గూల్యం బ్యాడిగ విత్తనం అమూల్యం
రైతులు సాగు చేసిన పంటలు మంచి దిగుబడి రావాలంటే ముందుగా నాణ్యమైనా విత్తనాలు అవసరం. వీటి కోసం రైతులు తిరగని చోటు ఉండదు.. ఒక చోట నాణ్యమైన విత్తనాలు లేకుంటే మరో చోటుకు వెళ్లి విచారణ చేసి మరి కొనుగోలు చేస్తారు.
మిరప సాగుపై ఆసక్తి
నేరుగా అన్నదాతల చెంతనే కొనుగోలు
న్యూస్టుడే, హాలహర్వి
రైతులు సాగు చేసిన పంటలు మంచి దిగుబడి రావాలంటే ముందుగా నాణ్యమైనా విత్తనాలు అవసరం. వీటి కోసం రైతులు తిరగని చోటు ఉండదు.. ఒక చోట నాణ్యమైన విత్తనాలు లేకుంటే మరో చోటుకు వెళ్లి విచారణ చేసి మరి కొనుగోలు చేస్తారు. హాలహర్వి మండలం గూళ్యం గ్రామంలో దొరికే బ్యాడిగ మిరప విత్తనాలకు భలే గిరాకీ ఉంటుంది. ఆదోని డివిజన్లో చాలా గ్రామాల రైతులు గూళ్యం గ్రామానికి వెళ్లి కొనుగోలు చేస్తారు.
పశ్చిమాన సాగు అధికం
కర్నూలు జిల్లాలో తుంగభద్ర దిగువ కాల్వ, బోరుబావులు, ఎత్తిపొతుల పథకం, వంకలు, వాగులు, నీటి కుంటల కింద మిరప పంటను అధికంగా సాగు చేస్తారు. కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతాలైన ఆదోని, మంత్రాలయం, పెద్దకడబూరు, కోసిగి, కౌతాళం, ఎమ్మిగనూరు, ఆలూరు, హాలహర్వి, హొళగుంద మండలాల్లో బ్యాడిగి రకం మిరపపై రైతులు ఆసక్తి చూపుతుంటారు. ఆస్పరి, దేవనకొండ మండలాల్లో గుంటూరు, బ్యాడిగి రకాలు సాగు చేస్తారు. అందులో 70శాతం బ్యాడిగ రకానికే ప్రాధాన్యం ఇస్తుంటారు. విత్తనాలు ఎక్కడ పడితే అక్కడ కొనుగోలు చేయకుండా ఒకే చోట నాణ్యమైనా విత్తనాలు దొరికే చోటుకు వెళ్లి రైతులు తెచ్చుకుంటారు.
మిరప నుంచి విత్తనాలు వేరు చేస్తున్న యంత్రం
ఇలా చేస్తారు..
విత్తనాలు కోసం ఎండు మిరపను కిలో రూ.1200 నుంచి రూ.1400 వరకు విక్రయిస్తారు. సాగు చేయాలంటే ఒక ఎకరానికి 5 కిలోల ఎండు మిరపను తీసుకోవాలి. దీన్ని యంత్రంలో విత్తనాలు వేరు చేసేందుకు కిలోకు రూ.15 నుంచి రూ.25 వరకు తీసుకుంటారు. ఒక కిలో ఎండు మిరపకు 600గ్రాముల నుంచి 800గ్రాముల వరకు విత్తనాలు వస్తాయి. ఎండు మిరపపై పొట్టు వంటల్లో వినియోగించుకోవచ్చు.. ఆదోని డివిజన్లో ఆదోని, పెద్దకడబూరు, కౌతళం, మంత్రాలయం, కోసిగి, ఆలూరు, హొళగుంద మండలాలు నుంచి వేలాధి మంది రైతులు వచ్చి కొనుగోలు చేస్తారని గూళ్యం గ్రామస్థులు చెబుతున్నారు.
గంపలోకి పడుతున్న విత్తనాలు
కర్ణాటక విత్తనమే ఎందుకు..?
హాలహర్వి మండలం గూళ్యం గ్రామంలో కొందరు రైతులు, వ్యాపారులు కర్ణాటక ప్రాంతంలో వర్షధారం కింద సాగు చేసిన బ్యాడిగ రకం ఎండు మిరప కాయాలను కొనుగోలు చేసి విత్తనాల కోసం అన్నదాతలకు విక్రయిస్తారు. స్థానికంగా సాగు చేసిన పంటకు అధికంగా క్రిమి సంహారక మందులు, ఎరువులు అధికంగా వినియోగించడంతో ఆ పంట నుంచి వచ్చిన విత్తనానికి సరైన నాణ్యత ఉండదనేది రైతుల అభిప్రాయం. దీంతో కర్ణాటక వాతావరణంలో సాగైన మిరపను ఇక్కడ విక్రయిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్న కాలనీల్లో ‘భూ’చోళ్లు
[ 07-07-2024]
అర్హులైన ప్రతి ఒక్కరికీ పట్టాలు అందజేశాం.. ఇళ్లు కాదు.. ఊళ్లు నిర్మిస్తున్నామన్నారు. కొండలు, గుట్టలు, గ్రామాలకు కిలోమీటర్ల దూరంలో.. కనీసం రహదారులు లేని ప్రాంతాల్లో జగనన్న కాలనీలు ఏర్పాటు చేశారు. -
ఖాళీ భవనం..రూ.1.20 కోట్ల అద్దె
[ 07-07-2024]
మానవ హక్కుల కమిషన్ బలంగా ఉంటే ప్రభుత్వం చేసే తప్పిదాలకు సంబంధించిన ఫిర్యాదులు వెల్లువెత్తుతాయి.. -
పుర నిధులు వైకాపా పరం
[ 07-07-2024]
గత ప్రభుత్వ హయాంలో పురపాలికలో చేపట్టిన పనులపై కూటమి సర్కారు దృష్టిసారించింది. -
రామయ్యా.. ఇప్పుడు గుర్తొచ్చామా
[ 07-07-2024]
‘మీకు అవసరం ఉంటేనే సమావేశం నిర్వహిస్తారు. లేకుంటే పట్టించుకోరు.. మూడేళ్లుగా నిర్వహించని సమావేశం ఇప్పుడెందుకు నిర్వహిస్తున్నారు.. -
టన్ను ఇసుక రూ.335
[ 07-07-2024]
ఉచిత ఇసుక విధానం అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది.. ఈ నెల 8 నుంచి కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది.. ఈ నేపథ్యంలో జిల్లాలో అవసరం.. ఎక్కడి నుంచి తీసుకురావాలి.. -
గుడికంబాలిలో 29 వేల మెట్రిక్ టన్నులు
[ 07-07-2024]
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలమేరకు జిల్లాలో 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానం అమలు చేయనున్నట్లు కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. -
అందాల నల్లమల... ఆస్వాదించేద్దామిలా!
[ 07-07-2024]
చుట్టూ పచ్చని చెట్లు...పక్షుల కిలకిలారావాలు...ప్రకృతి రమణీయతను ఆస్వాదించాలని ఎవరైనా అనుకుంటే ఒక్కసారి నల్లమల సందర్శించాల్సిందే. -
బిల్లుల గోలే.. సమస్యలపై దృష్టేదీ
[ 07-07-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చి వాటి పరిష్కారానికి కృషి చేయాల్సిన జడ్పీ పాలకమండలి సభ్యులు పెండింగ్ బిల్లులపై మాత్రం గళం విప్పారు. -
ప్రహ్లాదవరదునికి 473 కలశాలతో అభిషేకం
[ 07-07-2024]
ఆళ్లగడ్డ మండలంలోని దిగువ అహోబిలం ఆలయ జీర్ణోద్ధరణ అష్టదిగ్బంధన మహా సంప్రోక్షణ వైభవంగా సాగుతోంది. -
తవ్వేసి.. తరలించేసి...
[ 07-07-2024]
రహదారి విస్తరణ పేరిట మట్టిని కొల్లగొట్టేస్తున్నారు. మొన్నటివరకు కొండలుగుట్టల్ని వదల్లేదు.. ఇప్పుడు పొలాలకు వెళ్లే దారి పక్కనే లోతుగా తవ్వేస్తుండటం గమనార్హం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వయసు 57.. సెంచరీలు 1000
-
ఏపీలోని ఆ ఐదు గ్రామాలు.. మళ్లీ భద్రాచలంలో కలిసేనా..?
-
నా హత్యకు కుట్ర పన్నుతున్నారు.. కాటసానిపై తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడి ఫిర్యాదు
-
మూడు నిమిషాలు చర్చించి.. 4 వాయిదాల్లో ముగించేశారు..
-
పాలకోవాకు వెళ్తే ప్రాణాలు పోయాయి.. నలుగురు స్నేహితుల దుర్మరణం
-
నేడు పూరీ జగన్నాథుని విశ్వప్రసిద్ధ రథయాత్ర