logo

కర్నూలు-బళ్లారి మధ్య జాతీయ రహదారి నిర్మించాలి

కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు బుధవారం కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ జైరాజ్‌ గడ్కరీని ఆయన కార్యాలయంలో కలిశారు.

Published : 04 Jul 2024 03:39 IST

కేంద్ర మంత్రి గడ్కరీతో కర్నూలు ఎంపీ నాగరాజు

కర్నూలు గ్రామీణ, న్యూస్‌టుడే: కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు బుధవారం కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ జైరాజ్‌ గడ్కరీని ఆయన కార్యాలయంలో కలిశారు. కర్నూలు నుంచి బళ్లారికి జాతీయ రహదారిని నిర్మించాలని, కర్నూలు టోల్‌గేట్‌ నుంచి పంచలింగాల గ్రామం వరకు సర్వీస్‌ రోడ్డును విస్తరించాలని, వెంకటరమణ కాలనీ అండర్‌పాస్‌ వద్దనున్న సర్వీస్‌ రోడ్డును విస్తరించాలని కోరుతూ గడ్కరీకి వినతిపత్రం సమర్పించారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని, కర్నూలు నుంచి బళ్లారి హైవే రోడ్డుతోపాటు రహదారుల విస్తరణకు హామీ ఇచ్చినట్లు ఎంపీ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని