logo

గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చూడండి

మండలంలోని గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సమస్య లేకుండా వెంటనే చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అన్నారు.

Published : 03 Jul 2024 12:26 IST

ఎమ్మిగనూరు వ్యవసాయం: మండలంలోని గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సమస్య లేకుండా వెంటనే చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అన్నారు. మండలంలోని వివిధ ప్రభుత్వ శాఖ అధికారులతో బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  తాగునీరు, పారిశుద్ధ్యం సమస్యలు ఉన్న గ్రామాలపై సమీక్షించారు. మండలంలోని గ్రామ సచివాలయాలు, ఇతర ప్రభుత్వ భవనాలు, సీసీ రోడ్ల నిర్మాణం వంటి నిర్మాణాలు, గత ఐదేళ్ల   పాలనలో చేపట్టి అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను  త్వరితగతిగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు