logo

నాపై దాడి చేసేందుకు అక్రమార్కుల కుట్ర

ఆదోని నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలకు తాను అడ్డుకట్ట వేస్తుంటే.. జీర్ణించుకోలేని అక్రమార్కులు తనను హత్యచేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఎమ్మెల్యే డాక్టర్‌ పార్థసారథి అన్నారు.

Published : 04 Jul 2024 03:27 IST

ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి

మాట్లాడుతున్న ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి

ఆదోని మార్కెట్, న్యూస్‌టుడే: ఆదోని నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలకు తాను అడ్డుకట్ట వేస్తుంటే.. జీర్ణించుకోలేని అక్రమార్కులు తనను హత్యచేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఎమ్మెల్యే డాక్టర్‌ పార్థసారథి అన్నారు. ఆదోనిలో బుధవారం రాత్రి బంగారు బజారు వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఊరికి మంచి చేసేందుకు వచ్చా, ఇక్కడ అవినీతి అక్రమాలు, భూ కబ్జాలు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు తీవ్రంగా కృషిచేస్తున్నా. ఇలాంటి తరుణంలో నిఘా (ఇంటెలిజెన్స్‌) వర్గాలు హెచ్చరిస్తున్నాయి.. అక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట వేస్తే.. దానికి అలవాటు పడ్డవారు ఊరుకుంటారా మరి. నిజాయతీగా వ్యాపారం చేసే వాడికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అవినీతి, అక్రమాలకు పాల్పడే వారికే కష్టం. వీటన్నింటినీ అడ్డుకుంటా. ఇందులో నా ప్రాణాలు పోయినా ఫర్వాలేదు.. నేను అనుకున్నది చేసి తీరుతా. ఆదోని వాతావరణం ఎంత ఆందోళనకరంగా ఉందో ఈ పరిస్థితిని చూస్తే అర్థమవుతోంది. నాపై దాడి చేస్తే.. కేంద్రంలోని పెద్దలు ఊరుకుంటారా? దాడికి పాల్పడినవాడి పరిస్థితి ఏమిటో ఆలోచించుకోవాలి’ అని అన్నారు. ఇలాంటి బెరింపులకు వెనకడుగు వేయనని, అక్రమాలను అడ్డుకునే తీరుతానని ఆయన స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని