వైద్య ‘కల’శాల
గతంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా.. ప్రతి జిల్లా, డివిజన్ కేంద్రాల్లో వైద్య కళాశాలలు మంజూరు చేశాం. రూ.వేల కోట్లు మంజూరు చేసి నిర్మాణాలు చేపట్టాం.. ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని గొప్పలు చెప్పిన వైకాపా ప్రభుత్వం.. క్షేత్రస్థాయిలో చేతులెత్తేసింది.
నిధులు మళ్లించిన గత ప్రభుత్వం
పనులకన్నా ప్రచారానికే ప్రాధాన్యం
నంద్యాల పట్టణం, న్యూస్టుడే
ఆదోనిలో నిర్మాణంలో వైద్య కళాశాల
గతంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా.. ప్రతి జిల్లా, డివిజన్ కేంద్రాల్లో వైద్య కళాశాలలు మంజూరు చేశాం. రూ.వేల కోట్లు మంజూరు చేసి నిర్మాణాలు చేపట్టాం.. ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని గొప్పలు చెప్పిన వైకాపా ప్రభుత్వం.. క్షేత్రస్థాయిలో చేతులెత్తేసింది. నాబార్డు ఆర్థిక సాయంతో చేపట్టిన ఆదోని వైద్య కళాశాల నిధులు దారి మళ్లించింది. ఇక్కడ నిర్మాణాలు ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఈ కళాశాల ప్రారంభంపై నీలినీడలు కమ్ముకొన్నాయి. పనులకన్నా వైకాపా ప్రచారానికే ప్రాధాన్యమివ్వడం వైద్య విద్యార్థుల పాలిట శాపంగా మారింది.
బకాయిలతో పురోగతి కరవు
నంద్యాల వైద్య కళాశాలలో గతేడాదే తరగతులు ప్రారంభమయ్యాయి. ఇక్కడ రూ.450 కోట్ల వ్యయంతో ఆర్ఏఆర్ఎస్కు చెందిన 50 ఎకరాల భూమిలో నిర్మాణ పనులు చేపట్టారు. ఇప్పటి వరకు రూ.80 కోట్ల పనులు జరిగాయి. తరగతి గదుల నిర్మాణాలు పూర్తయినా వసతిగృహాల నిర్మాణ పనులు మాత్రం ఇంకా పూర్తి కాలేదు. 180 మంది విద్యార్థినులు, 120 మంది విద్యార్థులకు వసతి కల్పించేందుకు చేపట్టిన ఈ వసతిగృహాల నిర్మాణం ఏడాదిగా కొనసాగుతోంది. ఇక్కడ రూ.80 కోట్ల పనులు జరిగినా గుత్తేదారుకు రూ.60 కోట్ల బిల్లులు మాత్రమే అందాయి. మరో రూ.20 కోట్ల చెల్లింపులు జరగాల్సి ఉంది. బకాయిలు పెద్ద మొత్తంలో ఉండటంతో పనుల్లో పురోగతి కరవైంది.
ఆసుపత్రి నిర్మాణం మాటేమిటి?
వైద్య విద్యలో భాగంగా తొలి రెండేళ్లు థియరీ మాత్రమే బోధిస్తారు. మూడో ఏడాది నుంచి ప్రాక్టికల్స్ అవసరం ఉంటుంది. ఇందుకు అనుబంధ ఆసుపత్రి నిర్మాణం జరగాల్సిందే. విద్యార్థులు మూడో ఏడాదిలోకి ప్రవేశించే లోగానే కళాశాలలో కచ్చితంగా అనుబంధ ఆసుపత్రి భవనం అందుబాటులో ఉండాలి. కానీ నంద్యాలలో ఇంత వరకు ఆసుపత్రి నిర్మాణ పనులే ప్రారంభం కాలేదు. ఆరు బ్లాక్లతో కూడిన అనుబంధ ఆసుపత్రి నిర్మాణం జరగాలంటే కనీసం రెండేళ్ల సమయం పట్టే ఆస్కారముంది. ఇక్కడ మాత్రం వచ్చే ఏడాదికల్లా ఆసుపత్రి అందుబాటులో ఉండాలి. నిర్మాణ పనులకు మాత్రం ఇంతవరకు పునాదులు కూడా తీయలేదు. చేసిన పనులకే గుత్తేదారులకు బిల్లులు రాలేని పరిస్థితుల్లో ఈ నిర్మాణం ఎప్పుడు ప్రారంభించి ఎన్నటికి పూర్తి చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.
ఆదోనిలో ప్రవేశాలపై ప్రభావం
ఆదోని శివార్లలో రూ.475 కోట్లతో గతేడాది వైద్య కళాశాల నిర్మాణ పనులు ప్రారంభించారు. 2024- 25 విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభిస్తామని గతంలో ప్రజాప్రతినిధులు ప్రకటించారు. గుర్తింపు పొందిన నిర్మాణ సంస్థ పనులు దక్కించుకుంది. ఈ కళాశాల కోసం నాబార్డు విడుదల చేసిన నిధులను వైకాపా ప్రభుత్వం దారి మళ్లించింది. ఇతర అవసరాల కోసం ఈ నిధులను వినియోగించింది. దీంతో ఇప్పటి వరకు గుత్తేదారు చేసిన పనులకు బిల్లులు చెల్లింపులో ఆలస్యం జరుగుతోంది. రూ.50 కోట్ల పనులు చేయగా.. రూ.30 కోట్ల మేర చెల్లింపులు జరిగాయి. ఇంకా రూ.20 కోట్ల బిల్లుల చెల్లింపు ఆలస్యం కావడంతో నిర్మాణ సంస్థ పనులను నెమ్మదిగా చేస్తోంది. ఒప్పందం ప్రకారం డిసెంబరు 31 నాటికి కళాశాల భవనం పనులు పూర్తి చేయాలి. ప్రస్తుతం గ్రౌండ్ఫ్లోర్ పనులు మాత్రమే పూర్తయ్యాయి. మొదటి అంతస్తు పనులు కొన్ని రోజుల కిందటే ప్రారంభమయ్యాయి. ఇదే పరిస్థితి కొనసాగితే నిర్మాణ పనులకు మరో రెండేళ్లు పట్టే అవకాశముంది. ఇటీవల ఆదోనికి వచ్చి తనిఖీ చేసిన ఎంసీఐ బృందం ఈ విషయాన్ని గుర్తించింది. ఎంసీఐ బృందం ఇచ్చే నివేదికను బట్టి ఈ ఏడాది కళాశాల ప్రారంభమవుతుందా లేదా అన్నది తేలనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్న కాలనీల్లో ‘భూ’చోళ్లు
[ 07-07-2024]
అర్హులైన ప్రతి ఒక్కరికీ పట్టాలు అందజేశాం.. ఇళ్లు కాదు.. ఊళ్లు నిర్మిస్తున్నామన్నారు. కొండలు, గుట్టలు, గ్రామాలకు కిలోమీటర్ల దూరంలో.. కనీసం రహదారులు లేని ప్రాంతాల్లో జగనన్న కాలనీలు ఏర్పాటు చేశారు. -
ఖాళీ భవనం..రూ.1.20 కోట్ల అద్దె
[ 07-07-2024]
మానవ హక్కుల కమిషన్ బలంగా ఉంటే ప్రభుత్వం చేసే తప్పిదాలకు సంబంధించిన ఫిర్యాదులు వెల్లువెత్తుతాయి.. -
పుర నిధులు వైకాపా పరం
[ 07-07-2024]
గత ప్రభుత్వ హయాంలో పురపాలికలో చేపట్టిన పనులపై కూటమి సర్కారు దృష్టిసారించింది. -
రామయ్యా.. ఇప్పుడు గుర్తొచ్చామా
[ 07-07-2024]
‘మీకు అవసరం ఉంటేనే సమావేశం నిర్వహిస్తారు. లేకుంటే పట్టించుకోరు.. మూడేళ్లుగా నిర్వహించని సమావేశం ఇప్పుడెందుకు నిర్వహిస్తున్నారు.. -
టన్ను ఇసుక రూ.335
[ 07-07-2024]
ఉచిత ఇసుక విధానం అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది.. ఈ నెల 8 నుంచి కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది.. ఈ నేపథ్యంలో జిల్లాలో అవసరం.. ఎక్కడి నుంచి తీసుకురావాలి.. -
గుడికంబాలిలో 29 వేల మెట్రిక్ టన్నులు
[ 07-07-2024]
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలమేరకు జిల్లాలో 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానం అమలు చేయనున్నట్లు కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. -
అందాల నల్లమల... ఆస్వాదించేద్దామిలా!
[ 07-07-2024]
చుట్టూ పచ్చని చెట్లు...పక్షుల కిలకిలారావాలు...ప్రకృతి రమణీయతను ఆస్వాదించాలని ఎవరైనా అనుకుంటే ఒక్కసారి నల్లమల సందర్శించాల్సిందే. -
బిల్లుల గోలే.. సమస్యలపై దృష్టేదీ
[ 07-07-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చి వాటి పరిష్కారానికి కృషి చేయాల్సిన జడ్పీ పాలకమండలి సభ్యులు పెండింగ్ బిల్లులపై మాత్రం గళం విప్పారు. -
ప్రహ్లాదవరదునికి 473 కలశాలతో అభిషేకం
[ 07-07-2024]
ఆళ్లగడ్డ మండలంలోని దిగువ అహోబిలం ఆలయ జీర్ణోద్ధరణ అష్టదిగ్బంధన మహా సంప్రోక్షణ వైభవంగా సాగుతోంది. -
తవ్వేసి.. తరలించేసి...
[ 07-07-2024]
రహదారి విస్తరణ పేరిట మట్టిని కొల్లగొట్టేస్తున్నారు. మొన్నటివరకు కొండలుగుట్టల్ని వదల్లేదు.. ఇప్పుడు పొలాలకు వెళ్లే దారి పక్కనే లోతుగా తవ్వేస్తుండటం గమనార్హం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గుడివాడలో క్షుద్రపూజల కలకలం
-
భారమనుకుని నేలకేసి బాది.. ఏడాదిన్నర పసివాడిని పొట్టన పెట్టుకున్న కర్కశుడు
-
రూ.కోటి విలువచేసే ఫ్లాటు.. ఆడీ కారు.. పోలీసులకు చిక్కిన దర్జాదొంగ
-
వయసు 57.. సెంచరీలు 1000
-
ఏపీలోని ఆ ఐదు గ్రామాలు.. మళ్లీ భద్రాచలంలో కలిసేనా..?
-
నా హత్యకు కుట్ర.. కాటసానిపై తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడి ఫిర్యాదు