logo

Mahbubnagar: నిబంధనలు పాటిస్తూ బస్సులు నడపాలి

రోడ్డు నియమాలను పాటిస్తూ బస్సులను నడపాలని డీటీవో వెంకటేశ్వరరావు అన్నారు.

Published : 15 Jun 2024 17:25 IST

రాజోలి: రోడ్డు నియమాలను పాటిస్తూ బస్సులను నడపాలని డీటీవో వెంకటేశ్వరరావు అన్నారు. పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో ఆయన గద్వాలలో ప్రైవేటు బస్సులు నడిచే యాజమాన్యాలు డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పిల్లల్ని తీసుకు వెళ్లే క్రమంలో, బస్సులు నడిపేటప్పుడు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ.. అజాగ్రత్తగా వాహనాలు నడపకుండా.. నియమ నిబంధనలను పాటించాలని తెలిపారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే స్కూల్ యాజమాన్యాలు , బస్సు డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు