logo

Books: పాఠశాలలకు పుస్తకాల పంపిణీ

ప్రభుత్వ పాఠశాలలోని ప్రధానోపాధ్యాయులకు శనివారం పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులను ఎంఈఓ నరసింహులు పంపిణీ చేశారు.

Published : 08 Jun 2024 17:30 IST

రాజోలి: ప్రభుత్వ పాఠశాలలోని ప్రధానోపాధ్యాయులకు శనివారం పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులను ఎంఈఓ నరసింహులు పంపిణీ చేశారు. ఎమ్మార్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మొత్తం 16,500 మంది విద్యార్థులకు సంబంధించిన పుస్తకాలను, దుస్తులను అందించారు. ప్రభుత్వం అందించిన వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఎంఈఓ హెచ్ఎంలకు సూచించారు. కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం వెంకటేశ్వర్లు, సీఆర్పీ శాంతయ్య, ఆయా పాఠశాలల హెచ్ఎంలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు