logo

Mahabubnagar: వ్యక్తిపై కొడవలితో దాడి.. నిందితుడికి రిమాండ్‌

భార్య భర్తల మధ్య పంచాయితీకి వెళ్లిన వ్యక్తిపై కొడవలితో దాడి చేసిన సంఘటపై మంగళవారం అర్ధరాత్రి కేసు నమోదు కాగా, బుధవారం రిమాండ్‌కు తరలించినట్లుగా ఎస్సై జగదీశ్వర్ తెలిపారు.

Published : 03 Jul 2024 19:26 IST

రాజోలి: భార్య భర్తల మధ్య పంచాయితీకి వెళ్లిన వ్యక్తిపై కొడవలితో దాడి చేసిన సంఘటపై మంగళవారం అర్ధరాత్రి కేసు నమోదు కాగా, బుధవారం రిమాండ్‌కు తరలించినట్లుగా ఎస్సై జగదీశ్వర్ తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని మాన్‌దొడ్డి గ్రామంలో తిమ్మప్ప తరచూ తన భార్య సరస్వతితో గొడవలు పడుతున్నాడు. ఈ విషయంలో పంచాయితీ చేసేందుకు కొడుకు వరుస అయిన మోహన్, మంగళవారం ఇతర వ్యక్తులతో వారి ఇంటికి వెళ్లాడు. సమస్యపై మాట్లాడుతున్న క్రమంలో తిమ్మప్ప మోహన్‌పై దుర్భాషలాడుతూ, కొడవలితో దాడి చేశాడు. ఈ క్రమంలో ఎడమచేతికి తీవ్ర గాయమైంది. ఈ సంఘటపై కేసు నమోదు చేయగా, బుధవారం కొత్త చట్టం ప్రకారం నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లుగా ఎస్సై తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని