logo

ఆ ఘనత చంద్రబాబుకే దక్కుతుంది

ఎన్నికల్లో ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని మండల తెదేపా నాయకులు అన్నారు.

Published : 30 Jun 2024 13:07 IST

ఆస్పరి: ఎన్నికల్లో ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని మండల తెదేపా నాయకులు అన్నారు.  ఇచ్చిన మాట ప్రకారం వృద్ధులకు, దివ్యాంగులకు ఫించన్‌ రూ. 4 వేలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం మండలంలో తెదేపా మండల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జూలై 1వ తేదీన ప్రతి గ్రామంలో పింఛన్ పంపిణీ అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయ ఉద్యోగుల వెంట తెదేపా కార్యకర్తలు ఉండి అందరికీ పింఛన్ల అందేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో హనుమంత్ రెడ్డి, గోపాల్, ఎస్ తిమ్మన్న, కృష్ణ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, గోవిందు, నౌనేపాటి చౌదరి, రామచంద్ర రెడ్డి,  జీవన్ కుమారులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు