కూటమిలో కలిసేందుకు కసరత్తు
ఉమ్మడి కర్నూలు జిల్లాలో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ‘కూటమి’లో చేరడానికి ముమ్మరం ప్రయత్నాలు చేస్తున్నారు. వైకాపా పాలనలో తమ వార్డులకు నిధులివ్వలేదు.. పార్టీ మార్పే శరణ్యమని కొందరు భావిస్తున్నారు.
ముమ్మర ప్రయత్నాల్లో వైకాపా నాయకులు
అక్రమార్కులను చేర్చుకోవద్దంటున్న కూటమి నేతలు
ఈనాడు, కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లాలో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ‘కూటమి’లో చేరడానికి ముమ్మరం ప్రయత్నాలు చేస్తున్నారు. వైకాపా పాలనలో తమ వార్డులకు నిధులివ్వలేదు.. పార్టీ మార్పే శరణ్యమని కొందరు భావిస్తున్నారు. ఇప్పటికే అవినీతి, అక్రమాలకు పాల్పడి పీకల్లోతు ఇబ్బందుల్లో పడ్డారు. అవన్నీ రుజువైతే పోలీసు కేసులు తప్పవని భయపడి కండువా మార్చే ప్రయత్నంలో ఉన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఎట్టి పరిస్థితిల్లోనూ చేర్చుకోవద్దని స్థానిక నాయకులు తెగేసిచెబుతున్నారు. అలాంటి వారిని చేర్చుకోవద్దని ప్రజలూ విన్నవిస్తున్నారు. ఆదోని పట్టణంలో ఓ కౌన్సిలర్ ఎమ్మెల్యే సమక్షంలో చేరడానికి వస్తే ప్రజలు అడ్డుకోవడం గమనార్హం.
ఎక్కడ ఎవరు చేరారంటే
- కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలోని మూడో వార్డు కార్పొరేటర్ షేక్ షాజహాన్ పర్వీన్, ఆరో వార్డు కార్పొరేటర్ షేక్ నీలోఫర్, 13వ వార్డు కార్పొరేటర్ విజయలక్ష్మి వైకాపా నుంచి కొన్ని రోజుల కిందటే తెదేపాలోకి వచ్చారు. ఎన్నికలకు ముందు నలుగురు చేరారు. 52 వార్డులున్న కర్నూలు కార్పొరేషన్ పరిధిలో ఎనిమిది మంది తెదేపా తరఫున విజయం సాధించగా... తాజా చేరికలతో వారి సంఖ్య 15కు పెరిగినట్లైంది. మరో ఐదుగురు తెదేపాలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు.
- ఆదోనిలో కౌన్సిలర్లు లలితమ్మ, చిన్న, పద్మావతి బుధవారం భాజపాలో చేరారు. ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారితోపాటు ఆదోని ఎంపీపీ బడాయి దానమ్మ, పలువురు సర్పంచులు చేరారు. ఆదోని పురపాలక సంస్థ పరిధిలో 42 మంది కౌన్సిలర్లలో 41 మంది వైకాపాకు చెందిన వారుండగా, ఒక్కరే తెదేపాకు చెందినవారు కావడం గమనార్హం. ఎమ్మెల్యే పార్థసారధి భాజపాకు చెందినవారు కావడంతో పలువురు ఆపార్టీలోనూ చేరేందుకు మొగ్గు చూపుతున్నారు.
- ఎమ్మిగనూరు పురపాలిక పరిధిలో 34 మంది కౌన్సిలర్లు ఉండగా వారిలో 31 మంది వైకాపాకు చెందినవారే. మిగిలిన ముగ్గురు తెదేపా కౌన్సిలర్లలో ఒకరు మృతి చెందారు. పురపాలికలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ కౌన్సిలర్ తెదేపా జిల్లా అధ్యక్షుడిని బుధవారం కలవడం చర్చనీయాంశమవుతోంది.
- ఆళ్లగడ్డ పురపాలికలో 27 మంది కౌన్సిలర్లు ఉండగా వారిలో ముగ్గురు తెదేపాకు చెందినవారున్నారు. ఎన్నికలకు ముందే కౌన్సిలర్ సుధామణి తెదేపాలో చేరగా, తాజాగా వైకాపాకు చెందిన లక్ష్మీ నరసింహులు, వెంకటసుబ్బయ్య, బాలబ్బి, మహబూబ్బాషా, మల్లేశ్వరి, వైస్ ఛైర్మన్ నాయబ్రసూల్ తెదేపాలోకి వచ్చారు. కౌన్సిలర్ గురుమూర్తి జనసేనలోకి వచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్న కాలనీల్లో ‘భూ’చోళ్లు
[ 07-07-2024]
అర్హులైన ప్రతి ఒక్కరికీ పట్టాలు అందజేశాం.. ఇళ్లు కాదు.. ఊళ్లు నిర్మిస్తున్నామన్నారు. కొండలు, గుట్టలు, గ్రామాలకు కిలోమీటర్ల దూరంలో.. కనీసం రహదారులు లేని ప్రాంతాల్లో జగనన్న కాలనీలు ఏర్పాటు చేశారు. -
ఖాళీ భవనం..రూ.1.20 కోట్ల అద్దె
[ 07-07-2024]
మానవ హక్కుల కమిషన్ బలంగా ఉంటే ప్రభుత్వం చేసే తప్పిదాలకు సంబంధించిన ఫిర్యాదులు వెల్లువెత్తుతాయి.. -
పుర నిధులు వైకాపా పరం
[ 07-07-2024]
గత ప్రభుత్వ హయాంలో పురపాలికలో చేపట్టిన పనులపై కూటమి సర్కారు దృష్టిసారించింది. -
రామయ్యా.. ఇప్పుడు గుర్తొచ్చామా
[ 07-07-2024]
‘మీకు అవసరం ఉంటేనే సమావేశం నిర్వహిస్తారు. లేకుంటే పట్టించుకోరు.. మూడేళ్లుగా నిర్వహించని సమావేశం ఇప్పుడెందుకు నిర్వహిస్తున్నారు.. -
టన్ను ఇసుక రూ.335
[ 07-07-2024]
ఉచిత ఇసుక విధానం అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది.. ఈ నెల 8 నుంచి కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది.. ఈ నేపథ్యంలో జిల్లాలో అవసరం.. ఎక్కడి నుంచి తీసుకురావాలి.. -
గుడికంబాలిలో 29 వేల మెట్రిక్ టన్నులు
[ 07-07-2024]
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలమేరకు జిల్లాలో 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానం అమలు చేయనున్నట్లు కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. -
అందాల నల్లమల... ఆస్వాదించేద్దామిలా!
[ 07-07-2024]
చుట్టూ పచ్చని చెట్లు...పక్షుల కిలకిలారావాలు...ప్రకృతి రమణీయతను ఆస్వాదించాలని ఎవరైనా అనుకుంటే ఒక్కసారి నల్లమల సందర్శించాల్సిందే. -
బిల్లుల గోలే.. సమస్యలపై దృష్టేదీ
[ 07-07-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చి వాటి పరిష్కారానికి కృషి చేయాల్సిన జడ్పీ పాలకమండలి సభ్యులు పెండింగ్ బిల్లులపై మాత్రం గళం విప్పారు. -
ప్రహ్లాదవరదునికి 473 కలశాలతో అభిషేకం
[ 07-07-2024]
ఆళ్లగడ్డ మండలంలోని దిగువ అహోబిలం ఆలయ జీర్ణోద్ధరణ అష్టదిగ్బంధన మహా సంప్రోక్షణ వైభవంగా సాగుతోంది. -
తవ్వేసి.. తరలించేసి...
[ 07-07-2024]
రహదారి విస్తరణ పేరిట మట్టిని కొల్లగొట్టేస్తున్నారు. మొన్నటివరకు కొండలుగుట్టల్ని వదల్లేదు.. ఇప్పుడు పొలాలకు వెళ్లే దారి పక్కనే లోతుగా తవ్వేస్తుండటం గమనార్హం.
తాజా వార్తలు (Latest News)
-
సినీ ప్రొడక్షన్ విభాగ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ ఆత్మహత్య
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
నెల్లూరు మేయర్ భర్తే ఫోర్జరీ సంతకాల సూత్రధారి
-
కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడి హత్య కేసు దోషులను నిర్దోషులుగా ప్రకటించిన హైకోర్టు
-
మణికొండలో కేవ్ పబ్పై టీజీ న్యాబ్ అధికారుల దాడులు
-
ఇక టెట్ ఏటా రెండుసార్లు