logo

Kurnool: లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లను అందిస్తాం

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో నివసిస్తున్న టిడ్కో లబ్ధిదారులకు ఎమ్మెల్యే పార్థసారథి శుభవార్త చెప్పారు.

Updated : 28 Jun 2024 16:11 IST

ఆదోని మార్కెట్: కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో నివసిస్తున్న టిడ్కో లబ్ధిదారులకు ఎమ్మెల్యే పార్థసారథి శుభవార్త చెప్పారు. లబ్ధిదారులకు కావలసిన సదుపాయాలు అన్ని సమకూర్చే బాధ్యత తీసుకుంటానని ప్రజలకు హామీ ఇచ్చారు. తమ ఇళ్లలోకి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేరాల్సిందిగా మనవి చేశారు. లబ్ధిదారుల అందరితో సమీక్ష సమావేశం నిర్వహించి సమస్యలు అడిగి తెలుసుకుంటానని ఎమ్మెల్యే తెలియజేశారు. సూపరింటెండెంట్‌ ఇంజనీర్ రాజశేఖర్, డీఈ హరికృష్ణ, డీఎల్‌డీసీ శివ శంకర్, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని