి తవ్వుతుండగా ప్రమాదవశాత్తు మట్టిపడి అందులో వ్యక్తి కూరుకుపోయిన సంఘటన చోటుచేసుకుంది.

Published : 27 Jun 2024 18:02 IST

రాజోలి: జోగులాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం ఇర్కిచేడు గ్రామంలో బావి తవ్వుతుండగా ప్రమాదవశాత్తు మట్టిపడి అందులో వ్యక్తి కూరుకుపోయిన సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జయరాం.. ఓ పొలంలో పాత బావిలో మట్టి తీసే పనులు చేపడుతుండగా.. అందులోకి దిగిన జయరాం లోతును పరిశీలిస్తున్నాడు. ఈ గ్రామంలో పైనుంచి మట్టి పడడంతో ఆ వ్యక్తి అందులో కూరుకుపోయాడు. స్థానికులు గమనించి గంటల తరబడి వాహనం సాయంతో మట్టి తొలగింపు పనులు చేపట్టగా, జయరాం అప్పటికే మృతి చెందాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని