logo

శిక్షణ తరగతుల కరపత్రాలు విడుదల

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి విద్య, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణ తరగతులకు కరపత్రాలను శనివారం విడుదల చేశారు.

Updated : 29 Jun 2024 12:54 IST

ఎమ్మిగనూరు వ్యవసాయం: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి విద్య, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణ తరగతులకు కరపత్రాలను శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఆర్ విజేంద్ర మాట్లాడుతూ.. కాకినాడలో జులై 8, 9, 10 తేదీలలో జరగనున్న ఏఐఎస్ఎఫ్ రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని విద్యార్థి లోకానికి పిలుపునిచ్చారు. విద్యార్థులకు చదువుతోపాటు రాజకీయాల పైన ప్రశ్నించే తత్వాన్ని విద్యార్థి దశలోనే నేర్చుకోవాలని తెలిపారు. కేవలం చదువే కాకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా విద్యావ్యవస్థలో జరుగుతున్నటువంటి అవినీతిని వెలికితీయడానికి, అక్రమాల పైన పోరాటాలు చేయడానికి ఈ శిక్షణా తరగతులలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు సమీర్, అబ్దుల్ ఖాదర్, రయాన్, నరసింహులు, రవి, శివ, సురేష్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని