క్లస్టర్ విశ్వ‘వివాదాలయం’
నగరంలో క్లస్టర్ విశ్వ‘వివాదాలయం’గా మారింది. వర్సిటీ పరిధిలో పెద్దఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఉన్నత విద్యను మెరుగుపరచాలన్న ఉద్దేశంతో 2018లో అప్పటి తెదేపా ప్రభుత్వం నగరంలో క్లస్టర్ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.
యూజీసీ నిబంధనలు కాలరాశారు
భ్రష్టు పట్టించిన వైకాపా ప్రభుత్వం
వర్సిటీలో పాలన అస్తవ్యస్తం
కర్నూలు విద్య, న్యూస్టుడే
నగరంలో క్లస్టర్ విశ్వ‘వివాదాలయం’గా మారింది. వర్సిటీ పరిధిలో పెద్దఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఉన్నత విద్యను మెరుగుపరచాలన్న ఉద్దేశంతో 2018లో అప్పటి తెదేపా ప్రభుత్వం నగరంలో క్లస్టర్ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. కేవీఆర్ మహిళా డిగ్రీ కళాశాల, ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాల, సిల్వర్జూబ్లీ కళాశాలలను అనుసంధానంతో దీన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తర్వాత అధికార గద్దెనెక్కిన వైకాపా పట్టించుకోలేదు. కేవలం ఉప కులపతి పోస్టును మంజూరు చేశారు. పరిపాలనా సౌలభ్యం నిమిత్తం శ్రీ వేంకటేశ్వర వర్సిటీలోని కెమిస్ట్రీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ప్రొఫెసర్ డి.శ్రీనివాసులును వీసీగా నియమించారు.. ఆయన 2021-22 విద్యా సంవత్సరంలో బాధ్యతలు చేపట్టారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో క్లస్టర్ వర్సిటీ వివాదాలమయంగా మారింది.
ప్రవేశాలపై ప్రభావం
క్లస్టర్ వర్సిటీ పరిధిలో 2021-22 విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలు కల్పిస్తున్నారు. విధానపరమైన నిర్ణయాలు సరిగా లేకపోవడంతో ప్రవేశాలపై తీవ్ర ప్రభావం పడింది. 2023-24 విద్యా సంవత్సరంలో ప్రథమ సంవత్సరంలో విద్యార్థుల ప్రవేశాల సంఖ్య తగ్గింది. కేవీఆర్లో 1,100 సీట్లకు 553, ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాలలో 355 సీట్లకు 239, సిల్వర్జూబ్లీలో 280 సీట్లకు 255 మంది విద్యార్థులు చేరారు. ఈ ఏడాది ప్రవేశాలు జరగాల్సి ఉంది.
‘వసతి’ నిర్వహణ గాలికి
సిల్వర్జూబ్లీ కళాశాలలో ప్రవేశం తీసుకున్న విద్యార్థులు వసతిగృహాల్లో ఉంటారు. ఇక్కడ బాలురు, బాలికలకు వేర్వేరుగా వసతి గృహాలున్నాయి. 750 మంది వసతి పొందడానికి వీలుంది. వసతిగృహం నిర్వహణ (సిబ్బంది వేతనాలు, మరుగుదొడ్ల శుభ్రత, విద్యుత్తు బిల్లు) నిమిత్తం ఏడాదికి ఒక్కో విద్యార్థి నుంచి రూ.4 వేలు వసూలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఈ సొమ్ము కళాశాలకు చెందిన బ్యాంకు ఖాతాలో జమ చేయాలి. 2021-22 నుంచి క్లస్టర్ వర్సిటీకి చెందిన బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నారు. వసతి గృహాల్లో సమస్య పరిష్కారానికి అయ్యే ఖర్చును క్లస్టర్ వర్సిటీ వీసీని అడిగి తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. నిధులివ్వడానికి వారు పేచీ పెడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు వసూలు చేస్తున్నా వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించడం లేదని విద్యార్థులు వాపోతున్నారు.
విద్యుత్తు వినియోగంలో పక్కదారి
క్లస్టర్ వర్సిటీ పరిపాలన భవనానికి విద్యుత్తు సౌకర్యం లేకపోవడంతో సిల్వర్జూబ్లీ కళాశాలకు చెందిన బాలికల వసతిగృహం నుంచి అక్రమంగా కనెక్షన్ తీసుకున్నట్లు సమాచారం. విద్యుత్తు శాఖ అనుమతి లేకుండానే కనెక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.2021 వరకు వసతిగృహానికి ప్రతి నెలా రూ.5 వేల నుంచి రూ.13 వేల మధ్యలో విద్యుత్తు బిల్లు వచ్చేది. ప్రస్తుతం రూ.24 వేల నుంచి రూ.44 వేలకు పెరిగింది. జనవరిలో రూ.20,826, ఫిబ్రవరి 39,969, మార్చి రూ.46,123, ఏప్రిల్లో రూ.44.243 చెల్లించారు. వసతిగృహ నిర్వహణ నిమిత్తం వసూలు చేసిన సొమ్మును ఇందుకు వినియోగిస్తున్నారు.
విద్యార్థుల సొమ్ము ప్రైవేటు బ్యాంకులో జమ
విద్యార్థి ఏ కళాశాలలో చేరితే అక్కడే రుసుములు చెల్లించాల్సి ఉంటుందని నిబంధనలు చెబుతున్నాయి. వీటిని పక్కన పెట్టారు..2023-23 విద్యా సంవత్సరంలో కేవీఆర్, సిల్వర్జూబ్లీ, ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాలల్లో చేరిన విద్యార్థుల నుంచి క్లస్టర్ వర్సిటీ అధికారులు వసూలు చేస్తున్నారు. ప్రథమ ఏడాదిలో చేరిన ఒక్కో విద్యార్థి నుంచి వసతి గృహం రుసుమురూ.4 వేలు, ప్రవేశ రుసుము రూ.9,500 వసూలు చేశారు. ఇలా వసూలైన సొమ్ము సుమారు రూ.కోటి వరకు కర్నూలు మద్దూర్ నగర్లోని హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖాతాలో జమ చేసినట్లు సమాచారం.
సీఐడీ లేఖ బుట్టదాఖలు
క్లస్టర్ వర్సిటీ పరిధిలో మూడు కళాశాలలు ఉన్నాయి. విద్యార్థుల నుంచి వసూలు చేసిన రుసుము ప్రైవేటు బ్యాంకులో జమ చేయడం వివాదాలకు దారి తీసింది. ఈ విషయమై ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాల, కేవీఆర్ మహిళా డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు అభ్యంతర వ్యక్తం చేశారు. ఈ కారణంగానే వారిద్దరిని బదిలీ చేయించారన్న ఆరోపణలు ఉన్నాయి. క్లస్టర్ వర్సిటీలో ఫీజుల అక్రమాలపై కొందరు వ్యక్తులు 2023 అక్టోబరులో సీఐడీకి ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టాలని సీఐడీ కార్యాలయం నుంచి గతేడాది డిసెంబరులో అప్పటి కలెక్టర్కు లేఖ వచ్చింది. ఇప్పటివరకు విచారణ చేయకపోవం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేవరగట్టులో ప్రత్యేక పూజలు
[ 07-07-2024]
హోళగుంద మండలం దేవరగట్టు మాళ, మల్లేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
తుంగభద్ర జలాశయానికి భారీగా వరద ప్రవాహం
[ 07-07-2024]
ఆంధ్ర , కర్ణాటక రాష్ట్రాలకు తాగు, సాగు నీరు అందించే తుంగభద్ర జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతుందని తుంగభద్ర డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. -
జగనన్న కాలనీల్లో ‘భూ’చోళ్లు
[ 07-07-2024]
అర్హులైన ప్రతి ఒక్కరికీ పట్టాలు అందజేశాం.. ఇళ్లు కాదు.. ఊళ్లు నిర్మిస్తున్నామన్నారు. కొండలు, గుట్టలు, గ్రామాలకు కిలోమీటర్ల దూరంలో.. కనీసం రహదారులు లేని ప్రాంతాల్లో జగనన్న కాలనీలు ఏర్పాటు చేశారు. -
ఖాళీ భవనం..రూ.1.20 కోట్ల అద్దె
[ 07-07-2024]
మానవ హక్కుల కమిషన్ బలంగా ఉంటే ప్రభుత్వం చేసే తప్పిదాలకు సంబంధించిన ఫిర్యాదులు వెల్లువెత్తుతాయి.. -
పుర నిధులు వైకాపా పరం
[ 07-07-2024]
గత ప్రభుత్వ హయాంలో పురపాలికలో చేపట్టిన పనులపై కూటమి సర్కారు దృష్టిసారించింది. -
రామయ్యా.. ఇప్పుడు గుర్తొచ్చామా
[ 07-07-2024]
‘మీకు అవసరం ఉంటేనే సమావేశం నిర్వహిస్తారు. లేకుంటే పట్టించుకోరు.. మూడేళ్లుగా నిర్వహించని సమావేశం ఇప్పుడెందుకు నిర్వహిస్తున్నారు.. -
టన్ను ఇసుక రూ.335
[ 07-07-2024]
ఉచిత ఇసుక విధానం అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది.. ఈ నెల 8 నుంచి కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది.. ఈ నేపథ్యంలో జిల్లాలో అవసరం.. ఎక్కడి నుంచి తీసుకురావాలి.. -
గుడికంబాలిలో 29 వేల మెట్రిక్ టన్నులు
[ 07-07-2024]
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలమేరకు జిల్లాలో 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానం అమలు చేయనున్నట్లు కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. -
అందాల నల్లమల... ఆస్వాదించేద్దామిలా!
[ 07-07-2024]
చుట్టూ పచ్చని చెట్లు...పక్షుల కిలకిలారావాలు...ప్రకృతి రమణీయతను ఆస్వాదించాలని ఎవరైనా అనుకుంటే ఒక్కసారి నల్లమల సందర్శించాల్సిందే. -
బిల్లుల గోలే.. సమస్యలపై దృష్టేదీ
[ 07-07-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చి వాటి పరిష్కారానికి కృషి చేయాల్సిన జడ్పీ పాలకమండలి సభ్యులు పెండింగ్ బిల్లులపై మాత్రం గళం విప్పారు. -
ప్రహ్లాదవరదునికి 473 కలశాలతో అభిషేకం
[ 07-07-2024]
ఆళ్లగడ్డ మండలంలోని దిగువ అహోబిలం ఆలయ జీర్ణోద్ధరణ అష్టదిగ్బంధన మహా సంప్రోక్షణ వైభవంగా సాగుతోంది. -
తవ్వేసి.. తరలించేసి...
[ 07-07-2024]
రహదారి విస్తరణ పేరిట మట్టిని కొల్లగొట్టేస్తున్నారు. మొన్నటివరకు కొండలుగుట్టల్ని వదల్లేదు.. ఇప్పుడు పొలాలకు వెళ్లే దారి పక్కనే లోతుగా తవ్వేస్తుండటం గమనార్హం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని నుంచి ఆ ఒక్క ఫోన్ కాల్తో రిలాక్స్ అయిపోయా : రిషభ్ పంత్
-
పోటీపై బైడెన్ త్వరలో నిర్ణయం.. హవాయి గవర్నర్ కీలక వ్యాఖ్యలు!
-
దర్శన్కు డబ్బు ఎందుకిచ్చినట్లు?
-
అమ్మానాన్న మనసు వెన్న.. మమత మిన్న.. ఆలోచన రేకెత్తించిన విద్యార్థుల ప్రాజెక్టు
-
సూరత్లో భవనం కుప్పకూలిన ఘటన.. ఏడుకు చేరిన మృతులు
-
2 నెలల్లో అమరావతికి స్వచ్ఛ శోభ