ఓర్వకల్లు పొదుపు మహిళల స్ఫూర్తి ఆదర్శనీయం
చేతికష్టం నుంచి నెలవారీగా పొదుపు చేస్తూ ఆర్థిక పరిపుష్టి సాధించిన ఓర్వకల్లు పొదుపు మహిళల స్ఫూర్తి దేశానికే ఆదర్శమని కలెక్టర్ రంజిత్బాషా, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ అన్నారు.
జ్యోతి వెలిగిస్తున్న పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, కలెక్టర్ రంజిత్బాషా, వేదికపై తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ తదితరులు
ఓర్వకల్లు, న్యూస్టుడే: చేతికష్టం నుంచి నెలవారీగా పొదుపు చేస్తూ ఆర్థిక పరిపుష్టి సాధించిన ఓర్వకల్లు పొదుపు మహిళల స్ఫూర్తి దేశానికే ఆదర్శమని కలెక్టర్ రంజిత్బాషా, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ అన్నారు. ఓంప్లిస్ (ఓర్వకల్లు పొదుపు లక్ష్మి ఐక్య సంఘం) ఆధ్వర్యంలో రజతోత్సవ వేడుకలను మంగళవారం నిర్వహించారు. ఓంప్లిస్ గౌరవ సలహాదారురాలు విజయభారతి అధ్యక్షతన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలభారతి పాఠశాలలో వెంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కలెక్టర్, ఎమ్మెల్యే జ్యోతి వెలిగించి మాట్లాడారు. ఓర్వకల్లు పొదుపు మహిళలు సంఘాల ఏర్పాటుతో ఆర్థిక విజయం సాధించటంతోపాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో సంఘాలు ఏర్పాటుచేసి అక్కడి మహిళలకు పొదుపు పాఠాలు నేర్పి ఆదర్శంగా నిలిచారన్నారు. పొదుపు సంఘాల ఏర్పాటుకు ప్రస్తుత ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అప్పట్లోనే నాంది పలికారని చెప్పారు. మహిళా సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పెద్దపీట వేశారన్నారు. అంతకు ముందు విజయభారతి మాట్లాడుతూ మండలంలో 22 గ్రామాల్లోని వెయ్యి సంఘాల్లో 12 వేల మంది మహిళలు ఉన్నారన్నారు. మహిళా బ్యాంకు ద్వారా రూ.3 కోట్ల లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. తహసీల్దారు నటరాజ్, ఎంపీడీవో మల్లేశ్వరి, సర్పంచులు మోహన్రెడ్డి, వెంకటరమణ, చంద్ర గోవర్ధనమ్మ, వెలుగు పీడీ సలీంబాషా, తెదేపా నంద్యాల జిల్లా మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ, తెదేపా మండల కన్వీనర్ గోవిందరెడ్డి, ఆర్యూ విద్యార్థి సంఘాల ఐకాస కన్వీనర్ శ్రీరాములు, సీనియర్ నాయకులు సుధాకరరెడ్డి, లక్ష్మీకాంతారెడ్డి తదితరలున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గదులు కూల్చారు.. చదువుకు గండం తెచ్చారు
[ 06-07-2024]
నాడు.. నేడు పాఠశాలల ప్రగతిని మార్చుతోంది.. రూ.కోట్లు వెచ్చించి బడుల రూపురేఖలు మార్చుతున్నట్లు ఐదేళ్లుగా వైకాపా నేతలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. -
పురుగుల అన్నం తినలేకున్నాం
[ 06-07-2024]
‘అన్నంలో పురుగులు, బొద్దింకలు ఉంటున్నాయి. వెంట్రుకలు వస్తున్నాయి. ఒక్క పూట కూడా కడుపు నిండా భోజనం చేయడం లేదు. -
గదులు కూల్చారు.. భావితరానికి చిక్కులు తెచ్చారు
[ 06-07-2024]
నాడు.. నేడు పాఠశాలల ప్రగతిని మార్చుతోంది.. రూ.కోట్లు వెచ్చించి బడుల రూపురేఖలు మార్చుతున్నట్లు ఐదేళ్లుగా వైకాపా నేతలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. -
ఆక్రమణలకేసీ చూడండి
[ 06-07-2024]
రెండు లక్షల ఎకరాలకు సాగు.. వందలాది రైతు కుటుంబాల జీవనాధారమైన కేసీ కాల్వను వైకాపా నేతలు ఛిద్రం చేశారు.. కాల్వ వెంట ఉన్న ఖాళీ స్థలాలకు కబ్జా చేసి సాగునీటికి అడ్డుకట్ట వేశారు. -
విత్తన, ఎరువుల దుకాణాల్లో తనిఖీలు
[ 06-07-2024]
వ్యవసాయశాఖ కమిషనర్ ఆదేశాలమేరకు రాష్ట్రవ్యాప్తంగా విత్తన, ఎరువుల, పురుగు మందుల విక్రయ దుకాణాల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. -
పేదింటి బిడ్డలు.. ప్రతిభలో శ్రీమంతులు
[ 06-07-2024]
వారంతా పేదింటి బిడ్డలు.. ప్రతిభలో మాత్రం శ్రీమంతులు. లక్ష్మీ కటాక్షం లేకపోవచ్చు.. సరస్వతి అనుగ్రహం మాత్రం పుష్కలం. ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ.. మరో వైపు హ్యాండ్బాల్ క్రీడలో రాణిస్తున్నారు. -
శ్రీశైలంలో శిలపై శివలింగం గుర్తింపు
[ 06-07-2024]
శ్రీశైల మహాక్షేత్రంలోని రుద్రాక్షమఠం-సారంగధారమఠం మధ్య బండరాతి శిలపై చెక్కిన శివలింగాన్ని గుర్తించారు. అక్కడ రహదారి విస్తరణ, ప్రహరీ నిర్మాణ పనుల్లో భాగంగా మట్టిని తొలగిస్తుండగా గురువారం శివలింగం ఆకారాన్ని కనుగొన్నారు. -
మహానందిలో చిరుత సంచారం
[ 06-07-2024]
మహానందిలో మళ్లీ చిరుతపులి సంచరించింది. మనుషుల ప్రాణాలు పోయేంత వరకు చిరుతను పట్టుకోరా..?అంటూ మహానంది ప్రజలు అటవీశాఖ తీరుతెన్నులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
డిగ్రీలో ప్రవేశానికి వేళాయె!
[ 06-07-2024]
డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియ ఆరంభమైంది. ఇప్పటికే ప్రకటన విడుదల కాగా, గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఆన్లైన్ పద్ధతిలోనే ప్రవేశాలు జరపనున్నారు. -
భక్తి పేరుతో భూముల స్వాహా
[ 06-07-2024]
మండల పరిధిలోని కొమ్ముచెరువు ఆంజనేయస్వామి ఆలయంలో పెద్దఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి. ఆలయంలో ఓ వ్యక్తి పెత్తనం చెలాయిస్తున్నారు. -
విజయవాడ నుంచి త్వరలో విమాన సర్వీసులు
[ 06-07-2024]
విజయవాడ నుంచి కర్నూలుకు త్వరలోనే విమాన సర్వీసులు ప్రారంభిస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. -
అన్ని రంగాల అభివృద్ధే లక్ష్యం
[ 06-07-2024]
మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో పాటు గ్రామాభివృద్ధికి పాటుపడినప్పుడే సంపూర్ణ అభియాన్ లక్ష్యం నెరవేరుతుందని కలెక్టర్ రంజిత్బాషా, ఎమ్మెల్యే కేఈ శ్యాంకుమార్, నీతీ ఆయోగ్ రాష్ట్ర కోఆర్డినేటర్ స్మృతి సబర్వాల్, ఆర్డీవో రామలక్ష్మి తదితరులు అన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
[ 06-07-2024]
జాతీయ ఉపాధ్యాయ పురస్కారానికి అర్హులైన ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో శామ్యూల్ ఒక ప్రకటనలో కోరారు. -
లా సెమిస్టర్ ఫలితాల విడుదల
[ 06-07-2024]
రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో ఏప్రిల్లో జరిగిన లా 3, 5వ ఏడాదికి సంబంధించి 2, 4, 6, 8, 10వ సెమిస్టర్ ఫలితాలు విడుదల చేసినట్లు రెక్టార్ ఎన్టీకే నాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
భారాసనే ఫిరాయింపులను ప్రోత్సహించింది: జీహెచ్ఎంసీ మేయర్
-
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సంతకం ఫోర్జరీ.. మేయర్ భర్తపై కేసు
-
ఆ ఒక్కటి తక్కువైంది.. ద్రవిడ్ మాటను నెరవేర్చాలి!
-
నిఖత్కు సాటిలేరు.. ఒలింపిక్స్ బరిలో ఇందూరు బాక్సర్
-
గుంతకల్లు రైల్వే DRM ఆఫీస్లో ముగిసిన సోదాలు.. సీబీఐ అదుపులో 8 మంది
-
బుల్లి వారసులతో ముకేశ్-నీతా అంబానీ కారు షికారు: వీడియో చూశారా?