సాగు యంత్రం..వైకాపా కుతంత్రం
వైఎస్సార్ యంత్రసేవా కేంద్రాలు (సీహెచ్సీ) వైకాపా నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను బృందాలుగా నియమించింది
కార్యకర్తల ఇళ్ల వద్దే ట్రాక్టర్లు
రైతులకు దక్కని సేవలు
మద్దికెర మండలంలో వైకాపా కార్యకర్త ఇంటి ఎదుట ఉన్న ట్రాక్టర్
వైఎస్సార్ యంత్రసేవా కేంద్రాలు (సీహెచ్సీ) వైకాపా నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను బృందాలుగా నియమించింది. అప్పటి వైకాపా ప్రజాప్రతినిధులు సిఫారసులు ఉన్నవారికే సాగు యంత్రాలు కట్టబెట్టారు. వారికి సహకార బ్యాంకులో రుణాలు ఇప్పించి ఆ బ్యాంకును నిండా ముంచారు. వైకాపా హయాంలో పంపిణీ చేసిన సాగు యంత్రాలపై విచారణ చేయనున్నట్లు ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ యంత్రసేవ పథకం తీరుపై ‘న్యూస్టుడే’ ఆరా తీయగా.. పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. తెదేపా హయాంలో ‘రైతు రథం’ పేరిట ఒక్కో రైతుకు రూ.2.50 లక్షల రాయితీపై 650 మందికిపైగా రైతులకు ట్రాక్టర్లు అందజేసేవారు. టార్పాలిన్లు, తైవాన్ స్ప్రేయర్లు, రోటావేటర్లు, పవర్ టిల్లర్లు, హార్వెస్టర్లు పంపిణీ చేసేవారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏటా రూ.30-50 కోట్లు ఖర్చు చేసేవారు. ఈ పథకాన్ని పునరుద్ధరించాలని రైతులు విన్నవిస్తున్నారు.
కర్నూలు వ్యవసాయం, మద్దికెర, న్యూస్టుడే: ఉమ్మడి కర్నూలు జిల్లాలో 877 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. ప్రతి కేంద్రం పరిధిలో వినియోగదారుల అద్దె కేంద్రాన్ని (కస్టమ్ హైరింగ్ సెంటర్-సీహెచ్సీ) నెలకొల్పారు. ఐదారుగురు రైతులను కలిపి ఓ బృందంగా ఏర్పాటు చేశారు. ఒక యూనిట్ విలువ రూ.15 లక్షలు.. అందులో 10 శాతం రైతులు, 50 శాతం బ్యాంకు రుణం, మిగిలిన 40 శాతం రాయితీ (రూ.6 లక్షలు)గా ఉంటుంది. 2021 నుంచి 2023 వరకు కర్నూలు జిల్లాలో 466, నంద్యాల జిల్లాలో 411 వైఎస్సార్ యంత్ర సేవా యూనిట్లు మంజూరు చేశారు. ఇవన్నీ వైకాపా కార్యకర్తలకే కట్టబెట్టారు. రాయితీ రూపంలో ఆ పార్టీ కార్యకర్తలకు రూ.62.70 కోట్ల అందజేయడం గమనార్హం.
రైతుల విన్నపాలు బుట్టదాఖలు
చిన్న ట్రాక్టర్లు, వాటికి అనుబంధ పరికరాలు, తోలు దుక్కుల మడలు, విత్తన గొర్రులు, రోటావేటర్లు, పవర్ టిల్లర్లు, కలుపు తీసే పవర్ వీడర్లు, బహుళ పంటల మార్పిడి యంత్రాలు, టార్పాలిన్లు, అధునాతన తైవాన్ స్ప్రేయర్లు కావాలని అడుగుతున్నా వైకాపా ప్రభుత్వం స్పందించలేదు. 2022 ఆగస్టులో రాయితీపై కర్నూలు జిల్లాలో 25 మండలాలకు 75, నంద్యాల జిల్లాలో 28 మండలాలకు 84 కలిపి 159 డ్రోన్లు రాయితీపై పంపిణీ చేస్తామన్నారు. 20 నెలలు దాటినా రాయితీపై ఒక్కటీ ఇవ్వలేదు. కర్నూలు జిల్లాలో గతేడాది నవంబరు నుంచి ఇప్పటి వరకు 37 మంది పైలట్ శిక్షణ పూర్తి చేసుకోగా, నంద్యాల జిల్లాలో మరో 40 మంది సాంకేతిక శిక్షణ పూర్తి చేసుకున్నారు. అయినా ఇప్పటి వరకు డ్రోన్లు సరఫరా చేయలేదు.
సహకార బ్యాంకును ముంచారు
అప్పటి వైకాపా ఎమ్మెల్యేల సిఫారసు మేరకు బృందంగా ఏర్పడిన ఆ పార్టీ కార్యకర్తలు సహకార బ్యాంకులో ఖాతాలు తెరిచారు. 10 శాతం వాటా చెల్లించి రూ.7.50 లక్షలు రుణం తీసుకున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా 350-400 వరకు రైతు బృందాలకు వైఎస్సార్ యంత్ర సేవా పథకాన్ని మంజూరు చేశారు. ఇందుకు రూ.30 కోట్లకుపైగా సహకార బ్యాంకులో రుణాలు పొందారు. వాటిని అద్దెలకు ఇచ్చి వచ్చిన సొమ్ముతో రుణ వాయిదాలు చెల్లించాలి. సక్రమంగా చెల్లించకపోవడంతో బకాయిలు కొండలా పేరుకుపోయాయి. చెల్లించాలని సహకార బ్యాంకు శాఖ అధికారులు నేతల చుట్టూ తిరుగుతున్నా స్పందనలేదు.
అద్దె సొమ్ము ఆరగించారు
రాయితీ యంత్రాలను ఆర్బీకేల ఎదుట ఉంచి అవసరమైన వారికి అద్దెకు ఇవ్వాలి. క్షేత్ర స్థాయిలో అలా జరగడం లేదు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వైకాపా నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరించారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికి 2,717 మంది రైతులు అద్దె ప్రాతిపదికన యంత్రాలు తీసుకున్నారు. తీసుకున్నవారి వివరాలు యాప్లో నమోదు చేయాల్సి ఉండగా... అలా జరగలేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు 877 యూనిట్లు మంజూరు చేయగా కర్నూలు జిల్లాలో 84 సీహెచ్సీలు, నంద్యాల జిల్లాలో 32 మాత్రమే వినియోగంలో ఉన్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ వెల్లడించిన నివేదికలు చెబుతున్నాయి. కొన్ని సీహెచ్సీ యూనిట్లను వైకాపా నాయకులు ఇతరులకు విక్రయించారు. ఆర్బీకేల దగ్గర ఉండాల్సిన యంత్ర సేవా యూనిట్లు వైకాపా నేతల ఇళ్ల వద్ద ఉండటం గమనార్హం.
రూ.180 కోట్ల దారి మళ్లింపు
సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ (ఎస్ఎంఏఎం) కింద ఏటా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నిధులు మంజూరు చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఏడాదికి సుమారు రూ.50 కోట్లతో సాగుకు అవసరమయ్యే పరికరాలు రాయితీపై ఇవ్వాలి. 2021 నుంచి 2023-24 వరకు రూ.150 కోట్ల విలువ చేసేవి పంపిణీ చేయాల్సి ఉండగా, మూడేళ్లలో వైకాపా ప్రభుత్వం కనీసం రూ.30 కోట్ల విలువైనవి ఇవ్వలేకపోయింది. మూడేళ్లల్లో రూ.180 కోట్లను అప్పటి ప్రభుత్వం దారి మళ్లించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గదులు కూల్చారు.. చదువుకు గండం తెచ్చారు
[ 06-07-2024]
నాడు.. నేడు పాఠశాలల ప్రగతిని మార్చుతోంది.. రూ.కోట్లు వెచ్చించి బడుల రూపురేఖలు మార్చుతున్నట్లు ఐదేళ్లుగా వైకాపా నేతలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. -
పురుగుల అన్నం తినలేకున్నాం
[ 06-07-2024]
‘అన్నంలో పురుగులు, బొద్దింకలు ఉంటున్నాయి. వెంట్రుకలు వస్తున్నాయి. ఒక్క పూట కూడా కడుపు నిండా భోజనం చేయడం లేదు. -
గదులు కూల్చారు.. భావితరానికి చిక్కులు తెచ్చారు
[ 06-07-2024]
నాడు.. నేడు పాఠశాలల ప్రగతిని మార్చుతోంది.. రూ.కోట్లు వెచ్చించి బడుల రూపురేఖలు మార్చుతున్నట్లు ఐదేళ్లుగా వైకాపా నేతలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. -
ఆక్రమణలకేసీ చూడండి
[ 06-07-2024]
రెండు లక్షల ఎకరాలకు సాగు.. వందలాది రైతు కుటుంబాల జీవనాధారమైన కేసీ కాల్వను వైకాపా నేతలు ఛిద్రం చేశారు.. కాల్వ వెంట ఉన్న ఖాళీ స్థలాలకు కబ్జా చేసి సాగునీటికి అడ్డుకట్ట వేశారు. -
విత్తన, ఎరువుల దుకాణాల్లో తనిఖీలు
[ 06-07-2024]
వ్యవసాయశాఖ కమిషనర్ ఆదేశాలమేరకు రాష్ట్రవ్యాప్తంగా విత్తన, ఎరువుల, పురుగు మందుల విక్రయ దుకాణాల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. -
పేదింటి బిడ్డలు.. ప్రతిభలో శ్రీమంతులు
[ 06-07-2024]
వారంతా పేదింటి బిడ్డలు.. ప్రతిభలో మాత్రం శ్రీమంతులు. లక్ష్మీ కటాక్షం లేకపోవచ్చు.. సరస్వతి అనుగ్రహం మాత్రం పుష్కలం. ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ.. మరో వైపు హ్యాండ్బాల్ క్రీడలో రాణిస్తున్నారు. -
శ్రీశైలంలో శిలపై శివలింగం గుర్తింపు
[ 06-07-2024]
శ్రీశైల మహాక్షేత్రంలోని రుద్రాక్షమఠం-సారంగధారమఠం మధ్య బండరాతి శిలపై చెక్కిన శివలింగాన్ని గుర్తించారు. అక్కడ రహదారి విస్తరణ, ప్రహరీ నిర్మాణ పనుల్లో భాగంగా మట్టిని తొలగిస్తుండగా గురువారం శివలింగం ఆకారాన్ని కనుగొన్నారు. -
మహానందిలో చిరుత సంచారం
[ 06-07-2024]
మహానందిలో మళ్లీ చిరుతపులి సంచరించింది. మనుషుల ప్రాణాలు పోయేంత వరకు చిరుతను పట్టుకోరా..?అంటూ మహానంది ప్రజలు అటవీశాఖ తీరుతెన్నులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
డిగ్రీలో ప్రవేశానికి వేళాయె!
[ 06-07-2024]
డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియ ఆరంభమైంది. ఇప్పటికే ప్రకటన విడుదల కాగా, గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఆన్లైన్ పద్ధతిలోనే ప్రవేశాలు జరపనున్నారు. -
భక్తి పేరుతో భూముల స్వాహా
[ 06-07-2024]
మండల పరిధిలోని కొమ్ముచెరువు ఆంజనేయస్వామి ఆలయంలో పెద్దఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి. ఆలయంలో ఓ వ్యక్తి పెత్తనం చెలాయిస్తున్నారు. -
విజయవాడ నుంచి త్వరలో విమాన సర్వీసులు
[ 06-07-2024]
విజయవాడ నుంచి కర్నూలుకు త్వరలోనే విమాన సర్వీసులు ప్రారంభిస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. -
అన్ని రంగాల అభివృద్ధే లక్ష్యం
[ 06-07-2024]
మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో పాటు గ్రామాభివృద్ధికి పాటుపడినప్పుడే సంపూర్ణ అభియాన్ లక్ష్యం నెరవేరుతుందని కలెక్టర్ రంజిత్బాషా, ఎమ్మెల్యే కేఈ శ్యాంకుమార్, నీతీ ఆయోగ్ రాష్ట్ర కోఆర్డినేటర్ స్మృతి సబర్వాల్, ఆర్డీవో రామలక్ష్మి తదితరులు అన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
[ 06-07-2024]
జాతీయ ఉపాధ్యాయ పురస్కారానికి అర్హులైన ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో శామ్యూల్ ఒక ప్రకటనలో కోరారు. -
లా సెమిస్టర్ ఫలితాల విడుదల
[ 06-07-2024]
రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో ఏప్రిల్లో జరిగిన లా 3, 5వ ఏడాదికి సంబంధించి 2, 4, 6, 8, 10వ సెమిస్టర్ ఫలితాలు విడుదల చేసినట్లు రెక్టార్ ఎన్టీకే నాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గుంతకల్లు రైల్వే డీఆర్ఎం కార్యాలయంలో ముగిసిన సోదాలు.. సీబీఐ అదుపులో 8 మంది అధికారులు
-
బుల్లి వారసులతో ముకేశ్-నీతా అంబానీ కారు షికారు: వీడియో చూశారా?
-
హాథ్రస్ తొక్కిసలాట.. తొలిసారి మీడియా ముందుకు భోలేబాబా
-
రివ్యూ: శశి మథనం.. ప్రేమికుడు ఎరక్కపోయి ఇరుక్కుంటే?
-
మిర్యాలగూడ స్టేషన్లో నిలిచిన ఫలక్నుమా సూపర్ఫాస్ట్ రైలు
-
కోర్ బ్రాంచీల్లో చేరితే స్కాలర్షిప్