ఉద్యోగుల కష్టార్జితాన్ని శిల్పా దోచుకున్నారు : బుడ్డా
శ్రీశైల దేవస్థానంలో పనిచేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కష్టార్జితాన్ని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి దోచుకున్నారని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి ఆరోపించారు. ఆత్మకూరు వెలుగు కార్యాలయంలో బుధవారం పొదుపు సంఘాల ఆర్పీలు, వెలుగు సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు.
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి
ఆత్మకూరు, న్యూస్టుడే : శ్రీశైల దేవస్థానంలో పనిచేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కష్టార్జితాన్ని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి దోచుకున్నారని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి ఆరోపించారు. ఆత్మకూరు వెలుగు కార్యాలయంలో బుధవారం పొదుపు సంఘాల ఆర్పీలు, వెలుగు సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవస్థానం టీఏ, డీఏలు పోను ఒక్కో ఉద్యోగికి రూ.15 వేలు ఇస్తే శిల్పా కుమారుడి పేరుతో ఉన్న సంస్థ ద్వారా రూ.9 వేలు మాత్రమే ఇచ్చి మిగిలిన డబ్బు స్వాహా చేశారని ధ్వజమెత్తారు. దేవస్థానం పరిధిలో దాదాపు 1500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, వీరిపై నెలకు రూ.కోటి వరకు దోచుకున్నారని ఆరోపించారు. ప్రజలు వైకాపాను నమ్మి అధికారమిస్తే రాష్ట్రంలో రాక్షస పాలన సాగించారని విమర్శించారు. ఐదేళ్లలో ఇంత ఘోరంగా ఓడిన పార్టీ దేశంలో ఎక్కడా లేదన్నారు. పొదుపు సంఘాల సభ్యులు గత ప్రభుత్వంలో కొందరు నాయకుల అండతో అందిన కాడికి భోంచేస్తూ వచ్చారన్నారు. ఇప్పటికైనా రాజకీయాలు తగ్గించి సంఘాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. లేదంటే ప్రక్షాళన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. కమిషనర్ హరిప్రసాద్, తెదేపా నాయకులు గోవిందరెడ్డి, శివరామిరెడ్డి, వేణుగోపాల్, కలీముల్లా, అబ్దుల్లాపురం బాషా తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్న కాలనీల్లో ‘భూ’చోళ్లు
[ 07-07-2024]
అర్హులైన ప్రతి ఒక్కరికీ పట్టాలు అందజేశాం.. ఇళ్లు కాదు.. ఊళ్లు నిర్మిస్తున్నామన్నారు. కొండలు, గుట్టలు, గ్రామాలకు కిలోమీటర్ల దూరంలో.. కనీసం రహదారులు లేని ప్రాంతాల్లో జగనన్న కాలనీలు ఏర్పాటు చేశారు. -
ఖాళీ భవనం..రూ.1.20 కోట్ల అద్దె
[ 07-07-2024]
మానవ హక్కుల కమిషన్ బలంగా ఉంటే ప్రభుత్వం చేసే తప్పిదాలకు సంబంధించిన ఫిర్యాదులు వెల్లువెత్తుతాయి.. -
పుర నిధులు వైకాపా పరం
[ 07-07-2024]
గత ప్రభుత్వ హయాంలో పురపాలికలో చేపట్టిన పనులపై కూటమి సర్కారు దృష్టిసారించింది. -
రామయ్యా.. ఇప్పుడు గుర్తొచ్చామా
[ 07-07-2024]
‘మీకు అవసరం ఉంటేనే సమావేశం నిర్వహిస్తారు. లేకుంటే పట్టించుకోరు.. మూడేళ్లుగా నిర్వహించని సమావేశం ఇప్పుడెందుకు నిర్వహిస్తున్నారు.. -
టన్ను ఇసుక రూ.335
[ 07-07-2024]
ఉచిత ఇసుక విధానం అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది.. ఈ నెల 8 నుంచి కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది.. ఈ నేపథ్యంలో జిల్లాలో అవసరం.. ఎక్కడి నుంచి తీసుకురావాలి.. -
గుడికంబాలిలో 29 వేల మెట్రిక్ టన్నులు
[ 07-07-2024]
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలమేరకు జిల్లాలో 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానం అమలు చేయనున్నట్లు కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. -
అందాల నల్లమల... ఆస్వాదించేద్దామిలా!
[ 07-07-2024]
చుట్టూ పచ్చని చెట్లు...పక్షుల కిలకిలారావాలు...ప్రకృతి రమణీయతను ఆస్వాదించాలని ఎవరైనా అనుకుంటే ఒక్కసారి నల్లమల సందర్శించాల్సిందే. -
బిల్లుల గోలే.. సమస్యలపై దృష్టేదీ
[ 07-07-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చి వాటి పరిష్కారానికి కృషి చేయాల్సిన జడ్పీ పాలకమండలి సభ్యులు పెండింగ్ బిల్లులపై మాత్రం గళం విప్పారు. -
ప్రహ్లాదవరదునికి 473 కలశాలతో అభిషేకం
[ 07-07-2024]
ఆళ్లగడ్డ మండలంలోని దిగువ అహోబిలం ఆలయ జీర్ణోద్ధరణ అష్టదిగ్బంధన మహా సంప్రోక్షణ వైభవంగా సాగుతోంది. -
తవ్వేసి.. తరలించేసి...
[ 07-07-2024]
రహదారి విస్తరణ పేరిట మట్టిని కొల్లగొట్టేస్తున్నారు. మొన్నటివరకు కొండలుగుట్టల్ని వదల్లేదు.. ఇప్పుడు పొలాలకు వెళ్లే దారి పక్కనే లోతుగా తవ్వేస్తుండటం గమనార్హం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
భారమనుకుని నేలకేసి బాది.. ఏడాదిన్నర పసివాడిని పొట్టన పెట్టుకున్న కర్కశుడు
-
రూ.కోటి విలువచేసే ఫ్లాటు.. ఆడీ కారు.. పోలీసులకు చిక్కిన దర్జాదొంగ
-
వయసు 57.. సెంచరీలు 1000
-
ఏపీలోని ఆ ఐదు గ్రామాలు.. మళ్లీ భద్రాచలంలో కలిసేనా..?
-
నా హత్యకు కుట్ర.. కాటసానిపై తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడి ఫిర్యాదు
-
మూడు నిమిషాలు చర్చించి.. 4 వాయిదాల్లో ముగించేశారు..